ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రి వైద్యులు ఐసీయూకి తరలించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
తమ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది.
ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో ఆయనకు డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నాయకుడు రాకేశ్ యాదవ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రి వైద్యులు ఐసీయూకి తరలించారు.
82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ గత కొన్ని రోజులుగా మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏఎన్ఐ వార్తా సంస్థ వివరాల ప్రకారం.. తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ లక్నో నుంచి దిల్లీ బయలుదేరారు.
ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మొయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.
ఈ ఏడాది జులైలో ములాయం భార్య సాధనా గుప్తా మరణించారు.
రాజ్ కోట్లో శనివారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైకి ప్లాస్టిక్ సీసాను విసిరారు.
అయితే, ఆ సీసా ఆయనకు తగలకుండా తప్పించుకున్నారు.
ఆయన నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లారు.
సీసా విసిరే సమయంలో ఆయన డాండియా నృత్యకారులతో సమావేశమయ్యారు.
అరవింద్ కేజ్రీవాల్ తో ఆప్ సీనియర్ నాయకులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.
ఈ విషయం పై ఆప్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుజరాత్లో ఈ ఏడాది చివర్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్లోని వడోదరలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు పలు దేశాల రాయబార కార్యాలయ అధికారులు కూడా హాజరయ్యారు.
గుజరాత్లో ప్రజలు సంతోషంగా ఎందుకున్నారో గర్బా నృత్యం చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాంతం అయిస్కాంతంలా ఆకర్షించడానికి మోదీ చేసిన మాయాజాలం కూడా ఉంది" అని భారత్ లో ఫిజీ రిపబ్లిక్ హై కమీషనర్ కమలేష్ ప్రకాష్ అన్నారు.
రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ కూడా ఈ ఉత్సవాలు చాలా మనోహరంగా ఉన్నాయని అన్నారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అఫ్గానిస్తాన్ రాయబారి ఫరీద్ మాముంద్ జే కూడా గుజరాతీలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
టాంజానియాలో నివసించే చాలా మంది భారతీయులు గుజరాత్ నుంచి వచ్చినవారే. ఇరు దేశాలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇది నాకొక ప్రత్యేక క్షణం" అని టాంజానియా హై కమిషనర్ అనీసా కే ఎమ్. బేగా అన్నారు.
భారతదేశంలో ఎవరినీ అణగదొక్కిన చరిత్ర లేదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఈ మాటలన్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న జాతీయతావాదం, అహ్మదాబాద్ లో మహాత్మా గాంధీ అనుసరించిన జాతీయవాదం గురించి ప్రశ్నించినప్పుడు, "ప్రపంచంలో శాంతి స్థాపన కోసం పాత్ర పోషించాలనుకుంటే, ముందు మనం శక్తివంతంగా ఉండాలి. దేశంలో ఐక్యత పెంచేందుకు జాతీయవాదం కీలక పాత్ర పోషిస్తుంది" అని అన్నారు.
ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని పీ ఎఫ్ ఐ చేస్తున్న డిమాండ్ గురించి మాట్లాడుతూ, "జరిగింది మర్చిపోయి ముందుకు కదిలి మనల్ని మనం కొత్తగా సృష్టించుకోవడం మొదలుపెడితే, మన పొరుగు దేశం దేశ విభజనలో పూర్తి కాని ఎజెండా పేరుతో కశ్మీర్ కు తీవ్రవాదులను పంపిస్తుంది. దీంతో పోరాడేందుకు మనం సంసిద్ధులం కావాలి" అని అన్నారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిహార్ లోని పశ్చిమ చంపారన్ లోని భీతిహర్వా ఆశ్రమ్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు.
ఇది గాంధీ ఆశ్రమంగా ప్రజలకు పరిచయం.
ప్రశాంత్ కిశోర్ యాత్రకు జన్ సురాజ్ యాత్ర అని పేరు పెట్టారు.
ఈ యాత్ర ద్వారా ఆయన బిహార్ లోని వివిధ పట్టణాలు, నగరాల్లో ప్రజలను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆయన పాదయాత్ర 3500 కిలోమీటర్లు సాగుతుంది.
పేద, వెనుకబడిన రాష్ట్రంలో విధానాలను మార్చాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, నిరుద్యోగం వల్ల దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు.
ప్రధాని మోదీ రాజ్ ఘాట్ లో ఉన్న మహాత్మా గాంధీ సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు.
ఆయనకు నివాళులు అర్పిస్తూ, "భారత్ ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ ఏడాది గాంధీ జయంతి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. బాపు ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలి. గాంధీ గౌరవార్ధం మీరంతా ఖాదీ, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను" అని మోదీ అన్నారు.
తర్వాత మోదీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా నివాళులు అర్పించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని దేశ ప్రజలందరి తరుపున నేను జాతిపితకు నివాళులు అర్పిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖార్గే కూడా రాజ్ ఘాట్ దగ్గర మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
అంతర్జాతీయ అహింసా దినాన్ని పురస్కరించుకుని, ప్రపంచంలో ప్రజలందరూ శాంతిని, హుందాతనాన్ని కాపాడాలని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రెటరీ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు.
"అంతర్జాతీయ అహింసా దినం నాడు, మహాత్మా గాంధీ జయంతితో పాటు, ఆయన పాటించిన శాంతి, గౌరవం, హుందాతనాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మెరుగైన భవిష్యత్తు కోసం ఈ విలువలను పాటిస్తూ ప్రపంచం ఎదుర్కొంటున్నసవాళ్ళను అధిగమించవచ్చ" అని ఆయన ట్వీట్ చేసారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.