You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘మోదీ ప్రభుత్వం రిపోర్ట్ కార్డ్’.. సుబ్రమణియన్ స్వామి ట్వీట్ - BBC Newsreel
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రిపోర్ట్ కార్డ్ అంటూ బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ట్విటర్లో గురువారం ఒక పోస్ట్ చేశారు.
ఇదే సందేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వం ఐదు వైఫల్యాల గురించి కూడా ప్రస్తావించారు.
"ఆర్థిక వ్యవస్థ-ఫెయిల్, సరిహద్దు భద్రత-ఫెయిల్, విదేశాంగ విధానం-అఫ్గానిస్తాన్లో వైఫల్యం, జాతీయ భద్రత-పెగాసస్ ఎన్ఎస్ఓ, అంతర్గత భద్రత, కశ్మీర్ అంధకారం"అని ఆయన ట్వీట్ చేశారు.
వ్యంగ్యంగా "ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యులు ఎవరు?--సుబ్రమణియన్ స్వామి" అని పోస్ట్ చేశారు.
దిల్లీ అసెంబ్లీ కమిటీ ఎదుట హాజరు కావాలని కంగనా రనౌత్కు సమన్లు
డిసెంబర్ 6న తమ ఎదుట హాజరు కావాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు దిల్లీ అసెంబ్లీ పీస్ అండ్ హార్మనీ కమిటీ సమన్లు పంపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చడ్డా నేతృత్వంలోని ఈ కమిటీ సిక్కుల గురించి కంగనా రనౌత్ చేసినట్లు చెబుతున్న ఒక ప్రకటన గురించి ఆమెకు సమన్లు పంపింది.
ఇంతకు ముందు దిల్లీ సిక్ గురుద్వారా ప్రబంధ్ కమిటీ అధ్యక్షుడు మన్జిందర్ సింగ్ సిర్సా నేతృత్వంలోని ఒక ప్రతినిధి మండలి నవంబర్ 22న పశ్చిమ ముంబయి పోలీస్ అడిషినల్ కమిషనర్ పి.కార్ణిక్ను కలిసి కంగనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రైతులు, సిక్కు సమాజానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కంగనను అరెస్ట్ చేయాలని ఆయన ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?
- అభినందన్ వర్థమాన్కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ‘‘మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)