ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
రష్యాలో మృతిచెందిన భారత పౌరుడి పేరు మహ్మద్ అఫ్సన్గా ఎంబసీ వెల్లడించింది. మృతదేహాన్ని భారత్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
రష్యాలో మృతిచెందిన భారత పౌరుడి పేరు మహ్మద్ అస్ఫన్గా ఎంబసీ వెల్లడించింది.
ఈ సమాచారం గురించి తెలియజేస్తూ, రష్యాలోని భారత ఎంబసీ కార్యాలయం ట్వీట్ చేసింది.
"భారత పౌరుడు మహ్మద్ అస్ఫన్ మరణానికి చింతిస్తున్నాం. అతడి కుటుంబ సభ్యులతోనూ, రష్యా అధికార యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. అస్ఫన్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు కృషి చేస్తున్నాం" అని ట్వీట్లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతకుముందు, ఇజ్రాయెల్లో జరిగిన హిజ్బుల్లా దాడుల్లో భారత పౌరుడు మరణించారు. అదే దాడిలో మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ముగ్గురూ కేరళకు చెందిన వారుగా చెప్తున్నారు.
రష్యాలో భారతీయుడి మరణం గురించి వార్తలు వచ్చిన సమయంలో ది హిందూ పత్రిక ప్రచురించిన కథనంలో, రష్యాలో ఉద్యోగాలంటూ కొంతమందిని భారత్ నుంచి తీసుకువెళ్లి, సైన్యంలో చేర్చారని రాసింది.
దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, రష్యాకు వెళ్లిన వారిని తిరిగి తీసుకువచ్చేందుకు రష్యా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.
ఫిబ్రవరి 29న భారత విదేశీ వ్యవహారాల శాఖ తొలిసారిగా విడుదల చేసిన ప్రకటనలో 20 మందికి పైగా భారతీయులు తమను భారత్ పంపేందుకు సాయం కోరుతూ మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారని తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ షబ్నీమ్ ఇస్మాయిల్ 'మహిళల క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతి వేసిన బౌలర్'గా రికార్డు సృష్టించారు.
మంగళవారం దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మూడో ఓవర్ రెండో బంతిని షబ్నీమ్ గంటకు 132.1 కి.మీ.ల వేగంతో బంతిని విసిరారు.
మ్యాచ్ తర్వాత ఈ రికార్డు గురించి ఆమెను అడిగినప్పుడు, బంతి వేసేటప్పుడు స్క్రీన్ను చూడలేదన్నారు.
అయితే, ఈ మ్యాచ్లో 26 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్పై దిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది.
దక్షిణాఫ్రికాకు చెందిన షబ్నీమ్ 2023 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు రష్యా టాప్ కమాండర్లకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వారెంట్ జారీ అయిన వారిలో సెర్గీ కోబిలాష్ రష్యా ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్గా, విక్టర్ సోకోలోవ్ నేవీ అడ్మిరల్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
యుక్రెయిన్లో యుద్ధానికి సంబంధించి రష్యా ఉన్నతస్థాయి అధికారులకు ఐసీసీ నుంచి ఇది రెండో రౌండ్ వారెంట్. అంతకుముందు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా పిల్లల హక్కుల కమిషనర్లపై వారెంట్ జారీ అయ్యింది. అయితే, ఐసీసీని రష్యా గుర్తించడం లేదు.
యుక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలు లక్ష్యంగా జరిపిన క్షిపణి దాడులకు ఈ ఇద్దరూ బాధ్యులని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని ఐసీసీ తెలిపింది. ఈ ఘటనలు 2022 అక్టోబర్, 2023 మార్చి మధ్య జరిగినట్లు తెలిపింది.
ఈ దాడుల వల్ల పౌరులకు నష్టం వాటిల్లిందని కోర్టు పేర్కొంది. ఇద్దరూ మానవజాతికి వ్యతిరేకంగా అమానవీయ చర్యలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.