రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం లక్నో న్యాయవాది అశోక్ పాండే సుప్రీంకోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు.

లైవ్ కవరేజీ

  1. తల్లిదండ్రులకు భయపడి కుక్క కరిచిన విషయం దాచిన విద్యార్థి.. రేబిస్‌తో మృతి

    dog

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో 14 ఏళ్ల బాలుడు కుక్క కాటుతో మృతి చెందాడు.

    ఎనిమిదో తరగతి చదివే ఆ బాలుడిని కొద్ది వారాల కిందట కుక్క కరవగా తల్లిదండ్రులకు చెబితే ఏమంటారో అన్న భయంతో విషయం దాచి పెట్టాడని, పోమవారం ఆ విద్యార్థి మరణించాడని స్థానిక పోలీసులు తెలిపారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన 14 ఏళ్ల షావాజ్‌ను నెల పదిహేను రోజుల కిందట పొరుగింటివారి కుక్క కరిచింది.

    కానీ తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి షావాజ్ ఆ విషయం దాచిపెట్టాడు.

    అయితే, సెప్టెంబర్ 1 నుంచి షావాజ్ ప్రవర్తన అసాధారణంగా మారిపోయింది. దాంతో బాలుడిని ఏం జరిగిందో చెప్పమని తల్లిదండ్రులు అడగడంతో కుక్క కరిచిన విషయం అప్పుడు చెప్పాడు.

    దాంతో తల్లిదండ్రులు ఆయన్ను దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అక్కడ వారు చేర్చుకోలేదు. ఆ తరువాత బులంద్‌శహర్‌లో ఆయుర్వేద వైద్యం కోసం తీసుకెళ్లారు.

    బులంద్‌శహర్ నుంచి గాజియాబాద్ తిరిగి తీసుకొస్తుండగా అంబులెన్సులోనే షావాజ్ చనిపోయాడని పోలీసులు చెప్పారు.

    ఈ ఘటనపై కేసు నమోదైందని, కుక్క యజమానులపై చర్య తీసుకుంటామని ఏసీపీ నిమిష్ పటేల్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. 'రేపో, ఎల్లుండో నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో' : చంద్రబాబు

  3. పుతిన్, కిమ్ జోంగ్ ఉన్: వీరిద్దరూ కలవడం ప్రపంచానికి ఆందోళనకరమా?

  4. భారత్ అనే పేరు ఎలా వచ్చింది... దీని వెనుక దాగిన నీరు, నిప్పుల కథేంటి?

  5. భారత్ అనే పేరు ఎలా వచ్చింది... దీని వెనుక దాగిన నీరు, నిప్పుల కథేంటి?

  6. భారత్ అనే పేరు ఎలా వచ్చింది... దీని వెనుక దాగిన నీరు, నిప్పుల కథేంటి?

  7. జీ-20 అంటే ఏంటి... ఈసారి సమావేశాలు దిల్లీలో ఎందుకు జరుగుతున్నాయి?

  8. బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం

    తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా న్యూస్ అప్డేట్స్‌తో లైవ్ పేజీలో మళ్ళీ కలుసుకుందాం.

    అంతవరకు సెలవు. గుడ్ నైట్.

  9. 10 క్యాన్సర్‌ లక్షణాలు... వీటిలో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకండి

  10. హైదరాబాద్‌: ఇళ్ళల్లోని సామాన్లు బయట పడేస్తున్న వర్షాలు... జనం బేజారు

  11. ఆడవాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి... భావోద్వేగాలను బాగా వ్యక్తం చేసే వాళ్ళు దర్పంగా, దూకుడుగా ఉంటారా?

  12. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

    మోదీ ఇంటిపేరును ఉ్దదేశించి చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

    ఈ శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో, రాహుల్ గాంధీ వర్షాకాల సమావేశాల్లో తన సభ్యత్వాన్ని తిరిగి పొందారు.

    రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణను వ్యతిరేకిస్తూ లక్నో న్యాయవాది అశోక్ పాండే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారణ అయి, రెండేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత రాహుల్ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారని పాండే తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    లోక్‌సభ స్పీకర్ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించడం సరికాదన్నారు.

    రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసుకోవాలని పాండే తన పిటిషన్‌లో కోరారు.

  13. చంద్రుడిపై స్థావరం: అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించేందుకు న్యూక్లియర్ ఫ్యుయెల్ సెల్స్

  14. రోహిత్ శర్మకు కోపం ఎందుకు వచ్చింది?

    రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, ANI

    భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా అడిగే ప్రశ్నలపై విసుగు ప్రదర్శించారు.

    భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరిగే సందర్భంగా నెలకొనే వాతావరణంపై విలేకరులు రోహిత్ శర్మను ప్రశ్నించారు.

    ఈ ప్రశ్నపై రోహిత్ శర్మ కోపగించుకున్నారు.

    ‘‘నేను మీకు ఎన్నిసార్లు ఈ విషయం చెప్పాలి. బయట ఏం జరుగుతుందో మాకు అవసరం లేదు. ఎందుకంటే మా పని వేరే. బయట వాతావరణానికి అనుగుణంగా ఆడడం మా పని కాదు. క్రీడాకారులందరూ ప్రొఫెషనల్స్. జట్టులో ఉండే వాళ్లందరూ ఈ విషయాలన్నీ చూశారు.’’ అని రోహిత్ శర్మ అన్నారు.

    ఈ విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    చాలా మంది యూజర్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

    భవిష్యత్‌లో మరోసారి ఈ ప్రశ్నలు అడగొద్దని కూడా రోహిత్ శర్మ విలేకరులకు సూచించారు.

    ‘‘ప్రపంచకప్ సమయంలో కూడా ఇలాంటి ప్రశ్నలను అడగొద్దు. ఎందుకంటే నేను దీనికి సమాధానం చెప్పను. దీని గురించి మరింత మాట్లాడటం అనవసరం. మా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. టీమ్‌గా మేమందరం ఆట మీదే దృష్టి పెట్టాలనుకుంటాం’’ అని రోహిత్ శర్మ చెప్పారు.

  15. క్రికెట్ వరల్డ్ కప్‌ 2023: హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ సహా ఇండియన్ టీమ్‌లో ఎవరెవరు... ఏ మ్యాచ్ ఎప్పుడు?

  16. వరల్డ్ కప్‌: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. సిరాజ్‌కు చోటు

    వరల్డ్ కప్

    ఫొటో సోర్స్, Getty Images

    నేటి నుంచి సరిగ్గా నెల రోజుల్లో భారత్ వేదికగా జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

    15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.

    ఈ జట్టులో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కింది. తిలక్ వర్మకు నిరాశ ఎదురైంది.

    జట్టులో సంజూ శామ్సన్‌కు కూడా చోటు దక్కలేదు.

    భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, సిరాజ్.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. కెన్యా: తిండి గింజలకు డబ్బుల్లేక పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్న తల్లిదండ్రులు

  18. ఇండియా కాదు, భారత్? - ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరిట జీ-20 ఆహ్వానాలు పంపారంటూ కాంగ్రెస్, ఆప్ విమర్శలు

  19. భూమికి చంద్రుడు ఏమవుతాడు? బిడ్డా? లేక తోబుట్టువా?

  20. భారత్, పాకిస్తాన్ రెండింటి తరపున ఆడిన ముగ్గురు పంజాబీ క్రికెటర్ల కథ