వీడియో: భారత్లోకి టపాసులు ఎలా వచ్చాయో తెలుసా?
పూర్వం దీపాలను వెలిగించి దీపావళి జరుపుకునేవారు. దీపాల వల్లనే ఈ పండుగకు ఆ పేరు వచ్చిందని భావిస్తుంటారు.
ఏడో శతాబ్దంలోనే చైనాలో టపాసుల తయారీ మొదలైంది. 14వ శతాబ్దంలో అవి భారత దేశంలోకొచ్చాయని చరిత్రకారులు చెబుతారు. అయితే దీనిపై భిన్న వాదనలు కూడా ఉన్నాయి.
నెమ్మదిగా మందుగుండు సామాగ్రి టర్కీ దాకా చేరింది. అక్కడ ఫిరంగుల తయారీ మొదలైంది.
దేశంలో తొలిసారి మందు గుండు సామగ్రిని బాబర్ వినియోగించినట్టు చెబుతారు.
అప్పట్లో ఖరీదు ఎక్కువుండటంతో రాచ కుటుంబాలకు చెందిన వారే టపాసుల్ని కాల్చేవారు.
18-19 శతాబ్దాల మధ్య దేశంలో టపాసుల కర్మాగారాల ఏర్పాటు మొదలైంది.
అలా టపాసులు సామాన్యుల ఇళ్లకూ చేరి దీపావళి వేడుకల్లో భాగమయ్యాయి.
వీడియో: నిఖిత్ దేశ్పాండే/పునీత్ బర్నాలా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లోనూ సబ్స్క్రైబ్ చేయండి.)