You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కెనడా: జీ 7 సదస్సు నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన ట్రంప్, ఏం జరిగింది?
కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశం నుంచి డోనల్డ్ ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగానే ఆయన త్వరగా వెళ్లిపోవాల్సి వచ్చిందని వైట్ హౌస్ తెలిపింది.
ట్రంప్ సహా జీ7 నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇజ్రాయెల్కు స్వీయ రక్షణ హక్కు ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అస్థిరతకూ, ఉగ్రవాదానికి మూల కారణం ఇరానేనని కూడా ఆ ప్రకటనలో ఉంది. మరోవైపు తెహ్రాన్లో ఉంటున్న కోటి మంది ప్రజలంతా ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కోరారు. బీబీసీ ప్రతినిధి జేమ్స్ లాండేల్ అందిస్తున్న కథనం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)