ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తే, ఇజ్రాయెల్కు రక్షణగా నిలబడతామన్న అమెరికా
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తే తాము ఇజ్రాయెల్కు రక్షణగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్ భద్రతను కాపాడేందుకు చేయగలిగినంత చేస్తామని తెలిపారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తే, ఇజ్రాయెల్కు రక్షణగా నిలబడతామన్న అమెరికా

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తే తాము ఇజ్రాయెల్కు రక్షణగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్ సీనియర్ కమాండర్లు మరణించారు.
అయితే, ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడికి బాధ్యత వహించలేదు.
ఇరాన్ అధినేత అయేతుల్లా ఖమేని ఈద్ సందర్భంగా చేసిన ప్రసంగంలో ''ఇది తమ భూభాగం మీద దాడి చెయ్యడం లాంటిదేనని, దీనికి ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు'' అని హెచ్చరించారు.
దీంతో ఇరాన్ దాడి చేస్తే తాము కూడా ఎదురు దాడి చేస్తామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యాఖ్యలపై బైడెన్ స్పందించారు.
”ఇరాన్ దాని మిత్ర పక్షాలు ఇజ్రాయెల్పై దాడి చేస్తే అమెరికా ఇజ్రాయెల్కు ’ఇనుప కవచంలా’ అండగా నిలుస్తుంది. మళ్లీ మళ్లీ చెబుతున్నా. ఇజ్రాయెల్ భద్రతను కాపాడేందుకు మేము చేయగలిగినంత చేస్తాం” అని బైడెన్ చెప్పారు.
సంపాదన కోసం చైనా మహిళల కొత్త ఉపాయాలు..
కాఫీ తాగినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రూంగ్ మై లాన్: రూ. 3.6 లక్షల కోట్ల మోసం, మహిళా బిలియనీర్కు మరణశిక్ష, అసలేం జరిగిందంటే..
తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్సీ కవిత దిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది.
కవితను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది, ప్రస్తుతం ఆమె దిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి పొందిన తర్వాత సీబీఐ అధికారులు జైలులో కవితను ప్రశ్నించారు.
హరియాణాలో బస్సు బోల్తా : ఐదుగురు చిన్నారులు మృతి

ఫొటో సోర్స్, YEARS
హరియాణా రాష్ట్రంలోని మహేంద్రగఢ్ జిల్లాలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
‘‘ఈ ఘటన ఉదయం 9 గంటలకు జరిగింది. 20 మంది పిల్లలను మా వద్దకు తీసుకువచ్చారు. వారిలో నలుగురు పిల్లల ప్రాణాలు ఆస్పత్రికి రాకముందే పోయాయి. వెంటిలేటర్ అమర్చిన కొద్దిసేపటికి మరో పిల్లాడు చనిపోయాడు. మరో 15 మంది గాయాలకు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది. కొందరిని మెరుగైన చికిత్స కోసం రెఫర్ చేశాం’’ అని నిహా హాస్పిటల్కు చెందిన డాక్టర్ రవి కౌశిక్ చెప్పారు.
మహేంద్రగఢ్ జిల్లాలో కనైనా గ్రామం వద్ద బస్సు ప్రమాదానికి గురైంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
ప్రధాని మోదీని కలిసేందుకు ఎదురు చూస్తున్నా: ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, ANI
భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ టెస్లా, స్పేస్ ఎక్స్, సామాజిక వేదిక ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు.
అయితే ఈ భేటీ ఇండియాలో జరుగుతుందా, లేదా మరే దేశంలోనా అనే స్పష్టతను ఆయన ఇవ్వలేదు.
భారత్లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు,పెట్టుబడులకు సంబంధించి మస్క్ కీలక ప్రకటన చేస్తారని రాయ్టర్స్ కథనం పేర్కొంది.
జూన్ 2023లో ఎలాన్ మస్క్ మోదీని న్యూయార్క్లో కలుసుకున్నారని రాయ్టర్స్ రాసింది.
ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, భారత్లో తాను ఓ ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటున్నాని గతంలో మస్క్ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఈనెలలో భారత్ కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీని తీసుకువచ్చింది.
ఈమేరకు భారత్లో 50 కోట్ల పెట్టుబడి పెట్టి, ఫ్యాక్టరీని నెలకొల్పితే , కొన్ని మోడళ్ళపై దిగుమతి సుంకాన్ని 100 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తామని తెలిపింది.
ఈ నేపథ్యంలో మోదీ, మస్క్ భేటీలో ఈ అంశం చర్చకు వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కెనడా ఎన్నికల్లో భారత్, చైనా జోక్యం చేసుకున్నాయా?
