You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీదేవి ఇకలేరు: ‘జాబిలమ్మ శాశ్వతంగా నిద్రపోయింది’
అతిలోకసుందరి శ్రీదేవి ఇక లేరు.
నిద్రలేవగానే ఈ వార్త చూసి ఆమె అభిమానులు షాకయ్యారు.
ఈ వార్త నిజం కాకూడదని కోరుకున్నారు.
కానీ అదే నిజమని తెలిసి విషాదంలో మునిగిపోయారు.
అందాల నటి అందర్ని వదిలి వెళ్లిపోయారు.
శ్రీదేవి మరణంపై భారతీయ చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.
దేవుడిని ఇవాళ ద్వేషించినంతగా మరెన్నడూ ద్వేషించలేదని దర్శకుడు వర్మ ట్వీట్ చేశారు.
శ్రీదేవిని చంపేసినందుకు దేవుడిపై ద్వేషం ఉంది. చనిపోయినందుకు శ్రీదేవిపై కోపం ఉంది అంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
'టీనేజర్ నుంచి అద్భుతమైన మహిళ'గా శ్రీదేవి ఎదిగిన తీరు తనకు తెలుసని కమల్ హసన్ అన్నారు.
ఆమెతో తనకున్న అనుబంధాన్ని కమల్ గుర్తు చేసుకున్నారు.
శ్రీదేవి స్వర్గం నుంచి వచ్చి చిత్రసీమను ఏలి తిరిగి అక్కడికే వెళ్లిపోయిందని హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరని అభిప్రాయపడ్డారు.
శ్రీదేవి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానని హీరోయిన్ రకుల్ప్రీత్ అన్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ట్వీట్ చేశారు.
శ్రీదేవి మరణంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదని ప్రియాంకాచోప్రా అన్నారు.
మరెందరో బాలీవుడ్ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు.
ఈ వార్త తెలిసి శిల్పాషెట్టి, గౌతమి, దేవిశ్రీప్రసాద్ సహా ఎందరో అభిమానులు షాక్కు గురైయ్యారు.
శ్రీదేవి అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నారు.
నా బాధను మాటల్లో చెప్పలేనని సచిన్ అన్నారు. శ్రీదేవి మనతో లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.