లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
లంకతో జరుగుతున్న టీ20 మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ 91 పరుగుల తేడాతో గెలిచింది.
229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 131 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.
అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య రెండు వికెట్ల చొప్పున తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.
జరుగుతున్న టీ20 మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు.
45 బంతుల్లో 8 సిక్సులు 6 ఫోర్ల సాయంతో 100 పరుగులు తీశాడు.
మొత్తం మీద 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు 7 ఫోర్లు ఉన్నాయి.
శుభ్మన్ గిల్ 36 బంతుల్లో 46, రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 35 పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు.
45 బంతుల్లో 8 సిక్సులు 6 ఫోర్ల సాయంతో 100 పరుగులు తీశాడు.
మొత్తం మీద 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు 7 ఫోర్లు ఉన్నాయి.
20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.
శుభ్మన్ గిల్ 36 బంతుల్లో 46, రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 35 పరుగులు చేశారు.
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన రిటైర్మెంట్పై ప్రకటన చేశారు.
ఫిబ్రవరిలో జరగబోయే దుబయి టెన్నిస్ చాంపియన్షిప్తో ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలకనున్నట్లు సానియా చెప్పారు.
శుక్రవారం వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/ScreenGrab
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఆలయంలో ఒక మహిళపై దాడిచేసి, ఆమెను జట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకెళుతున్న వీడియో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన డిసెంబర్ 21వ తేదీన జరిగినట్లు చెప్తున్నారు. బాధిత మహిళ తనపై దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమృతహళ్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దేవుడి విగ్రహం పక్కన కూర్చోవాలని ఆమె భావించారని, ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని అక్కడి పూజారులు కోరినపుడు ఆమె కదలలేదని చెప్తున్నారు.
పదే పదే కోరినా ఆమె కదలకపోవటంతో.. ఆలయ సిబ్బందిలో ఒకరైన మునికృష్ణ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసు అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
‘‘ప్రాధమిక దర్యాప్తులో ఆమె మానసికంగా అస్థిరంగా ఉన్నారని, ఆలయం నుంచి బయటకు వెళ్లటానికి తిరస్కరించారని తెలిసింది’’ అని సదరు అధికారి తెలిపారు. ఆయన తన పేరు వెల్లడించవద్దని కోరారు.
ఈ ఉదంతంపై ‘‘ఐపీసీ సెక్షన్లు 354, 323, 324, 504, 506, 509 కింద కేసు నమోదు చేశాం’’ అని బెంగళూరు (నార్త్ ఈస్ట్) డీసీపీ అనూప్ షెట్టి బీబీసీకి చెప్పారు.
ఆ మహిళ తను షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తినా కాదా అనేది వెల్లడించలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు స్పీకర్గా రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్థి ఎన్నికయ్యారు. 15వ రౌండ్ ఓటింగ్ తర్వాత ఆయన స్పీకర్గా విజయం సాధించారు.
స్పీకర్ ఎన్నిక కోసం నాలుగు రోజులుగా ఓటింగ్ జరుగుతోంది.
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది.
అయితే, కొందరు రెబల్స్ వల్ల కెవిన్ తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది.
చివరకు 15వ రౌండ్ ఓటింగ్లో మొత్తం 428 ఓట్లు పోలవగా మెకార్థికి 216, డెమొక్రాట్స్ అభ్యర్థి హకీమ్ జెఫ్రీస్కు 212 ఓట్లు నమోదయ్యాయి. దీంతో మెకార్థి హౌజ్ స్పీకర్గా ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, UGC
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తటంతో పైలట్ అత్యవసరంగా దించేశారు.
బాలకృష్ణతో పాటు వీరసింహారెడ్డి సినీ యూనిట్ సభ్యులు పలువురు ఈ హెలికాప్టర్లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో శుక్రవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బాలకృష్ణ, శృతి హాసన్ సహా కొందరు ప్రముఖులు హెలికాప్టర్లో హైదరాబాద్ ప్రయాణమయ్యారు.
అయితే బయలుదేరిన 15 నిమాషాలకే ఏటీసీ క్లియరెన్స్ లేకపోవడం, ఇతర కారణాలతో హెలికాప్టర్ను ఒంగోలులోని పోలీస్ గ్రౌండ్స్లో అత్యవసరంగా దింపారు.
వాతావరణం సహకరించకపోవడం, ఇతర కారణాలు కూడా తోడయ్యాయని చెబుతున్నారు.
క్లియరెన్స్ లభిస్తే హెలికాప్టర్లో లేదా రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరేందుకు బాలకృష్ణ, శృతిహాసన్ తదితరులు ఒంగోలు పోలీస్ గ్రౌండ్లో కొంత సేపు వేచి చూశారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఒక ఆరేళ్ల బాలుడు టీచర్ మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు చెప్పారు.
న్యూపోర్ట్ న్యూస్ నగరంలోని రిచ్నెక్ ఎలిమెంటరీ స్కూల్లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయని చీఫ్ స్టీవ్ డ్రూ తెలిపారు.
ఆ బాలుడికి తుపాకీ ఎలా వచ్చిందో ఇంకా తెలియలేదన్నారు. అయితే ఆ ఘటన ‘‘ప్రమాద వశాత్తూ జరిగిన కాల్పులు’’గా ఆయన అభివర్ణించారు.
ఆరు నుంచి ఏడేళ్ల వయసు పిల్లలు ఉండే మొదటి తరగతి క్లాస్రూమ్లో టీచర్కు, విద్యార్థికి మధ్య వాగ్వాదం తర్వాత ఈ ఘటన జరిగింది.
ఈ కాల్పుల్లో టీచర్ తీవ్రంగా గాయపడ్డారని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 30 ఏళ్ల వయసున్న ఆ టీచర్ పేరును అధికారులు వెల్లడించలేదు.
ఈ స్కూల్లో దాదాపు 550 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో మెటల్ డిటెక్టర్ సదుపాయాలు ఉన్నాయని, విద్యార్థులను అడపా దడపా తనిఖీ చేస్తారు కానీ ప్రతి ఒక్క విద్యార్థినీ తినిఖీ చేయరని పోలీస్ చీఫ్ వివరించారు.
బాలుడు ఉపయోగించిన ఆయుధం పేరును వెల్లడించటానికి పోలీసులు నిరాకరించారు. అయితే అతడు ఒక హ్యాండ్గన్ ఉపయోగించినట్లు చెప్పారు.