నరేంద్ర మోదీ: ‘భారత్‌లో పెట్టుబడులు పెట్టకపోతే.. అవకాశాన్ని చేజార్చుకున్నట్లే’

"భారతదేశంలో అమలు చేసిన సంస్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను చూస్తే.. ఇక్కడ పెట్టుబడులు పెట్టలేని వారంతా అవకాశాన్ని కోల్పోయినట్లే" అని కోపెన్‌హాగెన్ ఇండియా -డెన్మార్క్ బిజినెస్ ఫారంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. నేటి ముఖ్యాంశాలు

    భారతదేశంలో అమలు చేసిన సంస్కరణలను చూస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టలేని వారంతా అవకాశాన్ని కోల్పోయినట్లే" అని కోపెన్‌హాగెన్ ఇండియా -డెన్మార్క్ బిజినెస్ ఫారంలో ప్రధాని మోదీ అన్నారు.

    సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 12 -17 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఇచ్చే కరోనా వ్యాక్సీన్ కోవోవేక్స్ ధరను రూ. 900 నుంచి రూ. 225కి తగ్గించింది.

    భారతదేశంలో 2020లో మొత్తం 81.2 లక్షల మరణాలు చోటు చేసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. 2020లో కరోనా కారణంగా 1.48 లక్షల మంది మరణించగా, 2021లో 3.32 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈద్ శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు బాలీవుడ్ నటులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.

    యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించి మాట్లడటానికి తాను రష్యా వస్తానని సందేశం పంపినప్పటికీ ఆ దేశం నుంచి జవాబు రాలేదని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.

    రంజాన్ ప్రార్థనల సందర్భంగా కాకినాడలో శ్రీ భోగి గణపతి పీఠం నిర్వాహకులు ఈద్గా వద్ద ప్రార్థనలకు హాజరయ్యారు. ముస్లింలకు మజ్జిగ పంపిణీ చేశారు.

    రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనకు దిగారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు.

    అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్ చేయించుకునే హక్కును కొట్టివేస్తుందనే వార్తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. అబార్షన్‌ చేయించుకునే హక్కును రాజ్యాంగం ఇస్తోందంటూ 1973లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

    అబార్షన్ కోసం వేరే ప్రాంతాలకు ప్రయాణించే ఉద్యోగులకు ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కింద ప్రతి ఏడాది 4 వేల డాలర్ల వరకు అంటే సుమారు రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

    పర్యావరణ మార్పులపై పోరాటానికి భారత్‌కు రూ.78 వేల కోట్లు సాయం అందిస్తామని జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ ప్రకటించారు.

    కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ వ్యక్తులను బలవంతం చేసే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు ప్రకటించింది.

    ఈ ఏడాది మార్చిలో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. అమెరికాకు చెందిన అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తొలి స్థానంలో ఉంది.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. భారతదేశంలో 2020లో కరోనా బారిన పడి 1.48 లక్షల మరణాలు - రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా

    భారతదేశంలో 2020లో కరోనా బారిన పడిమొత్తం 1.48లక్షల మంది మరణం - రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా

    ఫొటో సోర్స్, Getty Images

    భారతదేశంలో 2020లో మొత్తం 81.2 లక్షల మరణాలు చోటు చేసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది. ఇది 2019లో చోటు చేసుకున్న మరణాలతో పోలిస్తే 6.2 శాతం ఎక్కువ. 2019లో 76.4 లక్షల మంది మరణించారు.

    2020లో కరోనా కారణంగా 1.48 లక్షల మంది మరణించగా, 2021లో 3.32 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

    2020 ప్రారంభంలో దేశంలో 5,23, 889 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

    2019 నుండి 2020 మధ్యలో మహారాష్ట్ర, బిహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, హర్యానా రాష్ట్రాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

    2019తో పోలిస్తే 2020 సంవత్సరంలో నమోదైన జననాల్లో కూడా 2.4 శాతం తగ్గుదల ఉంది. 2019లో పుట్టిన వారి సంఖ్య 2 కోట్ల 48 లక్షలు కాగా, 2020 నాటికి 2 కోట్ల 42 లక్షలకు తగ్గింది.

  3. రంజాన్: ముస్లింలకు మజ్జిగ పంపిణీ చేసిన హిందువులు..

  4. నిండు గర్భిణి.. తాగు నీటి కోసం రోజూ ఎత్తైన కొండ దిగి, ఎక్కుతోంది..

  5. “భారత్‌లో పౌరుల కరవు తీరితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరవు కూడా తగ్గుతుంది" - మోదీ

    ప్రధాని మోదీ, డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడ్రిక్‌సన్

    ఫొటో సోర్స్, ANI

    ప్రధాని మోదీ యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్ వెళ్లారు. కోపెన్ హాగెన్ లో వ్యాపార పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సమావేశానంతరం ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

    ఈ సమావేశంలో డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడ్రిక్‌సన్ కూడా ఉన్నారు.

    ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "నేడు భారతదేశం ఏమి సాధిస్తున్నా, ఆ ప్రయోజనాలను ఒక్క భారతదేశం మాత్రమే పొందటం లేదు. ప్రపంచంలోని ఐదు వంతుల జనాభాకు ఆ ప్రయోజనాలు అందుతున్నాయి. భారతదేశంలోని ప్రతి కుటుంబానికి టీకాలను ఇవ్వలేకపోయినట్లైతే ఏమి జరిగి ఉండేదో ఊహించండి" అని అన్నారు. దాని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండి ఉండేదో ఊహించండి" అని అన్నారు.

    డెన్మార్క్‌లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశానికి వారు చేస్తున్న కృషిని అభినందించారు.

    భారత పౌరులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినాతన స్వదేశం, వలస వెళ్లిన దేశం కోసం పూర్తి స్థాయిలో పని చేస్తారని అన్నారు.

    “నేను ప్రపంచ దేశాల నాయకులను ఎవరిని కలిసినా కూడా తమ దేశాల్లో స్థిరపడిన భారతీయుల శాంతి స్వభావం, కష్టపడే తత్త్వం గురించి కథలు కథలుగా చెబుతారు" అని అన్నారు.

    "గత సంవత్సరం కోవిడ్ నిబంధనలను సడలించిన వెంటనే, భారతదేశం మొదటఫ్రెడ్రిక్‌సన్ కు ఆహ్వానం పలికింది. ఇది ఇరుదేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు నిదర్శనం".

    భారతదేశంలో పౌరుల కరవు తీరితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరవు కూడా తగ్గుతుంది. భారతదేశంలో పేద ప్రజలకు గృహాలు, పారిశుధ్య సౌకర్యాలు, పరిశుభ్రమైన నీరు, ఉచిత వైద్యం, ఆర్ధిక సహకారం అందించగలిగితే అది చాలా ప్రపంచ దేశాలకు భారత్ పై విశ్వాసాన్ని కలిగిస్తుంది" అని అన్నారు.

    ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడ్రిక్‌సన్ ఈరోజు ఇక్కడకు రావడం భారతీయుల పట్ల ఆమెకున్న గౌరవం, ప్రేమకు నిదర్శనమని అంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

  6. డ్రోన్లు భారత వైద్య పరిశ్రమలో పెనుమార్పులు తెస్తాయా?

  7. పిల్లలకు ఇచ్చే కోవోవేక్స్ ధర రూ. 900 నుంచి రూ. 225కి తగ్గింపు

    పిల్లలకు ఇచ్చే కోవోవేక్స్ ధర రూ. 900 నుంచి రూ. 225 కి తగ్గింపు

    ఫొటో సోర్స్, Getty Images

    సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 12 -17 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఇచ్చే కరోనా వ్యాక్సీన్కోవోవేక్స్ ధరను తగ్గించింది. ఈ ధరను రూ.900 నుంచి రూ.225కి తగ్గించింది. ఈ ధరలో పన్ను ఉండదు.

    కోవోవేక్స్ వ్యాధి నిరోధక టీకాలపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సిఫార్సులను అనుసరించి సోమవారం దీనిని కోవిన్ పోర్టల్‌లో చేర్చారు.

    మార్చి 3న, డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా 12-17 ఏళ్ల మధ్య వయసు పిల్లలకోసం కోవో వేక్స్ ఇచ్చేందుకు పరిమిత అనుమతులను ఇచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవోవాక్స్ ధర రూ.900కి బదులుగా రూ.225 అవుతుంది. ప్రయివేట్ ఆసుపత్రులు రూ.150 వరకు సర్వీస్ ఛార్జీ వసూలు చేయవచ్చు.

  8. అభిమానులకు ఈద్ శుభాకాంక్షలను తెలిపిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్

    ఈద్ శుభాకాంక్షలు చెప్పేందుకు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం పలికారు. ఈద్ సందర్భంగా వేలాది మంది అభిమానులు తారల ఇంటి ముందు గుమిగూడారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కరీనా కపూర్ కూడా కుటుంబంతో కలిసి ఈద్ జరుపుకున్నట్లు ఫోటోను షేర్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  9. ప్రమోద్ మహాజన్‌ను సొంత తమ్ముడే ఎందుకు హత్య చేశాడు?

  10. "భారత్‌లో పెట్టుబడులు పెట్టకపోతే అవకాశాన్ని కోల్పోయినట్లే" - మోదీ

    కోపెన్‌హాగెన్ లో ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, ARINDAM BAGCHI/TWITTER

    "ఈ మధ్య సోషల్ మీడియాలో 'ఎక్కడ తప్పిపోతామో అనే భయం'(ఫోమో - ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అనే పదం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది".

    "భారతదేశంలో అమలు చేసిన సంస్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను చూస్తేఇక్కడ పెట్టుబడులు పెట్టలేని వారంతా అవకాశాన్ని కోల్పోయినట్లే" అని కోపెన్‌హాగెన్ ఇండియా -డెన్మార్క్ బిజినెస్ ఫారంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ అన్నారు.

    "ఫోమో అంటే శుక్రవారం నాటి సాయంత్రాలు గురించి మాట్లాడుతున్నారని అనుకున్నాను. కానీ, అది భారతదేశం గురించి అని ఇప్పుడే అర్ధమయింది" అని ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడ్రిక్‌సన్ అన్నారు.

    ప్రధాని మోదీ యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్ వెళ్లారు. కోపెన్‌హాగెన్ లో వ్యాపార పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సమావేశానంతరం ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు.

  11. మెట్ గాలా 2022 - పది ఫొటోల్లో..

    న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియమ్‌లో మెట్ గాలా 2022 కార్యక్రమం సోమవారం రాత్రి జరిగింది.

    ఈ ఫ్యాషన్ ఈవెంట్‌కు హాలీవుడ్ ప్రముఖులు, సెలెబ్రటీలు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన 10 ఫొటోలు..

    కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్‌సన్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్‌సన్
    గాయకురాలు బిల్లీ ఎలిష్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, గాయకురాలు బిల్లీ ఎలిష్
    మోడల్ టేలర్ మారీ హిల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, మోడల్ టేలర్ మారీ హిల్
    వెనెస్సా హడ్జెన్స్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నటి వెనెస్సా హడ్జెన్స్
    ర్యాపర్ కిడ్ కుడి, నటుడు సెబాస్టియన్ స్టాన్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ర్యాపర్ కిడ్ కుడి, నటుడు సెబాస్టియన్ స్టాన్
    గాయని గ్వెన్ స్టెఫానీ

    ఫొటో సోర్స్, Reuters

    గాయని టెయానా టేలర్, మోడల్ విన్నీ హార్లో

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, గాయని టెయానా టేలర్, మోడల్ విన్నీ హార్లో
    బాయ్ మేగజీర్ ఎడిటర్ ఫ్రెడ్రిక్ రాబర్ట్‌సన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, బాయ్ మేగజీర్ ఎడిటర్ ఫ్రెడ్రిక్ రాబర్ట్‌సన్
    తన భార్య, నటి బ్లేక్ లివ్‌లీతో నటుడు ర్యాన్ రేనాల్డ్స్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, తన భార్య, నటి బ్లేక్ లివ్‌లీతో నటుడు ర్యాన్ రేనాల్డ్స్
    ఎలాన్ మస్క్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్
  12. రంజాన్: ఈద్గా వద్ద ముస్లింలకు మజ్జిగ పంచిన హిందువులు

    ఈద్గా వద్ద ముస్లింలకు మజ్జిగ పంచిన హిందువులు

    కాకినాడలో రంజాన్ ప్రార్థనల సందర్భంగా మత సామరస్యం పెంచేలా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.

    నగరానికి చెందిన శ్రీ భోగి గణపతి పీఠం నిర్వాహకులు ఈద్గా వద్ద ప్రార్థనలకు హాజరయ్యారు. ముస్లిం లకు శుభాకాంక్షలు తెలిపారు.

    అనంతరం భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో ముస్లిం లకు మజ్జిగ పంపిణీ చేశారు.

    కరోనా వంటి విపత్తుల కాలంలో అన్ని మతాలు సమైక్యంగా సేవలు నిర్వహించామని పీఠం ఉపాసకులు దూసర్లపుడి రమణ రాజు గుర్తు చేశారు. అన్ని మతాలు కలిసి మెలిసి సాగడమే ఈ పండుగల సారాంశం అని పేర్కన్నారు.

    హిందూ, ముస్లిం ఐక్యత చాటేలా మజ్జిగ పంపిణీ చేసిన భోగి గణపతి పీఠం నిర్వాహకులను మసీదు గురువు రజాక్ అభినందించారు.

    ఈద్గా వద్ద ముస్లింలకు మజ్జిగ పంచిన హిందువులు
  13. భారత ప్రధాని మోదీని పాకిస్తానీయులు ఎందుకు పొగుడుతున్నారు? ఆయన పాత వీడియో ఎందుకు వైరల్ అవుతోంది?

  14. CIA: అమెరికా గూఢచార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారతీయ అమెరికన్ నంద్ మూల్‌చందానీ

  15. పోప్ ఫ్రాన్సిస్: ‘రష్యాకు వస్తానని చెప్పినా సమాధానం రాలేదు’

    పోప్ ఫ్రాన్సిస్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించి మాట్లడటానికి తాను రష్యా వస్తానని సందేశం పంపినప్పటికీ ఆ దేశం నుంచి జవాబు రాలేదని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.

    ఇటలీ న్యూస్ పేపర్ కొరియేరా డెల్లా సీరాతో మాట్లాడిన పోప్, యుక్రెయిన్ మీద దాడి మొదలైన 20 రోజుల తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానంటూ ఆ దేశ అధ్యక్ష కార్యాలయానికి సందేశం పంపానని వెల్లడించారు. అయితే తన సందేశానికి ఇంత వరకు బదులు రాలేదని పోప్ చెప్పుకొచ్చారు.

    ఇటీల రష్యా ఆర్థోడాక్స్ చర్చ్ అధిపతి పేట్రియార్క్ కిరిల్‌తో తాను 40 నిమిషాలు జూమ్ కాల్ మాట్లాడానని పోప్ తెలిపారు. అయితే పేట్రియార్క్ కిరిల్ 20 నిమిషాల పాటు, రష్యా యుక్రెయిన్ మీద దాడికి దిగడాన్ని సమర్థిస్తూ మాట్లాడారని వెల్లడించారు.

  16. అశోక్ గహ్లోత్: ‘ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్

    ఫొటో సోర్స్, ANI

    రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పిలుపునిచ్చారు.

    ‘జోధ్‌పుర్‌లో గత రాత్రి జరిగింది దురదృష్టకరం. రాజస్థాన్‌లో అన్ని మతాల వారు వర్గాలు కలిసిమెలిసి జీవించడం ఆనవాయితీగా వస్తోంది. అందరూ శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.’ అని గహ్లోత్ అన్నారు.

    పరశురామ జయంతి సందర్భంగా జలోరీ గేట్ ప్రాంతంలో ఒక వర్గం వారు జెండాలు పెట్టడంతో వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా అధికారులు ఇంటర్నెట్ నిలిపివేశారు.

    ఈ ఘర్షణలు సోమవారం రాత్రి మొదలయ్యాయి. పరశురామ జయంతి సందర్భంగా ఒక సముదాయం జలోరీ గేట్ ప్రాంతంలో జెండాలతో అలంకరించింది. అయితే మరొక సముదాయం ఆ జెండాలను పీకేసి తమ జెండాలను ఉంచడంతోపాటు మైకులు కూడా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

    మంగళవారం ఈద్ ప్రార్థనల తరువాత మరొక సారి జెండాల గురించి ఘర్షణలు చెలరేగాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు.

    ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జోధ్‌పుర్ పోలీసు కమిషనర్ నవ్యజోతి గొగోయ్ తెలిపినట్లుగా వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది. వివాదానికి కారణమైన జెండాలను తొలగించినట్లు కమిషనర్ తెలిపారు.

  17. ఎల్‌ఐసీ ఐపీఓ: ‘రెండు నెలల్లో రూ.6 లక్షల కోట్లు ఏమయ్యాయ్?’

    ఎల్‌ఐసీ భవనం

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ మార్కెట్ విలువ తగ్గించడం మీద కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేసింది.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.12-14 లక్షల కోట్లుగా లెక్క కట్టగా రెండు నెలల్లోనే రూ.6 లక్షల కోట్లకు ఎలా తగ్గించారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.

    రేపు ఎల్‌ఐసీ ఐపీఓ మొదలు కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద ఆ పార్టీ విమర్శలు చేసింది.

    అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయని అయినా ఇప్పుడు ఎల్‌ఐసీ ఐపీఓను ఎందుకు తీసుకొస్తున్నారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

  18. ఈ కారు పది నిమిషాల్లో విమానంలా మారిపోతుంది

  19. హీట్‌వేవ్ అలర్ట్‌లలో దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి... ఎలా జాగ్రత్త పడాలి?

  20. చైనా: బతికున్న రోగిని శవాల బ్యాగ్‌లో వేసిన సిబ్బంది

    చైనా

    ఫొటో సోర్స్, Getty Images

    షాంఘైలో ఒక రోగిని చనిపోయాడని భావించి మృత దేహాలను తరలించే వ్యానులోకి ఎక్కించారు. ఈ కేసులో నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.

    ఆదివారం ఇద్దరు వ్యక్తులు ఒక మృత దేహం ఉన్న బ్యాగ్‌ను వ్యానులో ఎక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

    ఆ తరువాత ఒకరు బ్యాగ్ ఓపెన్ చేయగా ‘పేషెంట్ ఇంకా బతికే ఉన్నారు’ అంటూ మరొకరు అనడం వినిపిస్తోంది.

    ఈ ఘటన మీద తీవ్రమైన విమర్శలొచ్చాయి. దాంతో సంబంధిత అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, విచారణకు ఆదేశించింది.