లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్డేట్స్తో రేపు మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గిరిజన మహిళగా పుట్టినందుకు, ఒక మహిళ అయినందుకు గర్వపడుతున్నానని ముర్ము అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్డేట్స్తో రేపు మళ్లీ కలుద్దాం.
పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన వెకేషన్ బెంచ్ తిరస్కరించింది.
''ఈ పిల్పై వాదనలు వినేందుకు సిద్ధంగా లేము'' అని బెంచ్ వ్యాఖ్యానించింది.
సుప్రీం కోర్టు విచారణకు నిరాకరించడంతో పిటిషనర్ తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.
మే 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఒక మహిళగా ఉండడం, గిరిజన సమాజంలో పుట్టడం తప్పేమీ కాదని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
తన కథ అందరికీ తెలుసని ఆమె అన్నారు.
గిరిజన మహిళగా పుట్టినందుకు, ఒక మహిళ అయినందుకు గర్వపడుతున్నానని ముర్ము అన్నారు.
''మహిళగా ఉండడం, గిరిజన సమాజంలో పుట్టడం తప్పు కాదని నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కథ మీ అందరికీ తెలుసు. గిరిజన సమాజంలో పుట్టినందుకు, మహిళను అయినందుకు గర్వపడుతున్నా''అని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ తెలిపింది.
జార్ఖండ్లోని ఖంటీ జిల్లాలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.