You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమిత్ షా చెప్పులు మోశారంటూ ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు బండి సంజయ్ జవాబు ఏంటి?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బూట్లను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెచ్చి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆగస్టు 21న తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది.
ఈ వీడియో తెలంగాణలో రాజకీయంగా వాగ్వాదాలకు, విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీసింది.
అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
మహంకాళి ఆలయంలోకి వెళ్లిన అమిత్ షా, బయటకు వస్తుండగా, బండి సంజయ్ పరుగుపరుగున వెళ్లి బూట్లను తీసుకొచ్చి అమిత్ షా ముందు పెట్టారు.
ఈ విషయంలో తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఏమని విమర్శించారు, దానికి బీజేపీ ఏమని సమాధానం ఇచ్చింది...ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)