లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
అయిదుగురు ప్రధాన నిందితులు కాగా ఒకరు బాల నేరస్థుడని మణిపుర్ పోలీసులు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, FB/KCR
తెలంగాణలో వైకల్యంతో బాధపడుతున్నవారికి ఇచ్చే ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ. 4,016కి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెంచిన ఈ పింఛన్ మొత్తం జులై నుంచి అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఇప్పటివరకు రూ. 3,016 చొప్పున నెలకు పింఛను వస్తుండగా ఇక నుంచి మరో వెయ్యి రూపాయలు అదనంగా అందనున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.
దీంతో ఇంతవరకు ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయింది.
ఇందులో అయిదుగురు ప్రధాన నిందితులు కాగా ఒకరు బాల నేరస్థుడని మణిపుర్ పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
వెస్టిండీస్తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి పలు రికార్డులు బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్లో కోహ్లి 180 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో సెంచరీని అందుకున్నాడు. ఫలితంగా తాను ఆడుతున్న 500వ అంతర్జాతీయ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకోవడంతో పాటు, దాదాపు అయిదేళ్ల తర్వాత టెస్టుల్లో విదేశీ గడ్డపై సెంచరీని నమోదు చేశాడు.
కోహ్లీ చివరగా 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాలోని పెర్త్లో సెంచరీ చేశాడు.
ఓవర్నైట్ స్కోరు 87 పరుగులతో రెండోరోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన కోహ్లీ 206 బంతుల్లో 11 ఫోర్లతో 121 పరుగులు చేశాడు.
ఈ సెంచరీతో టెస్టుల్లో దిగ్గజ డాన్ బ్రాడ్మన్ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. దాంతోపాటు అంతర్జాతీయ క్రికెట్లో 76 సెంచరీలను అందుకున్నాడు.
అంతేకాకుండా, భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సెహ్వాగ్ (8,586)ను వెనక్కి నెట్టి కోహ్లీ (8, 676) అయిదో స్థానానికి చేరాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్, లక్ష్మణ్ మాత్రమే ముందున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత క్రికెటర్లలో సచిన్, ద్రవిడ్, ధోని మాత్రమే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా, తాజాగా ఈ జాబితాలో కోహ్లీ కూడా చేరాడు.
రెండు టెస్టులో కోహ్లీతోపాటు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది.
విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జోమెల్ వారికన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. జేసన్ హోల్డర్కు 2, గాబ్రియెల్కు ఒక వికెట్ దక్కాయి.
అనంతరం తొలి ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన విండీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.
భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే విండీస్ ఇంకా 352 పరుగులు వెనుకబడి ఉంది.
త్యాగనరైన్ చందర్పాల్ (33)ను జడేజా అవుట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని అనుసరించండి.