దిల్లీ: 'దీపావళి టపాసులకు డబ్బు ఖర్చు చేసే బదులు స్వీట్లు కొనుక్కోండి'-సుప్రీంకోర్టు

దిల్లీలో బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని ఎత్తివేయాలని, గతంలో లాగ గ్రీన్ క్రాకర్లను అనుమతించాలని తివారి తరపు లాయర్ శశాంక్ శేఖర్ ఝా కోర్టును కోరారు.

లైవ్ కవరేజీ

  1. ఆసియా కప్ కోసం భారత్, పాక్‌కు వెళ్లడం గురించి రోజర్ బిన్నీ ఏమన్నారంటే...

    రోజర్ బిన్నీ

    ఫొటో సోర్స్, Getty Images

    వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కు భారత జట్టు వెళ్తుందా? లేదా అనే విషయాన్ని భారత ప్రభుత్వం నిర్ణయిస్తుందని బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ చెప్పారు.

    కర్ణాటక క్రికెట్ సంఘం ఆధ్యర్వంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిన్నీ... వచ్చే ఏడాది భారత జట్టును పాక్‌కు పంపే అంశంపై బీసీసీఐ ఇంకా భారత ప్రభుత్వంతో చర్చించలేదని అన్నారు. అయితే, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

    ‘‘ఇది బీసీసీఐ తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. దేశం నుంచి బయటకు వెళ్లి ఆడటానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లడమే కాదు, విదేశీ జట్లు భారత్‌లో పర్యటించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే’’ అని రోజర్ బిన్నీ చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

    ‘‘మాకు ఆమోదం లభించగానే, ముందుకు సాగుతాం. పాక్ పర్యటన గురించి సొంతంగా నిర్ణయం తీసుకోలేం. దీనిపై ప్రభుత్వంపై ఆధారపడాల్సిందే. కానీ, ఇంకా దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడలేదు’’ అని ఆయన అన్నారు.

    వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.

  2. స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్‌లో చేరిక

  3. గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?

  4. దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష

  5. పాకిస్తాన్‌లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?

  6. నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం

    మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.

    అంతవరకు సెలవు. గుడ్ నైట్.

  7. ఇండోనేషియా: 99 మంది పిల్లలు చనిపోవడంతో దగ్గు మందు సహా అన్ని రకాల సిరప్‌లపై నిషేధం

  8. లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు

  9. ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...

  10. బ్రేకింగ్ న్యూస్, బ్రిటన్: ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా

    లిజ్ ట్రస్

    ఫొటో సోర్స్, ReutersCopyright

    ఫొటో క్యాప్షన్, లిజ్ ట్రస్

    లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

    కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కింగ్ చార్లెస్‌తో చెప్పానని ఆమె తెలిపారు.

    బ్రిటన్‌లో "గొప్ప ఆర్థిక, అంతర్జాతీయ అస్థిరత" నెలకొని ఉన్నప్పుడు తాను ప్రధానమంత్రి పదవిలోకి వచ్చానని, తనను ఏ ప్రాతిపదికపై టోరీ సభ్యులు ఎన్నుకున్నారో దాన్ని నెరవేర్చలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని ఆమె వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈరోజు 1922 కమిటీ ఛైర్మన్ సర్ గ్రాహం బ్రాడీని కలిశానని లిజ్ ట్రస్ తెలిపారు.

    వారం రోజుల్లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని, కొత్త నాయకుడిని ఎన్నుకునేవరకు తానే ప్రధాని పదవిలో కొనసాగుతానని ఆమె వెల్లడించారు.

  11. దిల్లీ: 'దీపావళి టపాసులకు డబ్బు ఖర్చు చేసే బదులు స్వీట్లు కొనుక్కోండి' - సుప్రీంకోర్టు

    దీపావళి టపాసులు

    ఫొటో సోర్స్, Getty Images

    సుచిత్ర కే మొహంతి

    బీబీసీ కోసం

    దిల్లీలో దీపావళి టపాసులపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ బీజేపీ నేత మనోజ్ తివారీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే, దీపావళి టపాసులపై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించింది.

    "ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోనివ్వండి, టపాసులకు డబ్బు ఖర్చు చేసే బదులు స్వీట్లు కొనుక్కోండి" అంటూ జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

    దిల్లీలో బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని ఎత్తివేయాలని, గతంలో లాగ గ్రీన్ క్రాకర్లను అనుమతించాలని తివారి తరపు లాయర్ శశాంక్ శేఖర్ ఝా కోర్టును కోరారు. దిల్లీలో కాలుష్యం కోతల తరువాత పంటను తగలెబెట్టడం సహా ఇతర కారణాల వలన పెరిగిపోతోందని శశాంక్ ఝా వాదించారు.

    అయితే షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు నిరాకరించింది. తరువాత విచారణ జరుపుతామని కోర్టు చెప్పింది.

    టపాసుల అమ్మకం

    పండుగ కాలంలో పేల్చడానికి అనుమతి ఉన్న టపాసుల అమ్మకం, కొనుగోళ్లపై ఆమ్ ఆద్మీ పార్టీ తాజా మార్గదర్శాకాలను విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించాలని మనోజ్ తివారీ కోరారు. అలాగే, సాధారణ ప్రజలు వీటిని అమ్మినా, కొన్నా వాళ్లపై కేసులు వేయకుండా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా తివారీ కోరారు.

    "జీవించే హక్కు పేరిట మత స్వేచ్ఛను హరించలేరు. 2021 అక్టోబర్ 29న ఈ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మాదిరి వీటి మధ్య ఒక సమతుల్యాన్ని సాధించాలి" అని తివారీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    2021లో టపాసులపై పూర్తి నిషేధం లేదని, బేరియం సాల్ట్ ఉపయోగించిన టపాకాయలను మాత్రమే నిషేధించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించకుండా రాష్ట్రప్రభుత్వాలు పూర్తి నిషేధాన్ని పాటించాయని, పండుగ సంబరాలు జరుపుకోవడానికి సరైన ఏర్పాట్లు చేయకుండా కేసులు నమోదు చేసి, కర్ఫ్యూలు విధించాయని తివారీ, తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    2021లో దిల్లీ ప్రభుత్వం సాధారణ ప్రజలపై 210 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. టపాసులు కాలుస్తున్న 143 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 2021 సెప్టెంబర్ 28, నవంబర్ 4 మధ్య టపాసులు అమ్మినవారిపై 125 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. 138 మందిని అరెస్ట్ చేశారు.

    ఈ ఏడాది దిల్లీలోని ఆప్ ప్రభ్యుత్వం సెప్టెంబర్ 7న దీపావళి టపాసులపై నిషేధం విధించింది. రాజధానిలో ఈ నిషేధం 2023 జనవరి 1 వరకు కొనసాగుతుంది.

  12. ఒత్తిడిలో పుతిన్.. యుక్రెయిన్ 4 ప్రాంతాల్లో మార్షల్ లా.. రష్యా అంతటా భద్రత ఆంక్షలు

  13. ఇండోనేసియా మసీదులో అగ్నిప్రమాదం

    ఇండోనేసియా రాజధాని జకార్తాలోని అతి పెద్ద మసీదు గుమ్మటం భారీ అగ్నిప్రమాదం కారణంగా కూలిపోయింది.

    ఇండోనేసియా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

    జకార్తా ఇస్లామిక్ సెంటర్ ప్రాంగణంలో ఈ మసీదు ఉంది.

    మసీదు పైభాగంపై మంటలు చెలరేగిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.

  14. మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే వ్యవస్థ ఏం కావాలి? ఇలాంటివాళ్లా మన నాయకులు: జగన్

    వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    అవనిగడ్డలో నిర్వహించిన సభలో మూడు పెళ్లిళ్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

    "కొందరు చెప్పులు చూపించి బూతులు మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబుతుంటే మూడు పెళ్లిళ్ల వల్లే మేలు కలుగుతుందని అంటున్నారు" అన్నారు జగన్.

    "ప్రతిఒక్కరూ నాలుగైదేళ్లు కాపురం చేసి విడాకులు ఇచ్చేసి, మళ్లీ పెళ్లి చేసుకోవడం మొదలుపెడితే..ఒకసారి కాదు రెండు సార్లు కాదు, మూడు సార్లు, నాలుగు సార్లు చేసుకోవడం మొదలెడితే, మీరు చేసుకోండి అని చెప్పుకుంటూ పోతే ఇక వ్యవస్థ ఏమి బతుకుతుంది..ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏమి కావాలి. ఇలాంటి వాళ్లా మనకు నాయకులు? అని ఒకసారి ఆలోచించండి" అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

    ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మూడు పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో తన మీద ప్రత్యర్థులు చేసిన విమర్శలకు సమాధానంగా ‘మీరూ చేసుకోండి’ అంటూ పవన్ స్పందించారు.

    దానికి కౌంటర్‌గా ఇప్పుడు సీఎం స్పందించినట్టు కనిపిస్తోంది.

    గతంలో కూడా వైఎస్ జగన్ తన పాదయాత్రలో మూడు పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావించారు.

    కారు టైరు మారుస్తున్నట్టుగా పెళ్లాలను మార్చేస్తున్నారంటూ విమర్శించారు.

    22 ఏ (1) కింద నిషేధిత భూముల సమస్యకు పరిష్కారంగా రైతులకు క్లియరెన్స్ పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

    ఆ సందర్భంగా అవనిగడ్డలో సభ నిర్వహించారు. ఆ సభా వేదిక నుంచి సీఎం విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.

    ముఖ్యంగా పవన్ కల్యాణ్ మీద సీఎం పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయమవుతున్నాయి.

  15. అస్సాం టీ తోటలపై వాతావరణ మార్పుల ప్రభావం.. తేయాకు తోటలు కనుమరుగవుతాయా?

  16. క్యాసినోల్లోని పేకాట మెషీన్లను హ్యాక్ చేసి, కోట్లు కొట్టేస్తున్న గ్యాంబ్లింగ్ ముఠా.. ఆట కట్టించిన గణిత మేధావి

  17. టీడీపీ, బీజేపీ పొత్తు ఉండదు: సోము వీర్రాజు

    సోము వీర్రాజు

    ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ కలిసి ముందుకెళతాయని ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

    పవన్ కళ్యాణ్ రోడ్డు మ్యాప్ అడిగారని దానిని తమ అధిష్ఠానం అందిస్తుందని తెలిపారు.

    పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమావేశం, ఉమ్మడి ప్రెస్ మీట్ తర్వాత సోము వీర్రాజు హుటాహటీన దిల్లీ వెళ్లారు.

    రాష్ట్రంలో పరిణామాలను బీజేపీ పెద్దలకు నివేదించారు. తిరిగి విజయవాడ చేరుకున్న ఆయన ఎయిర్ పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు.

    జనసేన తమ మిత్రపక్షం అంటూ వీర్రాజు స్పష్టం చేశారు.

    చంద్రబాబుతో పవన్ భేటీని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు.

    వారి భేటీతో మీడియాలోనే కంగారు కనిపిస్తోందన్నారు.

    పవన్ కి కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు.

    ఏపీ పరిణామాలన్నీ పార్టీ పెద్దలకు వివరించామని, ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని అన్నారు.

    కన్నా లక్ష్మీ నారాయణ కామెంట్స్‌పై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

    కన్నా తమ పార్టీ లో చాలా పెద్ద నాయకులని, ఆయనేదో అంటే తాను స్పందించాల్సిన అవసరం లేదని సోము తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంత వరకూ మాట్లాడాలో అంతే మాట్లాడుతానని అన్నారు.

    కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా జగన్ ప్రభుత్వం ప్రకటించుకుంటోందని వీర్రాజు ఆరోపించారు.

    అమరావతి పాదయాత్రపై వైఎస్సార్సీపీ నేతల దాడిని ఖండించారు. పవన్ యాత్రపై నిర్బంధాన్ని బీజేపీ నిరసిస్తోందని తెలిపారు.

    జనసేనతో పొత్తు కొనసాగుతుందని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ కూడా స్పష్టం చేశారు.

    టీడీపీ, వైఎస్సార్సీపీలు నాగరాజు, సర్పరాజు వంటివని పోల్చారు.

    రెండూ దొంగల పార్టీలని విమర్శించారు. టీడీపీతో తమకు భవిష్యత్తులో కూడా పొత్తు ఉండదన్నారు.

    రాష్ట్రంలో గూండాయిజంపై పోరాడుతామన్నారు.

    రోడ్ మ్యాప్ విషయంలో గందరగోళం లేదని, విశాఖ ఘటనపై చాలామంది బీజేపీ నేతలు స్పందించారని అన్నారు. పవన్ కళ్యాణ్‌ తో కూడా తాము మాట్లాడినట్టు ఆయన తెలిపారు.

  18. రష్యాను యుక్రెయిన్ ఎదుర్కొంటున్నట్లు చైనాపై పోరాడగల శక్తి, సామర్థ్యాలు తైవాన్‌కు ఉన్నాయా?

  19. ఫోన్లు, పవర్ బ్యాంకులు, టార్చ్‌లు అన్నీ చార్జ్ చేసుకోండి: యుక్రెయిన్ ఇంధన సంస్థ, రష్యా మిసైల్ దాడుల నేపథ్యంలో హెచ్చరికలు

    ukraine power cuts

    ఫొటో సోర్స్, afp

    ఇళ్లలో ఉండే అన్ని విద్యుత్ పరికరాలను చార్జ్ చేసుకోవాలని యుక్రెయిన్ జాతీయ ఇంధన సంస్థ తన దేశ ప్రజలను కోరింది.

    రష్యా క్షిపణి దాడులు తీవ్రతరం చేస్తుండడంతో విద్యుత్ అందుబాటులో ఉండకపోవచ్చని, కాబట్టి ప్రజలు ముందే జాగ్రత్త పడాలని సూచించింది.

    బుధవారం వివిధ విద్యుత్ ప్లాంట్లపై రష్యా క్షిపణి దాడులు చేసింది.

    గంటలకొద్దీ విద్యుత్ లేకపోవడం వల్ల గురువారం దేశవ్యాప్తంగా ఇబ్బంది కలగొచ్చని గ్రిడ్ ఆపరేటర్ యుక్రెనెర్జో తెలిపింది.

    ఫోన్లు, పవర్ బ్యాంకులు, టార్చ్‌లు, బ్యాటరీలు చార్జ్ చేసుకోవాలని సూచించింది.

    నీరు కూడా నిల్వ చేసుకోవాలని సూచించింది.

    కాగా యుక్రెయిన్‌లో 30 శాతం విద్యుత్కేంద్రాలు ఇప్పటికే రష్యా దాడుల కారణంగా దెబ్బతిన్నాయని ఇంతకుముందు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.

  20. యుక్రెయిన్ యుద్ధం: ఖేర్సన్ నుంచి వెళ్లిపోతున్న రష్యా ప్రజలు

    Kherson

    ఫొటో సోర్స్, ROSSIYA 24

    దక్షిణ యుక్రెయిన్ నగరం ఖేర్సన్ నుంచి రష్యా అధికారులు, రష్యా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారు.

    వేలమంది రష్యా ప్రజలు ఖేర్సన్ నగరాన్నివీడి వెళ్తున్నారు.

    ఖేర్సన్‌ను రష్యా చుట్టుముడుతున్న నేపథ్యంలో దాదాపు 60 వేల మంది రష్యన్లు అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నారు.

    మరోవైపు ఖేర్సన్ సహా నాలుగు యుక్రెయిన్ భూభాగాలలో మార్షల్ లా విధించడానికి వీలుగా జారీ చేసిన డిక్రీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు.

    భారీ ఎత్తున షెల్లింగ్ జరగనున్న నేపథ్యంలో నగరాన్ని వీడి వెళ్లాల్సిందిగా కోరుతూ యుక్రెయిన్అధికారుల నుంచి ఖేర్సన్ ప్రజలకు మంగళవారం రాత్రి మెసేజ్‌లు వచ్చాయి.