'రష్యా మీద ఆంక్షలు విధించిన దేశాలే ఎక్కువ నష్టపోతాయి' - అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యా మీద ఆంక్షలు విధించిన దేశాలకే ఎక్కువ హాని జరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.

లైవ్ కవరేజీ

  1. వరద బాధిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

    అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్

    ఫొటో సోర్స్, @TelanganaCMO

    ఫొటో క్యాప్షన్, అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్
    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం పర్యటన ఆలస్యంగా సాగుతోంది. ముందుగా అనుకున్నట్టుగా హెలికాప్టర్ లో కాకుండా రోడ్డు మార్గంలో బస్సులో కేసీఆర్ ప్రయాణిస్తున్నారు.

    రాత్రి వరంగల్‌లో బస చేసిన కేసీఆర్ ఉదయాన్నే హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుని, ఆ తరువాత అదే హెలికాప్టర్లో ఏటూరు నాగారం వెళ్లాల్సి ఉంది. అయితే వర్షం కురుస్తూండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణంతో పాటూ, భద్రాచలంలో చేయాల్సిన ఏరియల్ సర్వేను కూడా రద్దు చేశారు అధికారులు.

    వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో ఏటూరు నాగారం, ములుగుల్లో పర్యటిస్తూ అక్కడి వరద ప్రభావాన్ని తెలుసుకుంటున్నారు. అక్కడి నుంచి భద్రాచలం వైపు వస్తారు. భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరిని సందర్శిస్తారు.

  2. వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం

  3. ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్‌నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్

  4. వరద తగ్గుతున్నా, ఇంకా భయం భయం... ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి?

  5. జైలులో ముస్లింలను కొడుతున్న వీడియోను షేర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే- బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి

  6. నేటి ముఖ్యాంశాలు

    • ‘అగ్నిపథ్’ పథకంలో భాగంగా చేపట్టే సైనిక నియామకాలకు పోటీ పడే అభ్యర్థుల వయసు పరిమితిని ఈ ఏడాది 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు.
    • అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సృష్టించిన విధ్వంసంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్‌లో జరిగిన ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
    • వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌ను తమకు అప్పగించాలన్న అమెరికా అభ్యర్థనకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. ఈమేరకు బ్రిటన్ హోంశాఖ మంత్రి ప్రీతి పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
    • రష్యా మీద ఆంక్షలు విధించిన దేశాలకే ఎక్కువ హాని జరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.
    • రష్యా కడిగిన ముత్యమేమీ కాదని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి సెర్జీ లావ్రోవ్ అన్నారు. బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజన్‌బర్గ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాము యుక్రెయిన్ మీద దండయాత్రకు దిగలేదని దాన్ని ‘డీనాజిఫై’ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్‌కు సంబంధించిన లైవ్ పేజీ అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.

  7. 'రష్యా మీద ఆంక్షలు విధించిన దేశాలకే ఎక్కువ నష్టం' - వ్లాదిమిర్ పుతిన్

    పుతిన్

    ఫొటో సోర్స్, Reuters

    రష్యా మీద ఆంక్షలు విధించిన దేశాలకే ఎక్కువ హాని జరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.

    ప్రపంచంలో బలమైన శక్తులుగా ఎదిగిన దేశాలు ఇంకా వేరే ఉన్నాయన్న సంగతిని అమెరికా కావాలనే గుర్తించనట్లుగా నటిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాలు ఇంకా గతించిన శతాబ్దంలో ఉన్నట్లే ఆలోచిస్తున్నాయి, ఇతర దేశాలను ఇంకా తమ వలస పాలనలో ఉన్నట్లు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు.

    ఎకనామిక్ పోరమ్‌లో పుతిన్ ప్రసంగం కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశ స్థలంలోని సాంకేతిక వ్యవస్థలు సైబర్ దాడికి గురవడం వల్లే ఈ జాప్యం చోటు చేసుకుంది. అతిథులకు గుర్తింపు, ప్రవేశ అనుమతి ఇచ్చే సాంకేతిక వ్యవస్థ దాడికి గురి కావడంతో తీవ్రమైన సమస్యలు తలెత్తాయని, నిపుణులు ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నారని అంతకు ముందు రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

    ఈ సదస్సులో పుతిన్ అమెరికా తదితర పశ్చిమ దేశాలను తీవ్రంగా విమర్శించారు. యుక్రెయిన్ మీద దాడి చేసినందుకు రష్యాపై ఆంక్షలు విధించడం ‘ఆలోచన లేని పిచ్చి పని’ ఆయన అన్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బ తీయాలనే ప్రయత్నాలలో పశ్చిమ దేశాలు దారుణంగా విఫలమయ్యాయని పుతిన్ అన్నారు.

    యూరోపియన్ యూనియన్ దేశాల్లో ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని, అది అసమానతలకు దారి తీస్తోందని చెప్పిన పుతిన్, అందుకు కారణం ఆ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడమేనన్నారు.

    ఈ సందర్భంగా పుతిన్ పెట్టుబడిదారులకు స్వాగతం పలికారు. ‘రష్యా మీకు సురక్షితమైన సొంత ఇల్లు లాంటిది. రండి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి’ అని ఆయన వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.

  8. 5G సేవలు మన దేశంలో ఎందుకింత ఆలస్యం?

  9. ఆంధ్రప్రదేశ్‌‌: వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా... ఎందుకీ ప్రచారం సాగుతోంది?

  10. అగ్నిపథ్ నిరసనలు: ఒకవైపు యువత ఆందోళనలు.. మరోవైపు కేంద్ర మంత్రులు, ప్రముఖుల ప్రశంసలు

  11. K-pop supergroup BTS: ఆరంభం నుంచి విరామం దాకా బీటీఎస్ సూపర్ గ్రూప్ ప్రస్థానం

  12. బ్రేకింగ్ న్యూస్, జూలియన్ అసాంజ్‌ను అమెరికాకు అప్పగించేందుకు అనుమతిచ్చిన బ్రిటన్

    వీకీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్

    ఫొటో సోర్స్, Reuters

    వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌ను తమకు అప్పగించాలన్న అమెరికా అభ్యర్థనకు బ్రిటన్ ఆమోదం తెలిపింది.

    ఈమేరకు బ్రిటన్ హోంశాఖ మంత్రి ప్రీతి పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    ఈ నిర్ణయంపై 14 రోజుల్లోపు బ్రిటన్‌ కోర్టుల్లో అప్పీలు చేసుకునేందుకు జూలియన్ అసాంజ్‌కు అవకాశం ఇచ్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    దీనిపై వికీలీక్స్ స్పందించింది. బ్రిటన్‌లో ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు ఇది చీకటి రోజు అని వికీలీక్స్ ట్వీట్ చేసింది. వికీలీక్స్ ట్వీట్ ప్రకారం అమెరికాలో అసాంజ్ 175 సంవత్సరాల శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    ‘‘జూలియన్ అసాంజ్ స్వేచ్ఛా పోరాటం సుదీర్ఘమైనది, కఠినమైనది. ఇక్కడితో పోరాటం ముగిసిపోదు. ఇది ఒక కొత్త న్యాయపోరాటానికి ఆరంభం మాత్రమే. చట్ట ప్రకారం మేం ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మేమంతా ఏకమై గట్టిగా పోరాడతాం. జూలియన్ కథను అందరికీ తెలియజేస్తాం’’ అని వికీలీక్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    2010, 2011లలో లీక్ చేసిన అధికారిక పత్రాలకు సంబంధించి అసాంజ్‌ను అదుపులో తీసుకోవాలని అమెరికా చాలా కాలంగా అనుకుంటోంది.

    ప్రస్తుతం ఆయన లండన్ జైలులో ఉన్నారు. దీనికంటే ముందు ఈక్వెడార్ ఎంబసీలో ఏడేళ్లు గడిపారు.

  13. అగ్నిపథ్: సికింద్రాబాద్ విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర-కిషన్ రెడ్డి

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    ఫొటో సోర్స్, Facebook/Kishan Reddy Gangapuram

    అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సృష్టించిన విధ్వంసంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

    సికింద్రాబాద్‌లో జరిగిన ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

    నిరసనకారులు స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆయన విమర్శించారు.

    ‘ఒక పథకం ప్రకారం సంఘటితమై రైల్వే స్టేషన్‌కు నిరసనకారులు వచ్చారు. ప్రయాణికులకు చెందిన 40 మోటార్ సైకిళ్లు కాల్చారు. షాపులు లూటీ చేశారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.’ అని ఆయన వెల్లడించారు.

    హింసను ఆపాల్సిన మంత్రులు ట్విటర్ ద్వారా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

    కేంద్ర ప్రభుత్వ ఆస్తుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

    సమస్య ఉంటే చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందరూ సంయమనంతో ఉండాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

  14. సికింద్రాబాద్: ‘ప్రయాణికుల భద్రత కోసం తాత్కాలికంగా రైళ్ల నిలిపివేత’

    అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల వల్ల సికింద్రాబాద్ స్టేషన్‌కు జరిగిన నష్టంపై ఎస్‌సీఆర్ డివిజ్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా తెలిపారు.

    1-5 రైలు ఇంజిన్లకు, రెండు మూడు రైల్వే కోచ్‌లకు నిప్పు పెట్టారని ఆయన వెల్లడించారు.

    ఈ నిరసనల్లో ఒక వ్యక్తి గాయపడ్డారనే సమాచారం తమకు అందిందని గుప్తా చెప్పుకొచ్చారు.

    ప్రయాణికుల భద్రత కోసం తాత్కాలికంగా రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. సికింద్రాబాద్ స్టేషన్‌లో ‘అగ్నిపథ్’ విధ్వంసం.. రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు

  16. రెండు రోజుల్లో అగ్నిపథ్ నోటిఫికేషన్

    భారత యుద్ధ విమానం

    ఫొటో సోర్స్, Facebook/Indian Air Force

    రెండు రోజుల్లో అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు.

    joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వివరాలను ఉంచుతామని వెల్లడించారు.

    ఈ ఏడాది డిసెంబరులో తొలి బ్యాచ్ అగ్నివీరులకు శిక్షణ మొదలవుతుందని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ జనరల్ మనోజ్ పాండే వివరించారు.

    వచ్చే ఏడాది అంటే 2023 మధ్యలో వారు సైన్యంలో చేరతారు.

    ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలు ఈ నెల 24 నుంచి మొదలవుతాయని ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు.

    అగ్నిపథ్ పథకం గురించి పూర్తి సమాచారం లేక పోవడం వల్లే యువత ఆందోళనలు చేస్తున్నట్లుగా తాను భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ మెట్రో రైలు నిలిపివేత

    హైదరాబాద్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్లు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది.

    ప్రయాణాలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. అగ్నిపథ్ నిరసనలు... బిహార్‌లో హింసాత్మకం

    బిహార్ రైల్వే స్టేషన్ లో నిరసనలు

    ఫొటో సోర్స్, ANI

    అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు బిహార్‌లో హింసాత్మకంగా మారాయి.

    బిహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి రేణు దేవి, బిహార్ బీజేపీ ప్రెసిడెంట్ సంజయ్ జైశ్వాల్ ఇళ్ల మీద ఆందోళనకారులు దాడులు చేశారు.

    ఈరోజు కూడా రైల్వే పట్టాలను బ్లాక్ చేయడంతోపాటు రైళ్లకు నిప్పు అంటించారు. బిహార్‌తోపాటు తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, హరియాణలలో నిరసనలు చెలరేగుతున్నాయి.

    ఆందోళనల నేపథ్యంలో హరియాణ ముందుగానే ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది.

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖండించారు. ఆ పథకాని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. అగ్నిపథ్ నిరసనలు... అప్రమత్తమైన వాల్తేరు డివిజన్, శ్రీనివాస్ లక్కోజు

    విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల పహారా

    ఫొటో సోర్స్, UGC

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అందోళనల నేపధ్యంలో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తమైంది.

    వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న అన్నీ రైల్వే స్టేషన్లు, కంట్రోల్ రూమ్స్ లోని భద్రతను పటిష్టం చేసినట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎం అనుప్ సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు.

    ఉద్యోగులందర్ని కూడా అప్రమత్తం చేశారు. స్టేషన్, ఆ సమీపంలోని ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే అప్రమత్తమవవ్వాలని స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించే సీఆర్ఫీఎప్, రైల్వే పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.

    అలాగే శాంతిభద్రతల పరిస్థితిపై నిఘా ఉంచడం కోసం ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిపాలన విభాగం అధికారులతో చర్చిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

    శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయాణికులు, విద్యార్థులు, యువకులు ఎటువంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడవద్దంటూ రైల్వే స్టేషన్లల్లో మైక్ ల ద్వారా ప్రకటనలు ఇస్తున్నారు.

    విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల పహారా

    ఫొటో సోర్స్, UGC

  20. సికింద్రాబాద్ అగ్నిపథ్ నిరసనలు... ఎంఎంటీఎస్ నిలిపివేత

    భారతీయ రైల్వే

    ఫొటో సోర్స్, Facebook/SCR

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో అనేక రైల్వే సర్వీసులను సౌంత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది.

    హైదరాబాద్‌లో నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులను పూర్తిగా నిలిపి వేశారు.

    అలాగే హైదరాబాద్-షాలిమార్, ఉమ్దానగర్-సికింద్రాబాద్ సర్వీసులను రద్దు చేశారు.

    సికింద్రాబాద్-రేపల్లే ప్యాసింజర్ ట్రైన్‌ చెర్లపల్లి నుంచి మొదలవుతుంది.

    హౌరా-సికింద్రాబాద్(12703), సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్(17234) సర్వీసులు మౌలాలీ వరకే వస్తాయి.

    షిరిడి సాయి నగర్-కాకినాడ పోర్ట్ రైలును సనత్‌నగర్, అమ్ముగూడ, చెర్లపల్లి వైపుకు మళ్లించారు.

    ఈస్ట్ సెంట్రల్ రైల్వే డివిజన్‌ పరిధిలో 18 రైలు సర్వీసుల మీద అగ్నిపథ్ నిరసనల ప్రభావం పడింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది