బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరూ శాశ్వతంగా ఉండిపోలేరు - సౌరవ్ గంగూలీ

"శాశ్వతంగా ఎవరూ ఆడలేరు, అధ్యక్షునిగా కూడా శాశ్వతంగా ఉండలేరు" అని బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. జూమ్ యాప్ వాడకం ప్రమాదమని కేంద్రం హెచ్చరిక

    జూమ్

    ఫొటో సోర్స్, Thiago Prudencio/SOPA Images/LightRocket via Getty Images

    వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారం జూమ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు అందులోకి ప్రవేశించి హానికరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.

    ప్రభుత్వ సంస్థ 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (CERT-In) గురువారం ఒక సూచన జారీ చేస్తూ, జూమ్ ఉత్పత్తులలో ఉన్న లోపాల గురించి హెచ్చరించింది. జూమ్ రెండు వెర్షన్లలోనూ (సాఫ్ట్‌వేర్) ఈ లోపాలు కనిపించాయని తెలిపింది.

    జూమ్‌లోని లోపాలు చాలా తీవ్రమైనవని CERT-In వివరించింది. వీటి వలన సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత భద్రతా పరిమితులను తప్పించుకుని సిస్టంలోకి ప్రవేశించవచ్చు. సిస్టంలో ఉన్న కోడ్‌లను ఉపయోగించడం లేదా సేవలను తిరస్కరించడం లాంటి పనులు చేయగలరు.

    నేరస్థులు జూమ్ క్లయింట్‌లో నడుస్తున్న జూమ్ యాప్‌లకు కనెక్ట్ చేయవచ్చు లేదా నియంత్రించవచ్చు. దీని ద్వారా జూమ్ మీటింగ్‌లో పాల్గొనేవారికి ఆడియో, వీడియో యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు లేదా అంతరాయం కలిగించవచ్చు.

    ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) చట్టం, 2008లో CERT-Inకు అధికారాలు ఇచ్చారు.

    కంప్యూటర్ భద్రతకు సంబంధించిన ఘటనలపై దృష్టి సారించడం, లోపాలను గుర్తించడం, ఐటీ భద్రతను బలోపేతం చేయడం దీని పని. బగ్‌లు, హ్యాకింగ్, ఫిషింగ్ దాడుల గురించి ఇది సమాచారం అందిస్తుంది.

  2. జ్ఞానవాపి మసీదు: శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలనే పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు

  3. చేపల వలలతో ప్రమాదంలో సముద్ర జీవులు

  4. ఆన్‌లైన్‌లో సాయం అడుక్కునేవారి నుంచి 70 శాతం కమీషన్ తీసుకుంటున్న టెక్ సంస్థ

  5. హైదరాబాద్ స్కూళ్లలో పిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయా?

  6. ధన్యవాదాలు !

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

  7. ప్రశ్న పత్రంలో ఇస్లాంను దూషించారంటూ టీజే జోసెఫ్ చేయి నరికారు, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎలా ఉన్నారు?

  8. జనరిక్ మందులు: 50-90 శాతం తక్కువకు లభిస్తున్నా ఎందుకు తక్కువగా కొంటున్నారు?

  9. సింగరేణి గనుల నుంచి నల్ల బంగారం ఎలా తీస్తారో తెలుసా?

  10. 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుగుడు ఏంటి?

  11. కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంతో మంది విద్యార్థుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందంటే...

  12. Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?

  13. "ఎవరూ శాశ్వతంగా అధ్యక్షునిగా ఉండిపోలేరు" - సౌరవ్ గంగూలీ

    సౌరవ్ గంగూలీ

    ఫొటో సోర్స్, ANI

    "ఎవరూ శాశ్వతంగా ఆడలేరు, అధ్యక్షునిగా కూడా శాశ్వతంగా ఉండలేరు" అని బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అన్నారు. క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా ఆయన తన పదవీ కాలాన్ని సంతోషంగా నిర్వహించానని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    "నేను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఐదేళ్లు పని చేశాను. బీసీసీఐ అధ్యక్షునిగా కూడా కొన్నేళ్ల పాటు పని చేశాను. ఒక అధ్యక్షునిగా సంస్థ అభివృద్ధికి, జట్టు సంక్షేమం కోసం చాలా పని చేయాల్సి ఉంటుంది" అని అన్నారు.

    బీసీసీఐ అధ్యక్షునిగా రోజర్ బిన్నీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

  14. సీనియర్ విలేఖరి రానా ఆయూబ్ పై మనీ లాండరింగ్ ఆరోపణలు

    రానా ఆయూబ్

    ఫొటో సోర్స్, RANAAYYUB@FACEBOOK

    సీనియర్ విలేఖరి రానా ఆయూబ్ పై మనీ లాండరింగ్ ఆరోపణల పై కేసు నమోదు చేశారు.

    రానా అయూబ్ మనీ లాండరింగ్ చేశారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ బుధవారం ఘజియాబాద్‌‌లోప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది.

    ఈ మేరకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    2021లో ఉత్తర్ ప్రదేశ్ పోలీసు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ఆధారంగా మనీ లాండరింగ్ ఆరోపణల పై విచారణ చేపట్టింది.

    ఆమె సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరించారనే ఆరోపణలు వచ్చాయి.

    రానా ఆయూబ్ రచయత, విలేఖరి. ఆమె 2007లో తెహెల్కా పత్రికలో పని చేశారు.

    తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు

    ఆయూబ్ 'గుజరాత్ ఫైల్స్ - అనాటమీ ఆఫ్ ఏ కవర్ అప్' రచయత.

  15. పాకిస్తానీ మహిళల్లో చీరల పట్ల ఆసక్తిని పెంచుతున్న ‘ది శారీ గర్ల్‌’ ఐజా హుస్సేన్

  16. INDvsPAK: ‘పాకిస్తాన్‌ బ్యాటర్లు హెల్మెట్ పెట్టుకోకుండానే బ్యాటింగ్ చేస్తారు, భారత్ ఫాస్ట్ బౌలర్ల వేగం సరిపోదు’

    టీ20 ప్రపంచకప్

    ఫొటో సోర్స్, GIUSEPPE CACACE

    ఇంకో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. సూపర్-12 గ్రూప్ మ్యాచ్‌లు అక్టోబర్ 16 నుంచి ఆరంభమవుతాయి.

    అక్టోబరు 23న మెల్‌బోర్న్‌లో భారత, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటినుంచే ఈ మ్యాచ్‌పై వాడి వేడి చర్చలు మొదలయ్యాయి. అనేక రకాల ఊహాగానాలు, వాదనలు సాగుతున్నాయి. మాజీ క్రికెటర్లు ఇరు జట్ల బలాబలాలను విశ్లేషిస్తున్నారు.

    ఇప్పటి పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉందని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా అన్నారు. అయితే, బ్యాటింగ్‌లో భారత జట్టే బలంగా ఉందని ఆన్నారు.

  17. హిజాబ్ నిషేధంపై జస్టిస్ సుధాంశు ధులియా: ‘ఇలాంటి ఆంక్షలతో ముస్లిం బాలికల జీవితాలను మనం మెరుగుపరుస్తున్నామా?'

  18. అనంతపురంలో భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన లారీ

    అనంతపురం

    ఫొటో సోర్స్, UGC

    అనంతపురంలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల తాకిడికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.

    శింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం చెరువులో వరద నీరు ముంచెత్తుతోంది. ఒక లారీ, పోలీస్ట్ స్టేషన్ సమీపంలోని కాలువ దాటుతుండగా వరద ఉధృతికి అదుపుతప్పింది. నీటి ప్రవాహానికి పక్కకు ఒరిగిపోయి కాలువలో పడింది.

    ఇప్పటికే అనంతపురం రూరల్, శింగనమల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలు వరదల నీటిలో చిక్కుకున్నాయి.

    బుక్కరాయసముద్రం వద్ద ప్రమాదంలో చిక్కుకున్న లారీని ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు పోలీసులు చెబుతున్నారు.

    అనంతపురం

    ఫొటో సోర్స్, UGC

    అనంతపురంలో భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయెస్ జగన్‌ సమీక్షించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

    వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని జగన్ అధికారులను సూచించారు.

    బాధిత కుటుంబాలకు రూ.2,000 చొప్పున తక్షణ సహాయం అందించాలని, దీంతోపాటు బియ్యం, పామాయిల్‌, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలని ఆదేశించారు.

    వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారుచేసి, నిర్ణీత సమయంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు.

  19. గుడ్డు ఎందుకు తినాలి? గుడ్డులో ఏమేం ఉంటాయి? వాటివల్ల మన ఆరోగ్యానికి జరిగే మేలు ఏంటి? మీకు తెలియాల్సిన 5 విషయాలు..

  20. కర్నాటక తరగతి గదుల్లో హిజాబ్ నిషేధం కేసు: ఇద్దరు న్యాయమూర్తుల వేర్వేరు తీర్పులు.. విస్తృత ధర్మాసనానికి ఇవ్వాలని సీజేఐకి విజ్ఞప్తి