You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోజూ 2 గంటలపాటు ఒంటి కాలితో కుంటుతూ స్కూలుకు వెళ్తున్న బాలిక
ఈ అమ్మాయి ఒంటి కాలుతో కుంటుతూ రోజూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్తుంది.
ఈమె పేరు ప్రియాంశు కుమారి. ఈమెది బిహార్ సివాన్ జిల్లాలోని బంధు శ్రీరామ్ గ్రామం.
ప్రియాంశు పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు ఒక కాలు సరిగా లేదు. కానీ ఎలాగైనా బాగా చదువుకుని డాక్టర్ కావాలనుకుంటున్నట్లు ఈ అమ్మాయి చెబుతోంది.
ప్రియాంశు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. తాను ఒంటి కాలిపై బ్యాలెన్స్ చేస్తూ రోజూ వెళ్తానని, ఆ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల మరింత కష్టంగా ఉంటోందని చెప్పింది.
నడవడానికి వీలుగా తనకు ఒక కృత్రిమ కాలు పెట్టించాలని విజ్ఞప్తి చేసింది.
తన కూతురు చదువుకోడానికి, ఆమె కలలు నెరవేర్చుకోడానికి ప్రభుత్వం సాయం చేయాలని బాలిక తల్లి రీనా దేవి విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి:
- ఉదయ్పుర్, కరౌలి, జోధ్పుర్, అల్వార్.. ఈ రాజస్థాన్ నగరాల్లో ఏం జరుగుతోంది?
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)