మాక్రాన్‌తో పుతిన్: ‘చర్చలా, యుద్ధమా.. ఏదో ఒక మార్గంలో మా డిమాండ్లు నెరవేర్చుకుంటాం’

ఆదివారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు రెండు గంటల పాటు ఫోన్లో చర్చించుకున్నారు. చర్చలు, లేదంటే యుద్ధం.. ఏదో ఒక మార్గంలో తాము తమ డిమాండ్లు నెరవేర్చుకుంటామని పుతిన్ స్పష్టం చేశారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ

  1. యుక్రెయిన్-రష్యా యుద్ధం: గత కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..

    యుక్రెయిన్‌లోని మరియుపూల్‌ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ మళ్లీ ఆగిపోయింది. రష్యా నిరంతరం దాడులు చేస్తుంటే ప్రజలను తరలించడం అసాధ్యమని మరియుపూల్ సిటీ కౌన్సిల్ పేర్కొంది. శనివారం కూడా ఇలాంటి ప్రయత్నం విఫలమైంది.

    కీయెవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్పిన్‌ పట్టణంపై రష్యా ఇవాళ కూడా దాడులు చేసింది. ఈ పట్టణంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇర్పిన్ నుంచి పారిపోతున్న ప్రజల్లో ముగ్గురు చనిపోయారని భావిస్తున్నారు. ప్రజలు వాడుతున్న ధ్వంసమైన బ్రిడ్జిపై రష్యా దాడి చేయడంతో వారు చనిపోయారని చెబుతున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    15 లక్షల మంది ప్రజలు యుక్రెయిన్ నుంచి ఇరుగుపొరుగునున్న దేశాలకు వెళ్లారని యూఎన్ పేర్కొంది.

    రష్యాలోని పలు నగరాల్లో యుద్ధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు చేపట్టిన సుమారు 2వేల మందిని అదుపులోకి తీసుకున్నారు.

    మాస్కో డిమాండ్లు నెరవేరే వరకు యుక్రెయిన్‌పై సైనిక చర్య ఆపేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.

    ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

  2. స్కూళ్లు, ఆసుపత్రులపైనా బాంబులు వేస్తున్న రష్యా - యుక్రెయిన్ ఉప ప్రధాని

    యుక్రెయిన్ ఉప ప్రధాని

    యుక్రెయిన్‌లో ప్రజలను కూడా లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడుతోందని, ఆసుపత్రులు, నర్సరీలు, స్కూళ్లపైనా అటాక్ చేస్తోందని యుక్రెయిన్ ఉప ప్రధాని ఓల్గా స్టెఫానిషైన అన్నారు.

    ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. యుక్రెయిన్ సైన్యం నుంచి రష్యాకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురైందని, దీంతో ప్రజలకు వ్యతిరేకంగా రష్యా భారీ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పారు.

    భూమిపైనుంచి దాడులు చేయటంతో పాటు ఆకాశం నుంచి కూడా బాంబులు వేస్తూ రష్యా 'తీవ్రవాద ప్రణాళిక'ను అమలు చేస్తోందని ఆమె ఆరోపించారు.

  3. బ్రేకింగ్ న్యూస్, మరియుపూల్‌ నుంచి ప్రజల తరలింపు నిలిపివేత: ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్

    వలసదారులు

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లోని మరియుపూల్ నగరం నుంచి ప్రజల తరలింపు నిలిచిపోయిందని రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ వెల్లడించింది.

    కాల్పుల విరమణ విఫలం కావడానికి కారణం మీరంటే మీరని రష్యా, యుక్రెయిన్‌ పరస్పరం నిందించుకుంటున్నాయి.

    రష్యా నిరంతరం కాల్పులు, బాంబు దాడులు చేస్తుంటే ప్రజలను సురక్షితంగా తరలించడం అసాధ్యమని మరియుపూల్ సిటీ కౌన్సిల్ చెప్పింది.

    ప్రజల తరలింపు ప్రక్రియ నిలిచిపోయినట్లు నిర్ధారించింది.

  4. మా డిమాండ్లు నెరవేరిన తర్వాతే యుక్రెయిన్‌పై దాడి ఆగుతుంది: పుతిన్

    బాంబు పేలుళ్లు

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ పోరాటం ఆపేసిన తర్వాత, తమ డిమాండ్లు నెరవేరిన తర్వాతే ఆ దేశంపై దాడి ఆగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.

    టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన పుతిన్ ఈ విషయం స్పష్టం చేశారని క్రెమ్లిన్ వెల్లడించింది.

    యుక్రెయిన్‌పై దాడి అంతా ప్లాన్ ప్రకారమే వెళ్తోందని పుతిన్ మరోసారి చెప్పారు.

    రష్యా సైనిక చర్య అనుకున్న దానికంటే నెమ్మెదిగా వెళ్తోందని కొందరు పాశ్చాత్య రక్షణ రంగ నిపుణులు విశ్లేషించిన తర్వాత కూడా పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

    చర్చలకు వస్తున్న యుక్రెయిన్ ప్రతినిధులు మరింత నిర్మాణాత్మక వైఖరిని ప్రదర్శిస్తారని పుతిన్ ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో క్రెమ్లిన్ పేర్కొంది.

    మరోవైపు, తక్షణం కాల్పుల విరమణ పాటించాలని ఎర్దోవాన్‌ పుతిన్‌ను కోరినట్లు టర్కీ అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది.

  5. గూఢచారి నుంచి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎలా ఎదిగారు?

    పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?ఈ వీడియోలో చూడండి.

  6. మరియుపూల్ నగర ప్రజలను తరలించే కొత్త దారి ఇదే

    వలస వెళ్తున్న జనం

    ఫొటో సోర్స్, Jedrzej Nowicki/Agencja Wyborcza.pl via Reuters

    ఫొటో క్యాప్షన్, రోడ్లు ధ్వంసమైనప్పటికీ నగరం నుంచి బయటపడేందుకు స్థానికుల ప్రయత్నాలు

    మరియుపూల్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. నగరంలో చిక్కుకుపోయిన పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు మార్గం సుగమమైంది.

    ఈ నగరంలో నిన్న (శనివారం) కూడా కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ రష్యా మళ్లీ కాల్పులు జరిపిందని, దాంతో ప్రజల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాల్సి వచ్చిందని యుక్రెయిన్ ప్రకటించింది.

    అయితే, ప్రజలు నగరం వీడకుండా యుక్రెయిన్ జాతీయవాదులే అడ్డుకుంటున్నారని రష్యా అంటోంది.

    రష్యా యుద్ధ విమానాలు నివాస ప్రాంతాలపై బాంబులు వేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, రష్యా యుద్ధ విమానాలు నివాస ప్రాంతాలపై బాంబులు వేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

    నిన్న కేవలం నాలుగు వందల మందిని మాత్రమే మరియుపూల్‌ నుంచి తరలించగలిగామని యుక్రెయిన్ పేర్కొంది.

    ఇవాళ ఇక్కడ మరోసారి కాల్పుల విరమణ ప్రకటించారు. ప్రజల తరలింపునకు కొత్త రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ప్రజలను తరలించే ప్రక్రియ గంట క్రితం మొదలైంది.

    ప్రజలను తరలించే రూట్ మ్యాప్‌ను కింద మీరు చూడొచ్చు.

    మరియుపూల్
  7. రష్యాలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు, వందలాది మంది అరెస్ట్: మానిటరింగ్ గ్రూప్

    రష్యాలో నిరసన ప్రదర్శనలు

    ఫొటో సోర్స్, EPA

    రష్యాలోని 21 నగరాల్లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయని, 600 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారని మానిటరింగ్ గ్రూప్ ఓవీడీ-ఇన్ఫో పేర్కొంది.

    యుక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని జైల్లో ఉన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ పిలుపు ఇచ్చారు.

    దాంతో కొందరు ప్రజలు వీధుల్లోకి వచ్చారు. సైబీరియాలోని నొవోసిబిస్క్‌లో 200 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా కథనాలను ఉటంకిస్తూ ఓవీడీ-ఇన్ఫో వెల్లడించింది.

    యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు అంటే 11 రోజుల్లో 8000 మంది నిరసనకారులను రష్యాలో అదుపులోకి తీసుకున్నారని ఈ గ్రూప్ చెబుతోంది.

  8. రష్యాకు మద్దతుగా సెర్బియాలో ప్రదర్శనలు

    రష్యాకు మద్దతుగా సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో వేల మంది ప్రదర్శన చేపట్టారు.బెలారుస్‌పై ఇక్కడి ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా వీరు నిరసనలు చేపట్టారు.పూర్తి వివరాలు కింది వీడియోలో చూడండి.

  9. బ్రేకింగ్ న్యూస్, 10 రోజుల్లో 15 లక్షల మంది యుక్రెయిన్ వదిలి వెళ్లిపోయారు: యూఎన్

    యుక్రెయిన్ వలసలు మ్యాప్

    యుక్రెయిన్‌పై రష్యా దాడులు చేయడం మొదలుపెట్టిన తర్వాత గత 10 రోజుల్లో 15 లక్షల కంటే ఎక్కువ మంది యుక్రెయిన్ ప్రజలు పొరుగున ఉన్న ఇతర దేశాలకు వెళ్లిపోయారని యూఎన్ రెఫ్యూజీ హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండి చెప్పారు.

    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం ఇదని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా 88 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయింది: యుక్రెయిన్

    రష్యాతో పోరాటానికి సంబంధించిన వివరాలను యుక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. అందులోని ముఖ్యాంశాలు.

    • రష్యా ఇప్పటివరకు 88 ఎయిర్‌క్రాఫ్టులు, హెలికాప్టర్లను కోల్పోయింది.
    • యుక్రెయిన్ అదుపులో పలువురు రష్యా పైలట్లు ఉన్నారు.
    • మరియుపూల్‌ నగరం ఇంకా యుక్రెయిన్ సైన్యం నియంత్రణలోనే ఉంది.
    • రష్యాకు చెందిన కీలక ఎక్విప్‌మెంట్‌‍‌ను స్వాధీనం చేసుకున్నామని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.

    అయితే, యుక్రెయిన్ సైన్యం చెబుతున్న ఈ వివరాలను బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, EPA

  11. యుక్రెయిన్ సంక్షోభం: పౌరులు తరలి వెళ్లేందుకు వీలుగా మరియుపూల్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ

    మరియుపూల్ నగరంలో ఆదివారం కూడా తాత్కాలిక కాల్పుల విరమణ ఉంటుందని సిటీ కౌన్సిల్ ప్రకటించింది.

    నిర్ణీత మార్గాల్లో పౌరులు బస్సుల్లో నగరాన్ని విడిచి వెళ్లగలరు. ప్రయివేటు వాహనాలలో కూడా ప్రజలు వెళ్లవచ్చు. కానీ, అవి బస్సుల వెనుకే నడవాలి. ఈ కాన్వాయ్‌ని రెడ్ క్రాస్ నడిపించనుంది.

    యుక్రెయిన్‌పై 'నో-ఫ్లై' జోన్ ప్రకటించమని ఆ దేశ అధ్యక్షుడు పశ్చిమ దేశాలకు మళ్లీ విజ్ఞప్తి చేశారు.

    పేమెంట్ సంస్థలు మాస్టర్ కార్డ్, వీసా, రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.

    ఇవీ ఈనాటి ముఖ్యాంశాలు.

    రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ మీకు సతీష్ ఊరుగొండ అందిస్తారు.

    ధన్యవాదాలు.

  12. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ సంక్షోభం: మళ్లీ కొత్తగా కాల్పుల విరమణ ప్రకటించారు

    మరియుపూల్‌లో ఈరోజు కూడా కాల్పుల విరమణ ప్రకటించారని సిటీ కౌన్సిల్ తెలిపింది.

    స్థానిక సమయం 10.00 నుంచి 21.00 గంటల వరకు తాత్కాలిక కాల్పుల విరమణ ఉంటుంది.

    పౌరులు స్థానిక సమయం 12.00 గంటల నుంచి నిర్థీత మార్గంలో నగరం నుంచి తరలి వెళ్లగలరు.

    శనివారం కూడా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, అది సఫలం కాలేదు.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Pierre Crom/Getty Images

  13. యుక్రెయిన్‌పై రష్యా దాడికి ఇది 11వ రోజు, ఇప్పటివరకూ ఏం జరిగిందంటే...

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లో యుద్ధానికిది 11వ రోజు. ఇప్పుడు ఉదయం 9 గంటలు కావస్తోంది. కీయెవ్, ఖార్కియెవ్ నగరాల మధ్య ఉన్న పోల్టావా నగరంలో వైమానిక దాడుల సైరన్లు మోగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఇప్పటి వరకూ ఏం జరిగిందంటే...

    • యుక్రెయిన్ గగనతలాన్ని 'నో-ఫ్లై' జోన్‌గా ప్రకటించాలని అధ్యక్షుడు జెలియెన్‌స్కీ మరోమారు పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఆయన శనివారం నాడు అమెరికా చట్టసభ ప్రతినిధులు 300 మందిని ఉద్దేశించి వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఈ అభ్యర్థన చేశారు. అదే రోజు ఆయన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కూడా మాట్లాడారు.
    • నాటో మాత్రం 'నో-ఫ్లై' జోన్ అభ్యర్థనను నిక్కచ్చిగా తోసిపుచ్చుతోంది. దీనివల్ల పశ్చిమదేశాలు నేరుగా రష్యాతో యుద్దంలోకి దిగినట్లు అవుతుందని నాటో అంటోంది.
    • 'నో-ఫ్లై' జోన్ ప్రకటనను యుద్ధ ప్రకటనగానే భావిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
    • మరియుపూల్ మీద రష్యా బాంబుదాడులను కొనసాగిస్తోంది. ఇక్కడ స్థానికులను తరలించే వెసలుబాటు కోసం తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని చెప్పిన రష్యా ఆ మాటను ఉల్లంఘించిందని యుక్రెయిన్ అధికారులు ఆరోపించారు.
    • మరియుపూల్, సుమీ ప్రాంతాలు మానవీయ సంక్షోభానికి చేరువలో ఉన్నాయని యుక్రెయిన్ ప్రభుత్వాధికారి స్థానిక టీవీ చానల్లో అన్నారు.
    • అమెరికాకు చెందిన అతి పెద్ద పేమెంట్ సంస్థలు వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను రద్దు చేశాయి.
    • రష్యా, యుక్రెయిన్ ప్రతినిధులు మరో విడత చర్చల కోసం సోమవారం నాడు కలుసుకోబోతున్నారు.
  14. రష్యాలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన వీసా, మాస్టర్ కార్డ్

    రష్యా

    ఫొటో సోర్స్, PA Media

    యుక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా పేమెంట్ కంపెనీలు మాస్టర్ కార్డ్, వీసా, రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.

    తమ నెట్‌వర్క్ రష్యన్ బ్యాంకులకు సపోర్ట్ చేయదని, దేశం వెలుపల జారీ చేసిన కార్డులు రష్యన్ ఏటీఎం మెషీన్లలో పని చేయవని మాస్టర్ కార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.

    అలాగే, రానున్న రోజుల్లో రష్యాలోని అన్ని రకాల లావాదేవీలను నిషేధించనున్నట్లు వీసా తెలిపింది. రష్యా వెలుపల జారీ చేసిన కార్డులు ఆ దేశం లోపల పనిచేయవని చెప్పింది.

  15. రష్యా: పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?

    యుక్రెయిన్ మీద దాడితో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆయన ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. రష్యా వాదన: 'యుక్రెయిన్ నుంచి పౌరులను, విదేశీయులను తరలించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం, కానీ..'

    రష్యా

    ఫొటో సోర్స్, @RusEmbIndia

    ఫొటో క్యాప్షన్, రష్యా నేషనల్ సెంటర్ ఫర్ స్టేట్ డిఫెన్స్ కంట్రోల్ అధిపతి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్‌సేవ్

    యుక్రెయిన్‌లో చిక్కుకున్న సామాన్య ప్రజలను, విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రష్యా తెలిపింది.

    రష్యా నేషనల్ సెంటర్ ఫర్ స్టేట్ డిఫెన్స్ కంట్రోల్ అధిపతి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్‌సేవ్ మాట్లాడుతూ, మరియుపూల్, వోల్నోవాఖాలలో మానవతా సహాయం అందించేందుకు రోజూ వీలు కల్పిస్తున్నామని తెలిపారు.

    అయితే, యుక్రెయిన్ జాతీయ దళాలు తమ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని అన్నారు.

    మరోవైపు, రష్యా కాల్పుల విరమణను ఉల్లంఘించిందని యుక్రెయిన్ ఆరోపించింది. మరియుపూల్, వోల్నోవాఖాలలో మనవతా సహాయం అందించేందుకు వీలుగా తాత్కాలికంగా కాల్పులను విరమిస్తున్నట్లు శనివారం రష్యా ప్రకటించింది. కానీ, దాడులు కొనసాగాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. ఆపరేషన్ గంగ: మరో 182 మంది భారతీయులతో ముంబై చేరుకున్న ప్రత్యేక విమానం

    భారత్, యుక్రెయిన్

    ఫొటో సోర్స్, ANI

    యుక్రెయిన్‌లో చిక్కుకున్న మరో 182 మంది భారతీయులు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఆదివారం ముంబై చేరుకున్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ విమానం శనివారం నాడు రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరింది.

    పంచాయతీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ ముంబై విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు.

  18. యుక్రెయిన్‌లో పోరాడేందుకు సుమారు 3,000 మంది అమెరికన్ వలంటీర్లు సిద్ధం - వీఓఏ

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Anadolu Agency via Getty Images

    ఫొటో క్యాప్షన్, శనివారం నాడు ఎల్వివ్ ఫిల్మ్ సెంటర్‌లోని ఒక సినిమా హాల్‌లో పౌరులు AK-47 రైఫిల్స్‌ను ఉపయోగించడం నేర్చుకున్నారు

    రష్యాతో పోరాడేందుకు వలంటీర్లు కావాలని యుక్రెయిన్ ఇచ్చిన పిలుపుకు సుమారు 3,000 మంది అమెరికన్లు స్పందించారని వాషింగ్టన్ డీసీలోని యుక్రేనియన్ ఎంబసీ ప్రతినిధి ఒకరు వాయిస్ ఆఫ్ అమెరికా (వీఓఏ) వార్తా సంస్థకు తెలిపారు.

    పాశ్చాత్య దేశాలు, యుక్రెయిన్‌లో పోరాడటానికి సైనిక దళాలను పంపడం లేదు. కానీ, ఆయుధాలు అందజేస్తున్నాయి.

    అలాగే, రష్యాపై, ఓలిగార్క్‌లపై పలు ఆంక్షలు విధించాయి.

    యుద్ధంలో సహాయం చేసే విదేశీ వలంటీర్లతో ఒక "అంతర్జాతీయ దళాన్ని" ఏర్పాటు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ, ఇతర సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు.

    యుక్రెయిన్‌లో పోరాడటానికి సుమారు 16,000 మంది విదేశీయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని కొన్ని రోజుల క్రితం జెలియెన్‌స్కీ అంచనా వేశారు.

  19. యుక్రెయిన్ యుద్ధం: 'ఐదు నిమిషాలకు ఒకసారి బాంబుల సైరన్ మోగేది'

    ‘పక్కపక్కనే బాంబు సౌండ్లు వినిపించేవి.. వారం రోజులపాటు ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం.’

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంలో బాంబు శబ్దాల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిండి, నిద్ర లేకుండా గడిపారు చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ముద్రగాని సాయి నిఖిత.

    యుక్రెయిన్‌లో పరిస్థితులు, ఇప్పటికీ అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థుల కష్టాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. యుక్రెయిన్ సంక్షోభం: 'ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుంది' - ఐఎంఎఫ్

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, REUTERS

    యుక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగజారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) శనివారం హెచ్చరించింది.

    "పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. అసాధరణమైన అనిశ్చితి నెలకొని ఉంది. ఆర్థిక పరిణామాలు ఇప్పటికే చాలా తీవ్రంగా ఉన్నాయి. యుద్ధం తీవ్రమైతే, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది" అని ఐఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

    ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణానికి తోడు ఇంధనం, వస్తువుల ధరలు పెరిగిపోయాయని పేర్కొంది.

    రష్యాపై ఇతర దేశాలు విధించిన ఆంక్షలు కూడా విస్తృత పరిణామాలకు దారితీస్తాయని, యుక్రెయిన్‌తో సన్నిహిత ఆర్థిక సంబంధాలు ఉన్న దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లవచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.

    యుద్ధం ఆర్థిక ప్రభావాలను చర్చించడానికి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం సమావేశమైంది.