You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: గోదావరి జిల్లాల్లో 400 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వారంలో రెండోసారి వరద తాకిడి కనిపిస్తోంది. ఈసారి నీటి మట్టం వేగంగా పెరగడంతో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాదకర హెచ్చరిక స్థాయికి చేరగా, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవాహం సాగుతోంది.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 14.2 అడుగులకు చేరుకుంది.
దాంతో 175 క్రస్ట్ గేట్లను పూర్తిగా ఎత్తివేసి 13,45,437 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు.
ఈ వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారుగా 350 గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. 400 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
శబరి నది పొంగి ప్రవహించడంతో ఏపీ, తెలంగాణా, చత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. చింతూరు ఏజన్సీ ప్రాంతంలో మరో 16 గ్రామాలకు వరద నీరు చేరింది.
ఏటా వచ్చే ఈ స్థాయి వరదనీరు కన్నా ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్మించిన కాఫర్ డ్యామ్ కారణంగా వరద తాకిడి ఎక్కువగా ఉంది.
ముఖ్యంగా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు జలమయం కావడానికి బ్యాక్ వాటర్ కారణంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చూడండి:
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- ‘‘సారీ అమ్మ.. ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు’’
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- ఆర్థిక సర్వే: ఆదాయపన్ను చెల్లిస్తున్నారా... అయితే రోడ్లకు, రైళ్లకు మీ పేరు పెట్టొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)