ఐపీఎల్: దిల్లీ కేపిటల్స్పై పంజాబ్ కింగ్స్ విజయం

ఫొటో సోర్స్, ani
ఐపీఎల్-17లో శుక్రవారం దిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా పంజాబ్ జట్టు 19.2 ఓవర్లలోనే లక్ష్యం చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది.
దిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్ 29, మిషెల్ మార్ష్ 20, హోప్ 33, రిషబ్ పంత్ 18 పరుగులు చేశారు.
పంజాబ్ జట్టులో సామ్ కరన్ 63, శిఖర్ ధవన్ 22, ప్రభ్ సిమ్రన్ 26 పరుగులు చేశారు.




