జూమ్ యాప్ వాడకం ప్రమాదమని కేంద్రం హెచ్చరిక

ఫొటో సోర్స్, Thiago Prudencio/SOPA Images/LightRocket via Getty Images
వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారం జూమ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు అందులోకి ప్రవేశించి హానికరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.
ప్రభుత్వ సంస్థ 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (CERT-In) గురువారం ఒక సూచన జారీ చేస్తూ, జూమ్ ఉత్పత్తులలో ఉన్న లోపాల గురించి హెచ్చరించింది. జూమ్ రెండు వెర్షన్లలోనూ (సాఫ్ట్వేర్) ఈ లోపాలు కనిపించాయని తెలిపింది.
జూమ్లోని లోపాలు చాలా తీవ్రమైనవని CERT-In వివరించింది. వీటి వలన సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత భద్రతా పరిమితులను తప్పించుకుని సిస్టంలోకి ప్రవేశించవచ్చు. సిస్టంలో ఉన్న కోడ్లను ఉపయోగించడం లేదా సేవలను తిరస్కరించడం లాంటి పనులు చేయగలరు.
నేరస్థులు జూమ్ క్లయింట్లో నడుస్తున్న జూమ్ యాప్లకు కనెక్ట్ చేయవచ్చు లేదా నియంత్రించవచ్చు. దీని ద్వారా జూమ్ మీటింగ్లో పాల్గొనేవారికి ఆడియో, వీడియో యాక్సెస్ను బ్లాక్ చేయవచ్చు లేదా అంతరాయం కలిగించవచ్చు.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) చట్టం, 2008లో CERT-Inకు అధికారాలు ఇచ్చారు.
కంప్యూటర్ భద్రతకు సంబంధించిన ఘటనలపై దృష్టి సారించడం, లోపాలను గుర్తించడం, ఐటీ భద్రతను బలోపేతం చేయడం దీని పని. బగ్లు, హ్యాకింగ్, ఫిషింగ్ దాడుల గురించి ఇది సమాచారం అందిస్తుంది.





