చైనా సైన్యం గురించి ఛగ్లాగామ్ ప్రజలు ఏమంటున్నారు?
అరుణాచల్ప్రదేశ్లోని ఆంజా జిల్లా చైనా సరిహద్దులో ఉంటుంది. 1962లో చైనా సైన్యం భారతదేశంలోకి ప్రవేశించిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి.
ఈ జిల్లాలో చైనా సరిహద్దును ఆనుకుని ఉన్న గ్రామం ఛగ్లాగామ్. ఈ గ్రామ ప్రజల బంధువులు చాలా మంది సరిహద్దుకు అవతల చైనాలో ఉన్నారు.
వీరూ వారూ దాదాపు రోజూ సరిహద్దు దాటి కలుసుకుంటూ ఉంటారు.
అయితే, చైనా సైనిక బలగాలు పలుమార్లు భారత భూభాగంలో కనిపించాయని ఛగ్లాగామ్ ప్రజలు చెప్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)