You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కొనసాగుతున్న సస్పెన్స్

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు తనను దిల్లీకి రావాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆహ్వానించిందని, తాను వెళ్తున్నానని చెప్పిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం బెంగళూరులోనే ఉండిపోయారు.

లైవ్ కవరేజీ

  1. బజరంగ్‌దళ్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకి పంజాబ్ కోర్టు సమన్లు

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది.

    బజరంగ్‌దళ్, ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధిస్తామని కర్ణాటక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

    దానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ ఖర్గేపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.

    విశ్వ హిందూ పరిషత్‌ అనుబంద సంస్థ అయిన 'బజరంగ్ దళ్ హిందూస్తాన్' అధ్యక్షుడు హితేశ్ భరద్వాజ్ పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మల్లికార్జున్ ఖర్గేకు సమన్లు ఇచ్చింది.

    అధికారంలోకి వస్తే కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

    పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, బజరంగ్‌దళ్ వంటి సంస్థల పేర్లను అందులో చేర్చింది.

    అయితే, బజరంగ్‌దళ్‌ను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో కాంగ్రెస్ పోల్చడం వివాదానికి దారితీసింది.

    బజరంగ్‌దళ్‌ను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సిమి, అల్ ఖైదా వంటి సంస్థలతో పోల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిషేధిస్తామంటూ చేస్తున్న బెదిరింపులకు బజరంగ్‌దళ్ భయపడదని విశ్వహిందూ పరిషత్ తెలిపింది.

  2. గూఢచర్యం ఆరోపణలతో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ

  3. ఇంటి పెద్ద మ‌ర‌ణిస్తే రూ.20 వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కం గురించి మీకు తెలుసా?

  4. సితవే: మియన్మార్‌‌కు చెందిన ఈ పట్టణం కోసం భారత్, చైనా, బంగ్లాదేశ్‌లు ఎందుకు పోటీ పడుతున్నాయి?

  5. ధన్యవాదాలు... రేపు లైవ్ పేజీలో మళ్ళీ కలుసుకుందాం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ తాజా వార్తలతో కలుసుకుందాం.

    సెలవు. నమస్తే.

  6. బైకు కొనలేక ఏకంగా మినీ జీపు తయారు చేసుకున్న అన్మదమ్ములు

  7. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కొనసాగుతున్న సస్పెన్స్

    కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ... రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించడం రేపటికి వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోగ్య కారణాల వల్ల ఇవాళ బెంగళూరులోనే ఉండిపోవాల్సి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. తనకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆహ్వానం అందిందని, ఈరోజు సాయంత్రమే దిల్లీకి బయలుదేరుతున్నానని శివకుమార్ అంతకుముందు విలేఖరులకు చెప్పారు.

    అయితే, ఆయన బీపీ బాగా పెరిగిపోయిందని, ప్రయాణాలు మానుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. శివకుమార్ కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన రేపు దిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది.

    కర్ణాటక లెజిస్లేచర్ పార్టీ కూడా తమ నాయకుడిని పార్టీ అగ్రనాయకత్వం ఎన్నుకోవాలని కోరుతూ ఒక తీర్మానం చేసింది. శివకుమార్ ఈ సాయంత్రం దిల్లీకి వెళ్ళకపోవడంతో సహజంగానే రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మెజారిటీ శాసన సభ్యుల మద్దతు తనకు ఉందని సిద్ధరామయ్య చేసిన ప్రకటనపై స్పందించాలని కోరినప్పుడు, “సిద్ధరామయ్యకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నట్లయితే, ఆయనకు నా శుభాకాంక్షలు” అని శివకుమార్ అన్నారు.

  8. కర్ణాటక సీఎంపై నిర్ణయం రేపటికి వాయిదా, హైబీపీ వల్ల దిల్లీకి వెళ్లలేకపోయిన శివకుమార్

    కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోగ్య కారణాల రీత్యా దిల్లీకి వెళ్లకపోవడంతో, కర్ణాటక ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం రేపటికి వాయిదా పడే అవకాశం ఉంది.

    బీపీ అధికంగా ఉన్నందున ప్రయాణం చేయవద్దని శివకుమార్‌కు వైద్యుడు సూచించినట్లు శివకుమార్ కార్యాలయం తెలిపింది.

    ‘‘ఒకవేళ రేపటికి ఆయన ఆరోగ్యం కుదుటపడితే దిల్లీకి వెళ్తారు’’ అని బీబీసీతో ఆయన కార్యాలయ వర్గాలు అన్నాయి.

    కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు ఉదయం శివకుమార్‌తో పాటు సిద్ధరామయ్యను దిల్లీకి ఆహ్వానించింది.

    కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం వీరిద్దరూ పోటీ పడుతున్నారు.

    మధ్యాహ్నం దిల్లీకి బయల్దేరిన సిద్ధరామయ్య సాయంత్రానికల్లా చేరుకున్నారు.

    డీకే శివకుమార్ దిల్లీ వెళ్లకపోవడంపై కర్ణాటక మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

    తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని సిద్ధరామయ్య చేసిన ప్రకటనపై విలేఖరులు శివకుమార్‌ను ప్రశ్నించగా.. ఆయనకు సంఖ్యాబలం ఉంటే నా అభినందనలు అంటూ స్పందించారు.

  9. మోఖా తుపాను: బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య తీరం దాటి సృష్టించిన విధ్వంసం ఇదే...

  10. పాన్‌జీనోమ్: డీఎన్ఏ గుట్టు కనిపెట్టడంలో మరో ముందడుగు... దీనివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చా?

  11. ఫేస్‌బుక్ లైవ్‌లో పిస్టల్‌తో తలపై కాల్చుకున్నాడు, అదే పిస్టల్‌తో ప్రియురాలిని చంపేశాడు... అసలేం జరిగింది?

  12. కర్ణాటక: 'ఒక ధైర్యవంతుడు పార్టీకి మెజారిటీ అందించగలడు' -డీకే శివకుమార్

    "ధైర్యవంతుడైన ఒకే ఒక వ్యక్తి పార్టీకి మెజారిటీని సాధించగలడని నేను నమ్ముతున్నాను. ఆ విషయాన్ని నేను నిరూపించాను" అని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివ కుమార్ అన్నారు.

    గత అయిదేళ్ళలో ఏం జరిగిందన్నది నేను వెల్లడించదలచుకోలేదని చెప్పిన శివకుమార్, తన అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 135 సీట్లు గెలుచుకుందని అన్నారు.

    సిద్ధరామయ్యతో పాటు తనను దిల్లీకి రావాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆహ్వానించిందని ఆయన చెప్పారు.

    ఇప్పటికే సిద్ధరామయ్య దిల్లీకి చేరుకోగా, శివకుమార్ కూడా వెళ్లనున్నారు.

    ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై వదిలేశారు.

  13. సీబీఐ కొత్త డైరెక్టర్‌‌గా నియమితులైన ప్రవీణ్ సూద్ ఎవరు... కర్ణాటక డీజీపీగా ఆయన ఏం చేశారు?

  14. ఢిల్లీ రాయబారిపై తాలిబాన్ల నిర్ణయం, భారత్ ఒప్పుకుంటుందా?

    భారత్‌లో అఫ్గాన్ రాయబారి ఫరీద్ మముంజాయ్‌ని వెనక్కు రప్పించాలని తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన స్థానంలో ట్రేడ్ కౌన్సిలర్‌ ఖాదిర్ షాను ఇండియాకు తాత్కాలిక రాయబారిగా నియమించింది.

    ఇండియాలోని అఫ్గాన్ ఎంబసీపై తాలిబాన్ విదేశాంగ శాఖ అవినీతి ఆరోపణలు చేసింది. న్యూఢిల్లీలోని ఎంబసీ కార్యాలయంలోని స్థలాన్ని ఇండియన్ కంపెనీకి లీజుకి ఇవ్వడంలో అవినీతి జరిగిందని ఆరోపించింది.

    తాలిబాన్ విదేశాంగ శాఖ రాసిన లేఖను టోలో న్యూస్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

    హిందూ పత్రిక కథనం ప్రకారం, తాలిబాన్ ప్రభుత్వం రాసిన లేఖకు ఫరీద్ మముంజాయ్ సమాధానమిచ్చింది.

    తాలిబాన్ ప్రభుత్వ ఆరోపణలు అసత్యాలని, అవి ఏకపక్షమని ఫరీద్ తన లేఖవో పేర్కొన్నట్లు తెలిపింది. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయిందని, అఫ్గాన్ ప్రజలు ఇంటా, బయట ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

    ఫరీద్ మముంజాయ్ 2020 నుంచి భారత్‌లో అఫ్గాన్ రాయబారిగా పనిచేస్తున్నారు.

    ఫరీద్ మముంజాయ్‌ని కాబూల్ వచ్చేయాల్సిందిగా తాలిబాన్ విదేశాంగ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ 25న ఆదేశించింది. ఢిల్లీలోని అప్గాన్ ఎంబసీని ట్రేడ్ కౌన్సిలర్ ఖాదిర్ షా సందర్శిస్తారని అదే రోజు తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖి తెలిపారు.

    2022 ఏప్రిల్‌లో చైనా రాయబారిని కూడా తాలిబాన్లు వెనక్కి రప్పించారు.

    అయితే, తాలిబాన్ల నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

    భారత్‌తో సహా ప్రపంచంలోని ఏ దేశం తాలిబాన్లకు గుర్తింపు ఇవ్వలేదు.

  15. కోల్‌కతాలో చైనాటౌన్ ఎలా పుట్టింది, అక్కడి చైనా వాళ్ళంతా ఏమైపోయారు?

  16. గుజరాత్: పట్నాన్ని తలపించే ఎన్నారై విలేజ్ కథ ఇది....

  17. మరణించిన కొడుకు గుర్తుగా మిగిలిన మనవరాలి కోసం ఒక తాత ఎదురుచూపులు

  18. సునీల్ గావస్కర్ షర్ట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్.. ఇది చరిత్రలో నిలిచే క్షణం అవుతుందా?

  19. సూడాన్: ‘బతకడానికి సిరియా నుంచి వచ్చా, ఇక్కడింకా ఘోరంగా ఉంది’

  20. గైనెకోమాస్టియా: ఆడవాళ్ల మాదిరిగా కొందరు మగవాళ్లలో రొమ్ములు పెద్దగా ఎందుకు ఉంటాయి?