ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
అల్ అహ్లి ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడిలో సుమారు 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం చెప్పింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ కప్లో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్లో అఫ్గానిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్, 50 ఓటర్లలో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
289 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. 34.4 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
న్యూజిలాండ్ 149 పరుగుల తేడాతో గెలిచింది.
80 బంతుల్లో 71 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ’ మధ్య జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.
ములుగులో జరిగిన బహిరంగ సభలో రాహుల్, ఆయన సోదరి ప్రియాంక పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే తెలంగాణ ఏర్పాటు చేశామని రాహుల్ చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని ఆయన తెలిపారు.
అంతకుముందు రాహుల్, ప్రియాంక రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆరు గ్యారంటీల కార్డుకు పూజలు చేశారు.
రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని,తన జీవితంలో అలాంటి ఆలయాన్ని ఇంతవరకూ చూడలేదన్నారు ప్రియాంక.
కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రియాంక, రాహుల్ రామప్ప ఆలయం నుంచి ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
గాజా నగరంలోని అల్ అహ్లి ఆసుపత్రిపై దాడిలో వందల మంది పౌరులు చనిపోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.
“గాజాలోని అల్ అహ్లి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు పోవడం దిగ్భ్రాంతి కలిగించింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ యుద్ధంలో పౌరులు మరణించడం విషాదకరం. ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలి” అని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
అల్ అహ్లి ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడిలో సుమారు 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం చెప్పింది.
ఆస్పత్రిపై ఇజ్రాయెలే వైమానిక దాడి చేసిందని మిలిటెంట్ సంస్థ హమాస్ ఆరోపిస్తోంది. దాడితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ రాకెట్లు గురితప్పడం వల్ల ఈ పేలుళ్లు జరిగాయని ఇజ్రాయెల్ అంటోంది.
ఈ దాడి దారుణమైన యుద్ధ నేరమని, ఇజ్రాయెల్ అన్ని హద్దులూ దాటేసిందని పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ చెప్పారు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ మాట్లాడుతూ- ఈ కష్ట సమయంలో ఇజ్రాయెల్కు భారత్ అండగా నిలుస్తుందని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, EPA
గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రి పేలుళ్ల ఘటనపై పలు దేశాల్లోని అమెరికా, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ ఎంబసీల ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.
దాడి ఆమోదయోగ్యం కాదు-ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం
“ఈ దాడి ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. ఈ విషాద ఘటనపై స్పందించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు” అని గాజా ఆసుపత్రి వద్ద జరిగిన పేలుళ్లపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగాధిపతి వొల్కర్ టర్క్ స్పందించారు.
“అల్ అహ్లీ అరబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు, వైద్య సిబ్బందితోపాటు, ఆసుపత్రి పరిసరాల్లో తలదాచుకుంటున్న వందల మంది చనిపోయారు. ఈ దాడిని ఖండిస్తున్నాను” అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
గాజా సిటీలోని అసుపత్రి వద్ద జరిగిన పేలుళ్లలో వందల మంది చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడ 500 మంది మృతి చెందారని హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో గాయాలపాలైన పాలస్తీనీయులు చికిత్స పొందుతున్న అల్ అహ్లీ ఆస్పత్రి వద్ద ఈ పేలుళ్లు జరిగాయి.
ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని హమాస్ ఆరోపిస్తోంది. ఆస్పత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని హమాస్ ఆరోపించింది. ఇది యుద్ధనేరంగా అభివర్ణించింది.
అయితే, దీంతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ రాకెట్లు గురితప్పడం వల్ల ఈ పేలుళ్లు జరిగాయని చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ దాడి గురించి ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఒకరు బీబీసీతో మాట్లాడారు. “వందల మంది చనిపోయారు, అంతే సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఘోరమైన దాడి'' అని అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులను ఖండించినట్లు రాయిటర్స్ తెలిపింది. ఇది “క్రూరమైన తీవ్రవాదులు” చేసిన దాడిగా ఆయన చెప్పారని పేర్కొంది.
మరోవైపు ఈ దాడికి అమెరికాదే బాధ్యతని హమాస్ నాయకులు ఇస్మాయిల్ హనియే అన్నారు. “ఇజ్రాయెల్ దూకుడుకి అమెరికా మద్దతిస్తోంది. ఆసుపత్రి మారణకాండను చూస్తే శత్రువు ఓటమి భయంతో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది” అని ఆయన ఒక టీవీ చానెల్ ప్రసంగంలో అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.