You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
75ఏళ్లు గడిచినా అస్థిపంజరాలు బయటపడుతూనే ఉన్నాయి
రష్యాలో జరగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ కోసం ఓ స్టేడియం నిర్మాణం మొదలుపెట్టారు. అక్కడ వెతికేకొద్దీ పదుల సంఖ్యలో అస్థిపంజరాలు, గ్రెనేడ్లు, తుపాకులు బయటపడుతూనే ఉన్నాయి.
రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా రష్యాలోని వాల్గొగ్రాడ్ నగరంలో హోరాహోరి పోరాటాలు జరిగాయి. అక్కడ యుద్ధభూమిలో మరణించిన సైనికుల మృతదేహాలను సమాధి చేయకుండా అలానే వదిలేశారు.
దాంతో 75ఏళ్లు గడిచినా ఇప్పటికీ అక్కడ అస్థిపంజరాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు వలంటీర్లు అలా బయటపడ్డ అస్థిపంజరాలను వెలికి తీసి వాటిని గౌరవప్రదంగా సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అలా పనిచేస్తున్న ఓ బృందంతో కలిసి బీబీసీ ప్రతినిధులు కూడా ఆ మైదానానికి వెళ్లారు. అక్కడ ఏమేం బయటపడ్డాయో తెలియాలంటే పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)