జీ7: జపాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ సమావేశం

వీరిద్దరి సమావేశంలో ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. తాజా వార్తలతో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.

    నమస్తే. గుడ్ నైట్.

  2. ఐపీఎల్‌ 2023: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డు, 12వ సారి ప్లే ఆఫ్స్‌కి ధోనీ సేన

  3. రూ.2,000 నోటు ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ప్రజలపై ప్రభావం ఎంత?

  4. మనకు ఏయే జబ్బులు వస్తాయో ఈ బాడీ స్కాన్లు ముందే చెప్పేస్తాయి, ఎలాగంటే..

  5. అటాక్సియా:‘‘ నేను తాగినట్లు నడిచేదాన్ని, డాక్టర్‌ను కలిశాక అసలు విషయం తెలిసింది’’

  6. ఆంధ్రప్రదేశ్: అమరావతిలో పేదలకు ఇళ్లపై అభ్యంతరం ఏమిటి, అధికార పార్టీ దూకుడు ఎందుకు?

  7. జీ7: జపాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ సమావేశం

    ప్రధాని మోదీతో జెలియెన్‌ స్కీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, జీ7 సమావేశాల సందర్భంగా ఇద్దరు నేతలు కలుసుకున్నారు.

    జపాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ సమావేశమైనట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    ఇరువురు నాయకులు ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. జీ7 సదస్సులో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు.

    వీరిద్దరి సమావేశంలో ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

    ప్రధాని మోదీ, జెలియెన్‌స్కీ చర్చలు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ, జెలియెన్‌స్కీ చర్చలు

    రష్యా, యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, జెలియన్ స్కీ కలుసుకోవడం ఇదే మొదటిసారి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడికి సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  8. యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల సూరత్‌లో ‘వజ్రాల ఉద్యోగాలు’ పోతున్నాయి. ఎందుకు?

  9. అదానీ-హిండెన్‌బర్గ్: సెబీపై సుప్రీంకోర్టు కమిటీ ఏం చెప్పింది?

  10. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం

    సిద్ధరామయ్య

    ఫొటో సోర్స్, INC/YouTube

    కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు.

    కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఎన్సీపీ నేత శరద్ పవార్, కమల్ హాసన్ వంటి వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు.

    లింగాయత్, ఒక్కలిగలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

    నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేవారిలో డా.జి పరమేశ్వర(ఎస్సీ), కేహెచ్ మునియప్ప(ఎస్సీ), కేజే జార్జ్(క్రిస్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీశ్ జర్కిహోళీ(ఎస్టీ), ప్రియాంక్ ఖర్గే(ఎస్సీ), రామలింగా రెడ్డి(ఒక్కలిగ), జమీర్ అహ్మద్(ముస్లిం)లు ఉన్నారు.

    డీకే శివకుమార్

    ఫొటో సోర్స్, INC/YouTube

  11. బాస్మతికి ఆ సువాసన ఎలా వస్తుంది? ఇది పండించాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలి?

  12. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం నేడు

    సిద్ధరామయ్య

    ఫొటో సోర్స్, Facebook/Siddaramaiah

    నేడు 12.30 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు.

    కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

    కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఆ పార్టీ పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది.

    బెంగళూరులోని కంఠీరవ స్టేడియడంలో జరిగే ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కమల్ హాసన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ వంటి వారు రానున్నారు.

  13. జల్లికట్టు: ఈ పోటీలో ఎద్దును అదుపు చేసి గెలిచినోళ్లకు పిల్లనిచ్చి పెళ్లి కూడా చేసేవారు, అసలు ఈ ఆటకు ఎందుకింత క్రేజ్?

  14. జపాన్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

    ‘‘హిరోషిమా పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం భయపడుతోంది. ఇక్కడి మహాత్మాగాంధీ విగ్రహం అహింసా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తుంది’’ అని మోదీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.