You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘నడిరోడ్డుపై చంపుతుంటే 30 మందిలో ఒక్కరూ అడ్డుకోలేదు’
ముస్లిం యువతి ఆశ్రీన్ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న దళిత యువకుడు నాగరాజు హైదరాబాద్లో దారుణ హత్యకు గురయ్యారు.
బుధవారం(మే 4) రాత్రి 9 గంటల సమయంలో సరూర్ నగర్ మునిసిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని పంజా అనిల్ కుమార్ గాయత్రి నగర్ కాలనీ రోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ హత్య జరిగింది.
అబ్బాయి బిల్లిపురం నాగరాజు మాల కులానికి చెందినవారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రీన్ సుల్తానా, నాగరాజు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారని, వారిద్దరూ ఒకే స్కూల్లో, కాలేజీలో చదువుకున్నారని వివరించారు.
ఆశ్రీన్ తండ్రి చాలా కాలం కిందటే చనిపోయారు. నాగరాజును ఆశ్రీన్ ప్రేమించడం ఆమె అన్న సయ్యద్ మొబీన్ అహ్మద్కు నచ్చలేదని పోలీసులు చెప్పారు. వారిద్దరినీ ఒకరికొకరు దూరంగా ఉండాలని ఆయన బెదిరించారని కూడా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఆ నటుడితో నాకు అఫైర్’ ఉందనే అనుమానంతో నా భర్త నన్ను తన్నాడు’
- అశోకవనంలో అర్జున కల్యాణం రివ్యూ: విశ్వక్ సేన్ రూటు మార్చాడు.. హిట్టు కొట్టాడా?
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- వడదెబ్బను ప్రకృతి విపత్తుగా చూస్తారా? చనిపోతే నష్టపరిహారం ఇస్తారా?
- ‘శిథిలాల కింద చిక్కుకుపోయాను, నీళ్లు తాగి బతికాను.. నిశ్శబ్దంగా ఉంటే రాయితో గోడపై కొట్టేదాన్ని, ఎందుకంటే..’
- సింహం పెరట్లోకి ఎలా వచ్చింది... అసలు సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోయారు
- డెత్ రోడ్: భయంకరమైన ఈ మార్గంలో ప్రయాణం ఎలా ఉంటుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)