అమెజాన్ అడవుల్లో నలుగురు పిల్లల్ని కాపాడిన కుక్క తప్పిపోయింది... అన్వేషణ కొనసాగుతోంది

కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో 40 రోజుల పాటు చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడిన తర్వాత కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈసారి ఆ పిల్లల్ని గుర్తించడంలో సాయపడిన శునకం కోసం.

లైవ్ కవరేజీ

  1. బిపర్జోయ్ తుపాను: భారత్, పాకిస్తాన్‌లో వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

    తుపాన్

    ఫొటో సోర్స్, ANI

    అతి తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌లో అరేబియా సముద్రం తీర ప్రాంతాల నుంచి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం గుజరాత్‌లోని కచ్ వద్ద తీరం దాటనుంది.

    పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌, కరాచీ పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

    తుపాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో భారత్‌లో ఏడుగురు చనిపోయారు.

    తీరప్రాంత జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 38 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

    తుపాను నేపథ్యంలో రైలు సర్వీసులను నిలిపివేశామని, కండ్లా, ముంద్రా పోర్టుల్లోనూ కార్యకలాపాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, సందర్శకులు బీచ్‌లకు రావొద్దని సూచించారు.

  2. సాక్షి మలిక్: 'ప్రధాని మోదీ మౌనం మమ్మల్ని బాధిస్తోంది'

  3. సౌదీతో చైనా ఒప్పందాలు చేసుకుంటే భారత్ ఎందుకు టెన్షన్ పడుతోంది?

  4. టైటానిక్ లాగా సముద్రంలో మునిగిపోయిన నౌకలెన్ని... వాటిలోని సంపద ఎంత?

  5. చే గువేరా జయంతి: భారత్‌ సందర్శించిన తర్వాత ఆయన తన నివేదికలో ఏం రాశారు?

  6. పవన్ కళ్యాణ్‌ విజయ వారాహి యాత్ర నేడు ప్రారంభం

    పవన్ కళ్యాణ్‌

    ఫొటో సోర్స్, JanaSena Party/Facebook

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్ర కాకినాడ జిల్లాలో నేడు ప్రారంభంకానుంది. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తొలిరోజు ఆయన పర్యటిస్తారు.

    అన్నవరం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. తరువాత కత్తిపూడిలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.

    యాత్రకు ముందు పవన్ కళ్యాణ్‌ అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో యాత్ర సాగుతుంది.

    ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర, సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

    ఈనెల 22కు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చేరుకుంటుంది.

    ఆ యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాల సమస్యలపై చర్చించబోతున్నట్టు జనసేన చెబుతోంది.

    పవన్ కళ్యాణ్‌

    ఫొటో సోర్స్, JanaSena Party/Facebook

    రాజకీయంగా ఇది కీలకయాత్రగా భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎక్కువగా కనిపించిన ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుతోంది.

    ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులు అన్నవరం చేరుకున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి పవన్ అభిమానులు యాత్ర వెంబడి సాగేందుకు సిద్దమవుతున్నారు. దానికి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు కాకినాడ జిల్లా పోలీసులు చెబుతున్నారు.

    ఈ యాత్ర నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ నిన్న తన వాహనం వారాహికి పూజలు జరిపించారు.

  7. వరల్డ్ బ్లడ్ డోనర్ డే: అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఏవి? అత్యవసర పరిస్థితుల్లో అలాంటి రక్తం ఎక్కడ దొరుకుతుంది?

  8. అమృత్‌సర్: ఆకలి ఎరుగని నగరం.. సిక్కుల సేవాగుణానికి ఇది ఎలా ఉదాహరణగా నిలుస్తోంది?

  9. గాల్లో అదృశ్యమైన ఎంహెచ్370 విమానంపై జోకు వేసిన కమేడియన్ కోసం గాలింపు

    జోసెలిన్ చియా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, జోసెలిన్ చియా

    న్యూయార్క్‌కు చెందిన ఒక కమెడియన్ మలేసియా విమానం ఎంహెచ్370పై జోక్ చేశారన్న కారణంగా ఆమెను పట్టుకోవడానికి మలేసియా పోలీసులు ఇంటర్‌పోల్ సహాయం కోరారు.

    2014 మార్చిలో కౌలాలంపూర్ నుంచి టేకాఫ్ అయిన ఎంహెచ్370 విమానం అదృశ్యమైంది. హిందూ మహాసముద్రంలో నాలుగేళ్లపాటు వెతికినా ఈ విమానం ప్రధాన భాగం దొరకలేదు. విమానంలో ఉన్న మొత్తం 239 మంది చనిపోయారని భావిస్తున్నారు.

    అమెరికాలో పుట్టి సింగపూర్‌లో పెరిగిన కమెడియన్ జోసెలిన్ చియాపై రెచ్చగొట్టడం, అభ్యంతరకరమైన ఆన్‌లైన్ కంటెంట్‌కు సంబంధించిన చట్టాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    గతవారం ఆమె ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక జోక్‌పై మలేషియా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అయితే, సింగపూర్ ప్రభుత్వం అందుకు క్షమాణలు కోరింది. ఆమె సింగపూర్ వాసులకు ప్రతినిధి కారని స్పష్టం చేసింది.

    జోసెలిన్ చియా మాన్‌హాటన్ కామెడీ సెల్లార్ వెన్యూలో స్టాండ్ అప్ కామెడీ షో చేశారు. దాని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    మలేసియా విమానాలు ఎగరలేవని జోక్ చేస్తూ, "మలేసియా ఎయిర్‌లైన్స్ అదృశ్యమైపోవడం ఫన్నీగా లేదూ? కొన్ని జోక్స్ భూమి మీదకు దిగవు" అంటూ కామెడీ చేశారు.

    చారిత్రకంగా మలేసియా, సింగపూర్‌ల మధ్య శతృత్వం ఉంది. ఒకప్పుడు ఈ రెండు దేశాలు ఒకే దేశం కింద ఉండేవి. తరువాత, సింగపూర్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగింది. మలేసియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది.

    ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెడీని మలేసియా తీవ్రంగా పరిగణిస్తోంది.

  10. చిత్తూరు: నిరుడు కేజీ రూ.70 పలికిన తోతాపురి మామిడిని రైతులు ఇప్పుడు రూ.10కే అమ్మాల్సి వస్తోంది? దీని వెనక ఎవరున్నారు?

  11. నేను నిర్దోషిని.. రహస్య పత్రాలపై విచారణలో డోనాల్డ్ ట్రంప్

    డోనాల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    రహస్య పత్రాల కేసులో తాను నిర్దోషినని డోనాల్డ్ ట్రంప్ మయామి కోర్టులో వాదించారు.

    అమెరికాలో మాజీ లేదా ప్రస్తుత అధ్యక్షుల్లో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తి డోనాల్డ్ ట్రంప్.

    ట్రంప్ తన పదవీ కాలం ముగిసిన తరువాత కూడా అధికారిక రహస్య పత్రాలను తన వద్దే ఉంచుకున్నారని, వాటిని తీసుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

    ఆ మేరకు ఆయనపై కేసు దాఖలైంది. మంగళవారం మయామి కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది.

    ఇది అమెరికా చరిత్రలో చీకటి రోజని, తనపై ఆరోపణలు రాజకీయ కుట్ర అని ట్రంప్ ఇంతకుముందు పేర్కొన్నారు.

    మయామి కోర్టుకు హాజరయే ముందు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో "మన దేశానికి ఇంతటి విషాదమైన రోజున నాకు ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు" అని పోస్ట్ చేశారు.

    "ఈ కేసులో ట్రంప్ నిర్దోషి" అని కోర్టులో ఆయన తరపు లాయర్ వాదించారు.

  12. లండన్: తెలుగమ్మాయి తేజస్వినీ రెడ్డి హత్య కేసులో మూడో అరెస్టు

  13. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.

    సెలవు. నమస్తే.

  14. చికెన్ ధర అమాంతం పెరిగింది... ఎందుకు?

  15. ఆడవాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది?

  16. అమెజాన్ అడవుల్లో నలుగురు పిల్లల్ని కాపాడిన కుక్క తప్పిపోయింది...

    విల్సన్

    ఫొటో సోర్స్, colombian army

    కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో 40 రోజుల పాటు చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడిన తర్వాత కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

    పిల్లల్ని వెతకడంలో సాయపడిన విల్సన్ అనే రెస్క్యూ డాగ్ ఆ అడవిలోనే తప్పిపోయింది.

    ఆరేళ్ల విల్సన్ అమెజాన్ అడవుల్లో చిక్కుకుపోయిన నలుగురు పిల్లలకి చెందిన చాలా క్లూస్‌ను కనిపెట్టడంలో సాయపడింది.

    మే 1న జరిగిన విమాన ప్రమాదం అనంతరం ఈ నలుగురు పిల్లలు అమెజాన్ అడవుల్లో తప్పిపోయారు.

    వీరు తమ తల్లితో కలిసి ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో వారి తల్లి మరణించారు.

    13 ఏళ్లు, 9 ఏళ్లు, నాలుగేళ్లు, ఏడాది వయసున్న ఈ పిల్లలు అత్యంత విషపూరితమైన పాములు, ప్రమాదకరమైన జాగ్వార్‌లు, దోమలుండే చిత్తడి, దట్టమైన అమెజాన్ అడవుల్లో 40 రోజుల పాటు ఇరుక్కుపోయారు.

    పిల్లల్ని వెతికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు, విల్సన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది.

    విల్సన్ వల్లనే అడవిలో పిల్లల మాటలను రెస్క్యూ టీమ్ వినగలిగింది. అప్పుడే పిల్లలు బతికి ఉన్నారని ప్రజల్లో ఆశ కలిగింది.

    తేమ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సంక్లిష్టత కారణంతో ఈ దట్టమైన అమెజాన్‌ అడవుల్లో ఆరేళ్ల విల్సన్ కూడా కనిపించకుండా పోయింది.

  17. ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లులో ఈ చార్జీలు ఏంటి... వీటిని ఎందుకు వసూలు చేస్తున్నారు?

  18. క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్... కీమో థెరపీకి బదులుగా సరికొత్త టాబ్లెట్

  19. లెస్బియన్ జంట: ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అమ్మాయి... వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?

  20. ఆమె చనిపోయారనుకున్నారు.. శవపేటికలో పెట్టాక ఊపిరి ఆడుతూ కనిపించింది