కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6న వారిని తన నివాసం వద్ద కలుస్తానని తాను సీబీఐ అధికారులకు తెలిపానని ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు.

లైవ్ కవరేజీ

  1. కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు

    కల్వకుంట్ల కవిత

    ఫొటో సోర్స్, KAVITHA/FB

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద వివరణ కోరుతూ సీబీఐ తనకు నోటీసులు జారీ చేసిందని కవిత ఒక ప్రకటనలో తెలిపారు.

    సీబీఐ కోరిన విధంగా తాను హైదరాబాద్‌లోని తన నివాసంలో డిసెంబర్ 6న అధికారులను కలుసుకుంటానని చెప్పినట్లు కూడా కవిత వెల్లడించారు.

    "దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అక్కడి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై దాఖలైన కేసులో వెలుగు చూసిన వాస్తవాలు కొన్ని మీకు ఈ కేసుతో సంబంధం ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ ప్రయోజనాల కోసం ఆ వాస్తవాలకు సంబంధించి మిమ్మల్ని ప్రశ్నించవలసిన అవసరం ఏర్పడింది" అని సీబీఐ తన నోటీసులో పేర్కొంది.

    సీబీఐ నోటీసు

    అందుకని, డిసెంబర్ 6 ఉదయం 11 గంటలకు విచారణకు దిల్లీ లేదా హైదరాబాద్‌లో ఎక్కడ వీలవుతుందో దయచేసి తెలపాలని కూడా సీబీఐ కోరింది.

    ఈ లేఖపై స్పందించిన కవిత, హైదరాబాద్‌లో కలుసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.

  2. హిట్-2 మూవీ రివ్యూ: సైకో కిల్లర్ కథ ఎలా ఉందంటే...

  3. మీడియా సంస్థలు బిజినెస్ ఎంపైర్స్ చేతుల్లోకి వెళితే ఏమవుతుంది? - వీక్లీ షో విత్ జీఎస్

  4. మ్యూజియంలో భద్రపరిచిన 300 ఏళ్ళ నాటి గోదుమ గింజలకు ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించే శక్తి ఉందా?

  5. చైనా: 'షీ జిన్‌పింగ్ దిగిపో' అంటూ తొలిసారిగా నిరసన బాట పట్టిన చైనా నవతరం... ఆ దేశంలో అసలేం జరుగుతోంది?

  6. ఎయిర్‌ఇండియాకు టాటాలు పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా... విస్తారాలో విలీనం అందుకు దోహదపడుతుందా?

  7. చరిత్ర: ‘అంకెల్లో చెప్పలేనంత సంపద కలిగిన’ 10 మంది కుబేరులు

  8. రికీ పాంటింగ్‌కు గుండె పోటు అన్న అనుమానంతో ఆస్పత్రికి తరలింపు

    ఆస్ట్రేలియా క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు గుండె పోటు వచ్చిందన్న అనుమానంతో ఆస్పత్రిలో చేరారు.

    పెర్త్‌లో ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌కు రికీ పాంటింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మొదటి టెస్ట్‌లో ముడవరోజు క్రికెట్ కామెంటరీ చేస్తుండగా ఆయనకు గుండెనొప్పి వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తరలించారని రాయిటర్స్ వెల్లడించింది.

  9. హిట్-2 మూవీ రివ్యూ: సైకో కిల్లర్ కథతో మరో సస్పెన్స్ థ్రిల్లర్

  10. బైడెన్: 'యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని పుతిన్ కోరుకుంటే ఆయన్ను కలిసి చర్చించడానికి సిద్ధం'

    బైడెన్

    ఫొటో సోర్స్, SHAWN THEW/EPA

    రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడానికి మార్గాలు వెతుకుతుంటే, "ఆయన్ను కలిసి దీనిపై చర్చించడానికి సిద్ధమని" అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

    కానీ, పుతిన్ అలాంటి ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదని బైడెన్ అన్నారు.

    ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అమెరికాలో బైడెన్‌తో సమావేశమైన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

    రష్యా యుద్ధాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు.

    యుక్రెయిన్‌పై బలవంతంగా రాజీకి రావాలని ఒత్తిడి తేబోమని మాక్రాన్ స్పష్టం చేశారు.

    మరోపక్క రష్యా దాడి మొదలైన దగ్గర నుంచి సుమారు 13,000 మంది యుక్రెయిన్ సైనికులు మరణించారని యుక్రెయిన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఆయన మాటలను మిలటరీ ధృవీకరించలేదు.

  11. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలివే... ఇక్కడ జీవించాలంటే చాలా డబ్బు కావాలి

  12. తెలంగాణలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్

    అమర రాజా

    ఫొటో సోర్స్, KTR/TWITTER

    అమర రాజా గ్రూపుకు చెందిన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ తెలంగాణలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.

    ఆ మేరకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమర రాజా సంస్థ ప్రకటించింది.

    తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ లిథియం-అయాన్ బ్యాటరీ పరిశోధన, తయారీ సంస్థను ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది.

    వచ్చే పదేళల్లో ఈ పరిశ్రమపై రూ. 9500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్టు అమర రాజా బ్యాటరీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    తెలంగాణకు ఇది ఒక చారిత్రక విజయమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

    అమర రాజా సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

    ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ముందుగా హైదరాబాదులో అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని గల్లా జయదేవ్ తెలిపారు.

  13. అమ్మాయే, కానీ అచ్చం అబ్బాయిలా ఉంటుంది...

  14. సిద్ధూ మూసేవాలా హత్య సూత్రధారి గోల్డీ బ్రార్‌ను అమెరికాలో అరెస్టు చేశారు - భగవంత్ మాన్

    సిద్ధూ ముసేవాలా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సిద్ధూ ముసేవాలా

    పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న గోల్డీ బ్రార్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

    "కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఈ రోజు ఉదయం అమెరికాలో పట్టుకున్నారు. కాలిఫోర్నియా పోలీసులు మమ్మల్ని సంప్రదించారు. త్వరలో గోల్డీ బ్రార్‌ను భారతదేశానికి తీసుకువచ్చి, తగిన శిక్ష విధిస్తాం. దీనివల్ల చాలా కుటుంబాలు న్యాయం జరుగుతుంది" అని భగవంత్ సింగ్ మాన్ చెప్పారు.

    ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. ఆయనపై బహిరంగంగా బుల్లెట్లు కాల్చారు, దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.

  15. ‘‘టాయ్‌లెట్ల శుభ్రత, కోడిగుడ్డు సైజు ఫొటోలు పంపడం నాన్ టీచింగ్ డ్యూటీ కాదా ?’’- అని ఏపీ టీచర్లు ఎందుకు అడుగుతున్నారు?

  16. ఇస్రో గూఢచర్యం కేసు: నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

    ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్‌కు సంబంధించిన గూఢచర్యం కేసులో కేరళ హైకోర్టు మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పును నేడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

    నిందితుల బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల గడువులోగా తాజా నిర్ణయం తీసుకోవాలని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈలోగా, అయిదు వారాల వరకు నిందితులను అరెస్ట్ చేయకూడదని ఉత్తర్వు ఇచ్చింది.

    1994లో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను గూఢచర్యం కేసులో ఇరికించే కుట్రలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మాజీ పోలీసు అధికారులకు అరెస్ట్‌కు ముందే బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది.

    ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం నేడు తీర్పు చెప్పింది.

    "నేటి నుంచి అయిదు వారాల వరకు విచారణ పేరుతో నిందితులను అరెస్ట్ చేయకూడదు. కానీ, హైకోర్టు ఈ మధ్యంతర రక్షణ మీద ఆధారపడి నిర్ణయం తీసుకోకూడదు" అని సుప్రీం కోర్టు బెంచ్ తీర్పునిచ్చింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈ కేసులో నిందితులు కేరళ మాజీ డీజీపీ సిబీ మాథ్యూస్, పీఎస్ జయప్రకాష్, థంపి ఎస్. దుర్గా దత్, విజయన్, ఆర్‌బీ శ్రీకుమార్. వీరంతా మాజీ ఇంటెలిజెన్స్ లేదా మాజీ సీనియర్ పోలీస్ అధికారులు.

    ఇది "విదేశీ శక్తుల ప్రమేయం ఉన్న పెద్ద కుట్ర" అని, దీనివల్ల దశాబ్దాలుగా క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి ఆగిపోయిందని సీబీఐ చెబుతోంది.

    దర్యాప్తు ప్రారంభంలోనే నిందితులకు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    అయితే, ఇందులో విదేశీ కుట్ర ఉందన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవని చెబుతూ కేరళ హైకోర్టు జయప్రకాశ్, థంపి, విజయన్, శ్రీకుమార్‌లకు ముందస్తు బెయిల్ మజూరు చేసింది.

    ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేసింది.

  17. సుఖవ్యాధులు: లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎన్ని రకాలు, లక్షణాలేంటి, అవి ఎంత ప్రమాదం?

  18. భారత్-పాకిస్తాన్ బోర్డరులో 5 కేజీల హెరాయిన్‌తో దొరికిన హెలికాప్ట డ్రోన్

    హెలికాప్టర్ డ్రోన్

    ఫొటో సోర్స్, DGP Punjab Police/ANI

    తరన్ తరన్ పోలీసులు, బీఎస్ఎఫ్‌తో కలిసి నిర్వహించిన ఒక సెర్చ్ ఆపరేషన్‌లో భారత-పాకిస్తాన్ సరిహద్దుల వద్ద పొలాల్లో ఒక హెలికాప్టర్ డ్రోన్ దొరికిందని పంజాబ్ పోలీస్ డీజీపీ తెలిపినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

    ఆధునిక టెక్నాలజీతో కూడిన ఈ డ్రోన్‌లో 5 కేజీల హెరాయిన్ ప్యాకెట్లు దొరికాయని డీజీపీ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. జేఎన్‌యూ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు.. దర్యాప్తు చేస్తామన్న వీసీ

    జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ

    ఫొటో సోర్స్, WWW.JNU.AC.IN

    గురువారం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లోని పలు చోట్ల గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు రాశారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్-2 భవనం గోడలపై బ్రాహ్మణులు, బనియాలకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు నినాదాలు రాసినట్టు విద్యార్థులు చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ఈ విషయంపై జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దాని కాపీనీ ఏఎన్ఐ ప్రచురించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    "గోడలు, ఫ్యాకల్టీ గదులపై గుర్తు తెలియని వ్యక్తులు నినాదాలు రాయడాన్ని వైస్-ఛాన్సలర్ తీవ్రంగా పరిగణించారు. క్యాంపస్‌లో ఇలాంటి అసాధారణ ప్రవర్తనను అడ్మినిస్ట్రేషన్ ఖండిస్తోంది. ఇలాంటి విభజనలను జేఎన్‌యూ సహించదు. ఈ క్యాంపస్ అందరిదీ. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ & ఫిర్యాదుల కమిటీ డీన్ ఈ అంశంపై దర్యాప్తు జరిపి నివేదికను వీలైనత త్వరగా వీసీకి అందించాలని కోరుతున్నాం" అని ఆ ప్రకటనలో తెలిపారు.

    జేఎన్‌యూ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి హింస జరిగినా సహించేది లేదని వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ డి.పండిట్ మరోసారి స్పష్టం చేశారు.

  20. 'రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి 13,000 మంది వరకు యుక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు'

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన దగ్గర నుంచి 10,000 నుంచి 13,000 మంది వరకు యుక్రెయిన్ సైనికులు మరణించారని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ సలహాదారు మిఖైలో పోడోల్యాక్ తెలిపారు.

    సైనికుల మరణాల గురించి యుక్రెయిన్ సమాచారం అందించడం అరుదు. అయితే, పోడోల్యాక్ ఇచ్చిన సమాచారాన్ని యుక్రెయిన్ మిలటరీ ధృవీకరించలేదు.

    రోజుకు 100 నుంచి 200 యుక్రెయిన్ సైనికులు మరణిస్తున్నారని జూన్‌లో పోడోల్యాక్ వెల్లడించారు.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు లక్ష మంది రష్యన్ సైనికులు, లక్ష మంది యుక్రెయిన్ సైనికులు మరణించారు లేదా గాయపడ్డారని అమెరికాలో అత్యంత సీనియర్ జనరల్ మార్క్ మిల్లీ తెలిపారు.

    మిఖైలో పోడోల్యాక్ యుక్రెయిన్ టీవీ ఛానెల్ 24తో మాట్లాడుతూ, "మరణించిన వారి సంఖ్య గురించి కీయెవ్‌లో బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని" చెప్పారు.

    "మాకు జనరల్ స్టాఫ్ నుంచి, కమాండర్ ఇన్ చీఫ్ (జెలియెన్‌స్కీ) నుంచి అధికారిక గణాంకాలు అందాయి. 10,000 నుంచి 13,000 సైనికులు మరణించారని ఆ గణాంకాలు తెలుపుతున్నాయి" అని చెప్పారు.