You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హంపి: చారిత్రక కట్టడాల స్తంభాన్ని కూల్చిన కేసులో నలుగురి అరెస్ట్
కర్నాటకలోని హంపిలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంలోని ఒక నిర్మాణాన్ని ధ్వంసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ఆ వీడియోలో ముగ్గురు ఒక స్తంభాన్ని నెట్టి కూల్చేయడం, అది విరిగిపోవడం కనిపిస్తుంది.
పదహారో శతాబ్దం నాటి చారిత్రక కట్టడాల శిథిలాలున్న హంపి భారత్లోని ప్రముఖ విహార స్థలాల్లో ఒకటి.
అక్కడ ఆ కట్టడాలకు సంబంధించిన ఒక స్తంభాన్ని కూలదోసిన ముగ్గురితో పాటు ఆ దృశ్యాలను చిత్రీకరించిన వ్యక్తినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వీడియో వైరల్ అయిన తరువాత విషయం తెలుసుకున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఫిబ్రవరి 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలో వారసత్వ కట్టడాల పరిరక్షణ బాధ్యతలను ఈ సంస్థతే చూసుకుంటుంది.
అయితే, పోలీసులు మాత్రం ఇది తాజాగా జరిగిన ఘటన కాకపోయి ఉండొచ్చని అంటున్నారు.
''కేసు దర్యాప్తు చేస్తున్నాం. బహుశా ఇది ఒకట్రెండేళ్ల కిందట జరిగి ఉండొచ్చు'' అని బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీకి ఒక పోలీస్ అధికారి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- #fallingstarschallenge: చైనా యువతీ, యువకులు ఎందుకిలా పడిపోతున్నారంటే..
- హైదరాబాద్లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- ఇన్స్టాగ్రామ్తో డబ్బులు సంపాదించడం ఎలా?
- ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అమ్మకం
- సౌదీ: ‘నా చేత బలవంతంగా ప్రార్థనలు చేయించేవాళ్లు. రంజాన్లో ఉపవాసం ఉంచేవాళ్లు’
- ఇన్స్టాగ్రామ్ ఫొటోల్లో భారత రైలు ప్రయాణం
- ఇన్స్టాగ్రామ్: నకిలీ కామెంట్లు, నకిలీ లైక్లు ఇక కుదరవు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)