సెల్లాఫీల్డ్: దశాబ్దాల అణు కాలుష్యానికి సజీవ సాక్ష్యం

వీడియో క్యాప్షన్, సెల్లాఫీల్డ్: దశాబ్దాల అణు కాలుష్యానికి సజీవ సాక్ష్యం

సెల్లాఫీల్డ్.. ఐరోపాలోనే అణు కాలుష్యం అధికంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతం. కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ అణుధార్మిక ఇంధనాన్ని శుద్ధి చేశారు.

బ్రిటన్ అణు కార్యక్రమంలో ఎంతో కీలకంగా నిలిచిన సెల్లాఫీల్డ్ ఇప్పుడు ఆ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం.

కాలక్రమంలో అణు కాలుష్యం పెరిగి మనుషుల ప్రాణాలను బలితీసుకుంటూ ఉండటంతో కొంత కాలం కిందట దాన్ని మూసివేశారు.

ప్రస్తుతం ఆ కాలుష్యాన్ని తొలగించే పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని సందర్శించి బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇది తొలితరానికి చెందిన న్యూక్లియర్ రియాక్టర్లను నిల్వచేసిన ప్రదేశం. అణు ఇంధనాన్ని శుద్ధి చేసేముందు ఇక్కడ చల్లబరిచేవారు.

గత 30 ఏళ్ల నుంచి ఇది వినియోగంలో లేదు. అయినా ఇప్పటికీ ఇది విషపూరితమైన రేడియో ధార్మిక పదార్థాలతో నిండి ఉంది. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చడం ఎంతో సవాళ్లతో కూడుకున్నది.

ఈ కేంద్రం శిథిలావస్థకు చేరిందనే విషయం చూడగానే తెలిసిపోతుంది. ఏ ఒక్క నిర్మాణం కూలిపోయినా దాని పర్యవసానం ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది.

ప్రత్యేకంగా రూపొందించిన రోబోలతో ఇక్కడి నీటిలోని రేడియో యాక్టివ్ పదార్థాలను తొలగిస్తున్నారు. వీటిని ఆపరేట్ చేసే ఉద్యోగులు సురక్షితమైన దూరంలో ఉంటారు.

కఠినమైన వాతావరణంలోనూ పని చేయడం కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఈ కేంద్రంలో వినియోగించాల్సి వస్తోంది.

అయితే సెల్లాఫీల్డ్ అణు కాలుష్యం దాని చుట్టు పక్కల ఉన్న వందలాది కంపెనీలకు వరంగా మారింది.

అణుపరిశ్రమ కోసం ఈ కంపెనీలు తయారు చేసే యంత్రాలను ఇతర చోట్ల కూడా లాభాలకు అవి అమ్ముకోవచ్చు.

ఈ శిథిల కేంద్రాన్ని పూర్తిగా తొలగించడానికి ముందుగా... ఈ శుద్ధి ప్రక్రియ చాలా సంవత్సరాలు సాగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)