కీయెవ్‌పై మిస్సైల్ దాడులు.. యుక్రెయిన్ నగరాల్లో కరెంటు కోతలు

నగరంలోని మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని, ఇతర ప్రదేశాల్లోనూ పేలుళ్లు నమోదయ్యాయని కీయెవ్ మేయర్ ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

    గిడుగు రుద్రరాజు

    ఫొటో సోర్స్, facebook/rudraraju.gidugu

    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు.

    ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ఏపీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు.

    వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలు నియమితులయ్యారు.

    ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్‌గా పళ్లం రాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసి రెడ్డి నియమితులయ్యారు.

    పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఊమెన్ చాందీ, మెయ్యప్పన్, క్రిస్టొఫర్ తిలక్, గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పళ్లం రాజు, చింతామోహన్, సుబ్బరామిరెడ్డి, జేడీశీలం, జీవీ హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి, కొప్పుల రాజు, మస్తాన్ వలి, సిరివెళ్ల ప్రసాద్, ఉషా నాయుడు ఉన్నారు.

  2. అత్త, కోడళ్ల మధ్య గొడవలు ఎందుకొస్తాయి? అత్తింటివారితో ఘర్షణలకు కారణాలేంటి?

  3. కీయెవ్‌పై మిస్సైల్ దాడులు.. యుక్రెయిన్ నగరాల్లో కరెంటు కోతలు

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌పై మళ్లీ దాడులు జరుగుతున్నాయి.

    ఫొటో సోర్స్, Reuters

    రాజధాని కీయెవ్‌ సహా యుక్రెయిన్‌లోని పలు నగరాలు, పట్టణాలపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి.

    దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి.

    పొరుగునే ఉన్న మాల్డోవా దేశంపైన కూడా ఈ ప్రభావం పడింది. అక్కడ కూడా భారీగా కరెంటు కోతలు ఏర్పడ్డాయి.

  4. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌పై మళ్లీ దాడులు

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌పై మళ్లీ దాడులు

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌పై మళ్లీ దాడులు జరుగుతున్నాయి.

    నగరంలోని మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని, ఇతర ప్రదేశాల్లోనూ పేలుళ్లు నమోదయ్యాయని కీయెవ్ మేయర్ ప్రకటించారు.

    నగరంలోని ప్రజలంతా షెల్టర్లలో దాక్కోవాలని సూచించారు.

  5. 28 ఏళ్ల పాటు పురుషుడిగా జీవించి, మహిళగా మారిన ఒక టీచర్ కథ..

  6. విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యల కేసుల్లో నిందితుడిగా ఉన్న జాకిర్ నాయక్‌ను ఖతార్ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఎందుకు ఆహ్వానించింది?

  7. కేరళ: భారత్‌లో తయారు చేసే విదేశీ మద్యం మీద 4శాతం పన్ను పెంపు

    భారత్‌లో తయారు చేసే విదేశీ మద్యం మీద 4శాతం పన్ను పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  8. జీడిపిక్క తొక్కుతో ఆయిల్

    ఒకప్పుడు జీడితొక్కును రోడ్లపై, డంపింగ్ యార్డుల్లో పారేసేవారు. ఇప్పుడు వాటితో ఆయిల్ తీస్తున్నారు.

    శ్రీకాకుళం జిల్లా పలాసలో అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తోంది.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  9. వాల్‌మార్ట్ కాల్పుల్లో మృతులు ఏడుగురే

    అమెరికాలోని వర్జీనియాలో గల వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో సాయుధుడితో సహా ఏడుగురు మాత్రమే మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు.

    ఇంతకు ముందు సుమారు 10 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. ఖతార్‌ ప్రపంచకప్‌లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలివీ...

  11. తమ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు 15 లక్షల మంది విదేశీయులను కెనడా ఎందుకు ఆహ్వానిస్తోంది? అంతమంది అవసరం ఆ దేశానికి ఏంటి?

  12. ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ల ఫ్యాక్టరీలో కార్మికుల నిరసనలు

    కార్మికుల నిరసనలు

    ఫొటో సోర్స్, Social Media

    చైనాలో ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌లో నిరసనలు చెలరేగాయి.

    వందల మంది కార్మికులు ఫ్యాక్టరీలో మార్చ్ చేస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

    ‘మా హక్కులను రక్షించుకుంటాం’ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. కొందరు సీసీ కెమెరాలు, కిటికీలను ధ్వంసం చేశారు.

    తమకు పెట్టే తిండి సరిగ్గా లేదని అలాగే హామీ ఇచ్చినట్లుగా బోనస్ చెల్లించడం లేదని కూడా వారు నిరసన వ్యక్తం చేశారు.

    గత నెలలో కోవిడ్-19 కేసుల వల్ల ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీని లాక్‌డౌన్ చేసింది. దాంతో కొందరు వర్కర్లు కంపెనీ వీడి ఇళ్లకు వెళ్లిపోయారు.

    ఆ తరువాత కొత్త వర్కర్లను కంపెనీ నియమించుకుంది.

  13. PMSBY: రూ. 20తో 2 లక్షల రూపాయల ప్రమాద బీమా

  14. సీఎం జగన్ భద్రతకు వచ్చిన కానిస్టేబుల్ మృతి, శ్రీనివాస్ లక్కోజు, బీబీసీ కోసం

    జగన్ సభ వద్ద అంబులెన్స్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, శ్రీకాకుళంలో నిర్వహించిన సభకు భద్రత కోసం వచ్చిన అప్పారావు అనే కానిస్టేబుల్ మృతి చెందారు.

    ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడంతో అప్పారావుకు అక్కడే ఉన్న 108లో ఆరోగ్యసిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.

    ఆ తరువాత పోలీసు జీపులో సమీంలోని ఆసుపత్రికి కానిస్టేబుల్‌ను తీసుకెళ్లారు. అక్కడే అప్పారావు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు.

    అనకాపల్లి జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా అప్పారావు పని చేస్తున్నారు.

    పోలీసులు, 108 సిబ్బంది మధ్య వాగ్వాదం

    అస్వస్థతకు గురైన అప్పారావును 108 వాహనంలో ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదంటూ ఆరోగ్యసిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు.

    అయితే తమను ఇక్కడే విధులు కేటాయించారు కాబట్టి తాము సభ వద్దే ఉండాలని 108 సిబ్బంది తెలిపారు.

    ఈ విషయంలో పోలీసులు, 108 సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది.

  15. వాల్‌మార్ట్ కాల్పులు: కొలీగ్స్ మీద కాల్పులు జరిపిన మేనేజర్

    వాల్‌మార్ట్ స్టోర్

    ఫొటో సోర్స్, AFP

    వాల్‌మార్ట్ కాల్పుల ఘటనలో మేనేజర్ తన సహ ఉద్యోగుల మీద కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

    ‘నేను బయటకు వచ్చిన వెంటనే మేనేజర్ స్టాఫ్ రూపంలోకి వెళ్లారు. ఆ తరువాత తుపాకీతో కాల్చడం ప్రారంభించారు. మా సహ ఉద్యోగులు కొందరు మరణించడం బాధాకరం’ అంటూ వాల్‌మార్ట్ యూనిఫాం ధరించి ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.

    20 ఏళ్ల తన సోదరుడు డ్యూటీకి వెళ్లిన 10 నిమిషాల్లోనే కాల్పుల్లో చనిపోయినట్లు వేయి-టీవీకి ఒక మహిళ వెల్లడించారు.

  16. డిజీహబ్: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా డీపీలు ఎంతవరకు సేఫ్? మీ ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి

  17. బ్రేకింగ్ న్యూస్, జెరూసలెంలో పేలుళ్లు... ‘ఒకరు మృతి’

    జెరూసలెంలోని రెండు బస్ స్టాప్‌ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

    ఈ ఘటనలో 12 మంది గాయపడినట్లు వార్తా సంస్థ అల్‌జజీరా తెలిపింది. ఒకరు చనిపోయినట్లు ఏఎఫ్‌పీ ట్వీట్ చేసింది.

    ఇజ్రాయెల్ బలగాల చేతిలో 16ఏళ్ల పాలెస్తీనా బాలుడు చనిపోయాడని అక్కడి అధికారులు ఆరోపించిన కొన్ని గంటల తరువాత ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. అమెరికా: వర్జీనియా కాల్పుల్లో 10 మంది మృతి!

    అమెరికాలోని వర్జీనియాలో గల వాల్‌మార్ట్‌ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో సుమారు 10 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

    ‘వాల్‌మార్ట్‌కు చెందిన మేనేజర్ ఒకరు కాల్పులు జరిపారు’ అని వార్తా సంస్థ డెయిలీ మెయిల్ తెలిపింది.

    ఈ ఘటనలో సుమారు 10 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. వి. శివన్‌కుట్టి: ‘లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, ‘బాడీ షేమింగ్‌’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం