ఒడిశాలోని కేంద్రపరాలో మొసళ్లతో దినదిన గండం
ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అక్కడి ప్రజల జీవితాలు మాత్రం దినదిన గండంగా మారాయి.
సంరక్షణ కేంద్రంలో ఉండాల్సిన మొసళ్లు జనావాసాల మధ్యలోకి వస్తుండటంతో చాలామంది వాటి దాడికి గురై గాయాల పాలవుతున్నారు.
సంరక్షణ కేంద్రానికి గ్రామాల్లోని చెరువులూ కాలువలకూ మధ్య సరైన అడ్డుకట్ట లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఒడిశా నుంచి బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి అందిస్తున్న రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)