You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మూకదాడులు తక్షణమే ఆగాలి.. మోదీకి ప్రముఖుల లేఖ
ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న మూకదాడుల (లించింగ్) ఘటనలతో ఆందోళనకు గురైన కళాకారులతోపాటు చాలా మంది ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కళ, వైద్య, విద్యారంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకాలు చేశారు. చిత్రపరిశ్రమ నుంచి మణిరత్నం, అనురాగ్ కశ్యప్, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణ, కొంకణా సేన్ లాంటి ప్రముఖులు ఉన్నారు. మిగతా వారిలో చరిత్రకారులు, రచయిత రామచంద్ర గుహ లాంటివారు కూడా ఈ లేఖపై సంతకం చేశారు.
లించింగ్ ఘటనలు తక్షణం ఆగేలా చూడాలని వారు ఈ లేఖలో ప్రధానిని కోరారు.
ప్రముఖులు తమ లేఖలో 'నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో' (ఎన్సీఆర్బీ) గణాంకాలను ప్రస్తావించారు. 2009 జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 మధ్యలో మతగుర్తింపు ఆధారంగా 254 నేరాలు నమోదైనట్లు తెలిపారు. వీరిలో 91 మందిని హత్య చేశారని, 579 మంది గాయపడ్డారని చెప్పారు.
భారత రాజ్యాంగంలో భారతదేశాన్ని ఒక లౌకిక గణతంత్ర రాజ్యమని, ఇక్కడ అన్ని మతాలు, సమాజాలు, కులాలు, అన్ని లింగాల వారికి సమాన హక్కులు లభించాయని చెప్పారని వీరు లేఖలో తెలిపారు.
దేశంలో 14 శాతం ముస్లి జనాభా ఉంది, కానీ ఇలాంటి 62 శాతం నేరాల్లో వారే బాధితులుగా నిలిచారని లేఖలో చెప్పారు.
ఈ లేఖలో చెప్పిన వివరాల ప్రకారం ఇలాంటి నేరాల్లో 90 శాతం నరేంద్ర మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చాక, అంటే 2014 మే తర్వాతే జరిగాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో లించింగ్ ఘటనలను ఖండించారు. కానీ అది సరిపోదని ప్రముఖులు భావించారు. ఇలాంటి కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో 'అసమ్మతి' ప్రాధాన్యాన్ని కూడా వీరు తమ లేఖలో నొక్కి చెప్పారు. ఏదైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే, వారిపై 'యాంటీ నేషనల్' లేదా 'అర్బన్ నక్సల్' అనే ముద్ర వేయకూడదని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా
- చంద్రయాన్-2 భూకక్ష్యలోకి చేరింది.. దీనివల్ల భారత్కు ఏం లభిస్తుంది?
- కర్ణాటక ముఖ్యమంత్రి: అడ్వాణీకి వర్తించిన రూల్ యడ్యూరప్పకు వర్తించదా
- టిక్టాక్ యాప్ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- ఈ కుక్కని పిలవాలంటే రిమోట్ కావాలి
- పదహారేళ్ల కిందటే చంద్రుడిపై స్థలం కొన్నానంటున్న హైదరాబాద్ వ్యాపారి.. అసలు చందమామపై స్థలం కొనొచ్చా
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)