కేంద్ర బడ్జెట్ 2019: సంప్రదాయ బ్రీఫ్‌కేస్‌ను పక్కనపెట్టిన నిర్మలా సీతారామన్

పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వస్తున్నప్పుడు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంప్రదాయంగా వస్తున్న 'బ్రీఫ్‌కేస్' పద్ధతికి స్వస్తి చెప్పారు.

బ్రీఫ్‌కేస్ బదులు ఆమె భారత సంప్రదాయం ప్రకారం ఎర్ర రంగు గుడ్డలో పెట్టి దారంతో కట్టిన ఫైలును తీసుకొచ్చారు. దీనిని బహీ-ఖాతా (పుస్తక ఖాతా) అంటారు.

"అది పాశ్చాత్య ఆలోచనల బానిసత్వం నుంచి బయపడాన్ని సూచిస్తుంది" అని ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు.

నరేంద్ర మోదీ రెండో పాలనాకాలంలో ఇది తొలి బడ్జెట్.

ఇంతకు ముందు భారత రక్షణ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా మధ్య తరగతి సొంతింటి కల నిజం చేసేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

కానీ, బ్రిటిష్ సంప్రదాయ బ్రీఫ్‌కేసుకు బదులు భారత సంప్రదాయ పద్ధతిలో ఖాతా పుస్తకంలా బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకున్న నిర్మలా సీతారామన్‌ ధైర్యాన్ని సోషల్ మీడియాలో చాలామంది ప్రశంసించారు.

కొందరు దానిని వేళాకోళం కూడా చేశారు. "అలాంటప్పుడు పార్లమెంటుకు ఎద్దులబండిలో వెళ్లుండాల్సింది, బడ్జెట్ ప్రసంగం ఉన్న తాళపత్ర గ్రంథాలు చదవాల్సింది" అన్నారు.

"వలసవాదం నుంచి వెంటాడుతున్న వస్తువుగా, ఎన్నో దశాబ్దాల క్రితం బ్రిటన్ కోశాధికారి బడ్జెట్ ప్రసంగాన్ని మళ్లీ చూపించేది"గా రచయిత సమంత్ సుబ్రమణియన్ బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌ను గతంలో ఓసారి వర్ణించారు.

అయితే ఈ బ్రిటన్ సంప్రదాయ బ్రీఫ్‌కేసును పక్కనపెట్టిన వారు, ఆర్థికమంత్రి సీతారామన్ ఒక్కరు మాత్రమే కాదు.

భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి కూడా తన బడ్జెట్ ప్రసంగాన్ని ఒక తోలు సంచిలో తీసుకొచ్చారు. కానీ అది కూడా దాదాపు బ్రీఫ్‌కేసులాగే కనిపించేది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)