ఇవాళ్టి ముఖ్యాంశాల్లో కొన్ని..

ఫొటో సోర్స్, Reuters
తమ భూభాగంలో ఉన్న ఒక చమురు డిపోపై యుక్రెయిన్ హెలికాప్టర్లు దాడి చేశాయని రష్యా చెబుతోంది.
శాంతి చర్చలకు ఇలాంటి ఘటనలు సానుకూల వాతావరణం కల్పించబోవని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి చెప్పారు.
అయితే, రష్యా ఆయిల్ డిపోపై దాడి చేసింది తమ సైన్యమో కాదో నిర్ధరించలేమని, అదే సమయంలో ఖండించడమూ లేదని యుక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది.
మరియుపూల్ నుంచి మరింత మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుక్రెయిన్, రష్యా ఉన్నతాధికారులు అంగీకరించారని రెడ్ క్రాస్ వెల్లడించింది.
భారత పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ‘ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రష్యా, భారత్ బంధం చెక్కు చెదరదు’ అని సెర్జీ లావ్రోవ్ అన్నారు.
శ్రీలంకలో అధ్యక్ష భవనం వద్ద నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింస వెనుక తీవ్రవాదులు ఉన్నారని అధ్యక్ష కార్యాలయం ఆరోపించింది.
ఆంధ్రప్రదేశ్లో ‘వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ పథకం కింద 500 కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.















