'రఫేల్ను కూల్చేశాం' అని పాకిస్తాన్ చేసిన ప్రకటనపై భారత సైన్యం ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, ANI
భారత్కు చెందిన రెండు రఫేల్ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైన్యం ఇటీవల ప్రకటన చేసింది. దీని గురించి ఆదివారం సాయంత్రం భారత సైన్యం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మీడియా ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు ఎయిర్ మార్షల్ ఏకే భారతి సమాధానమిస్తూ, "మనం పోరాటంలో ఉన్నాం, అందులో నష్టాలు కూడా ఉంటాయి. మీరు మమ్మల్ని అడగాల్సింది, లేదంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో లక్ష్యాలను సాధించామా? అని. దానికి సమాధానం అవును" అని అన్నారు.
"మనం ఇంకా పోరాటంలోనే ఉన్నాం. మేం ఏదైనా మాట్లాడితే, అది ప్రత్యర్థికి ప్రయోజనం చేకూరుస్తుంది. మేం ఎంచుకున్న లక్ష్యాలను సాధించామని, మా పైలట్లందరూ ఇంటికి తిరిగి వచ్చారని మాత్రం చెప్పగలను" అన్నారు ఏకే భారతి.









