నల్గొండ: హిండిస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని హిండిస్ ల్యాబ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

లైవ్ కవరేజీ

  1. ఈనాటి లైవ్ పేజీ ముఖ్యాంశాలు..

    స్థానికం:

    • నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని హిండిస్ ల్యాబ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

    జాతీయం:

    • ఆసియాలో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీ, ఎన్‌డీటీవీ మీడియా సంస్థలో 29.18 శాతం వాటాను పరోక్షంగా కొనుగోలు చేసింది.
    • బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం అసెంబ్లీ బలపరీక్షలో మెజారిటీ సాధించింది. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడతాయన్నారు నితీశ్.
    • దిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను కొనటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దానికి స్పందనగా, మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఆధారాలు ఉన్నాయని, ఆయన తప్పించుకోలేరని బీజేపీ అన్నది.
    • ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ భూభాగంలోకి ప్రమాదవశాత్తు పేలిన క్షిపణికి సంబంధించి భారత ప్రభుత్వం ముగ్గురు ఎయిర్ ఫోర్స్ అధికారులను పదవి నుంచి తొలగించింది.
    • బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి కరోనావైరస్ సోకింది. తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని బచ్చన్ విజ్ఞప్తి చేశారు.

    అంతర్జాతీయం:

    • రష్యాతో యుద్ధం మధ్యలో యుక్రెయిన్ స్వతంత్ర దినోత్సవం సాధారణంగా ముగిసింది.
    • జపాన్ కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రధాని ఫుమియో కిషిదా అన్నారు.

    ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. ముఖ్యమైన కథనాలు, విశ్లేషణలకు బీబీసీ తెలుగు పేజీ చూస్తుండండి.

  2. బ్లాక్ హోల్ నుంచి వచ్చే శబ్దం ఎలా ఉంటుందో తెలుసా... ఇదిగో వినండి

  3. 'జపాన్ కొత్త అణు ప్లాంట్లను నిర్మించడం గురించి ఆలోచించాలి'.. పీఎం కిషిదా

    ఫుమియో కిషిదా

    ఫొటో సోర్స్, REUTERS

    ఫొటో క్యాప్షన్, ఫుమియో కిషిదా

    జపాన్ కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం అన్నారు.

    2011 ఫుకుషిమా విపత్తు తరువాత జపాన్ అనేక అణు ప్లాంట్లను నిలిపివేసింది. ఇప్పుడు కొత్త ప్లాంట్లను నిర్మించాలని ప్రధాని పిలుపునివ్వడం జపాన్ విధానంలో వివాదాస్పదమైన మార్పు కావచ్చు.

    కాగా, యుక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ఇంధన ఖర్చులు.. వివిధ ఇంధన వనరుల ఆవశ్యకతను హైలైట్ చేస్తున్నాయని ఆయన అన్నారు.

    2050 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారాలన్న జపాన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అణుశక్తి అవసరమని కిషిదా అన్నారు.

    ఒక ఎనర్జీ పాలసీ మీటింగ్‌లో కిషిదా మాట్లాడుతూ, "కొత్త అణు ప్లాంట్ల నిర్మాణం గురించి ఆలోచించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న ప్లాంట్లను మళ్లీ ప్రారంభించి, వాటి జీవితకాలాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని" అన్నారు.

    జపాన్‌లో 2011లో ఒక భారీ భూకంపం సునామీకి దారి తీసింది. దాంతో, న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. సునామీ కారణంగా ఆ దేశం తూర్పు తీరంలో ఉన్న ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌లోని రియాక్టర్లను వరదలు ముంచెత్తాయి. రేడియేషన్ లీకేజీ వలన 1,50,000 కంటే ఎక్కువమందిని ఆ ప్రాంతాల నుంచి తరలించారు.

    అప్పటికి జపాన్‌లో 50 న్యూక్లియర్ రియాక్టర్లు నడుస్తున్నాయి. ఈ విపత్తు తరువాత 46 రియాక్టర్లను నిలిపివేశారని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.

    2021 ఏప్రిల్‌కు తొమ్మిది రియాక్టర్లను మళ్లీ ప్రారంభించారు. ఇంకో 14 రియాక్టర్లు పరిశీలనలో ఉన్నాయి.

  4. చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మానవులను సృష్టించే దారుణ ప్రయోగం.... దీన్ని ఎవరు, ఎలా చేశారు?

  5. బిహార్: 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసిపోరాడతాయన్న నితీశ్ కుమార్

    నితీశ్‌ కుమార్‌

    ఫొటో సోర్స్, ANI

    బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం అసెంబ్లీ బలపరీక్షలో మెజారిటీ సాధించింది. ఈ సందర్భంలో, నితీశ్ కుమార్ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలతో చుట్టుముట్టారు.

    బీజేపీ హిందూ, ముస్లింలను వేరు చేస్తోందని నితీశ్‌ కుమార్‌ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడతాయన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అన్ని మతాలు, కులాల వారు ఒక్క తాటిపైకి వస్తారని, 2024లో ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీని ఢీకొంటాయని అన్నారు.

    "దేశవ్యాప్తంగా పార్టీ నేతలంతా నాకు ఫోన్ చేసి 'మీరు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ' అభినందనలు తెలిపారు. 2024లో మనమంతా కలిసి పోరాడాలని వాళ్లతో చెప్పాను" అన్నారు నితీశ్ కుమార్.

  6. ఎన్‌డీటీవీలో ఎంత వాటాను అదానీ సొంతం చేసుకున్నారు.. ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇవీ 5 ముఖ్యాంశాలు

  7. నల్గొండ: హిండిస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

    నల్గొండ హిండిస్ ల్యాబ్స్

    ఫొటో సోర్స్, UGC

    నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని హిండిస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ల్యాబ్‌లోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

    ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

    "ప్రమాదంలో ఇప్పటి వరకూ ఎవరూ మరణించలేదు. ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఒకరి పరస్థితి ఆందోళనకరంగా ఉంటే హైదరాబాద్ తరలించాం. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో, వారిని కూడా హైదరాబాద్ తరలిస్తున్నాం" అని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బీబీసీతో చెప్పారు.

    నల్గొండ హిండిస్ ల్యాబ్స్

    ఫొటో సోర్స్, UGC

    పిట్టంపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ కంపెనీ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించిందని, పెద్దఎత్తున పొగ ఎగిసిపడుతోందని రెండు కిలోమీటర్ల దూరంలోని మరో కంపెనీలో పనిచేస్తున్న వెలిమినేడు వాసి ఒకరు బీబీసీతో చెప్పారు.

    ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగ వచ్చాయి. రసాయనాలు నేలపై ప్రవహించాయని, భయంతో కార్మికులు బయటకు పరుగులు తీసినట్టు తెలుస్తోంది.

    నల్గొండ హిండిస్ ల్యాబ్స్

    ఫొటో సోర్స్, UGC

    ప్రమాదం జరిగినప్పుడు ల్యాబ్‌లో 45 మంది ఉన్నట్లు హిండిస్ ల్యాబ్స్ సిబ్బంది తెలిపారని, హిండిస్ ల్యాబ్ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించడంలేదని స్థానికుడు ఒకరు బీబీసీతో చెప్పారు.

    రియాక్టర్ పెరగడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు కార్మికుల అభిప్రాయం. ప్రస్తుతం అగ్ని మాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నాయి.

  8. నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?

  9. 'మనీష్ సిసోడియా తప్పించుకోలేరు'.. ఆప్ ఆరోపణలపై స్పందించిన బీజేపీ

    సంబిత్ పాత్ర

    ఫొటో సోర్స్, TWITTER/BJP

    ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.

    దీనిపై బీజేపీ స్పందిస్తూ, మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఆధారాలు ఉన్నాయని, ఆయన తప్పించుకోలేరని అన్నది.

    బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "గత కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీలో పుడుతున్న కంగారు చూస్తుంటే, మనీష్ సిసోడియా విషయంలో వాళ్లు భయపడుతున్నారనడంలో సందేహం లేదు" అని అన్నారు.

    ఆప్ లేనిపోని మాటలు చెప్పి వృథా ప్రయత్నాలు చేస్తోందని, మనీష్ సిసోడియా కోట్లాది రూపాయలు స్కాం చేశారా లేదా అన్నది మాత్రం చెప్పడం లేదని ఆయన అన్నారు.

    మద్యం మాఫియాకు ఆమ్ ఆద్మీ పార్టీ లైసెన్సులు ఇచ్చిందని సంబిత్ పాత్ర ఆరోపించారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీలకు కూడా లైసెన్సులు ఇచ్చారని, పంజాబ్ ఎన్నికల కోసం ఆప్‌కు అవినీతి సొమ్ము కావలసి వచ్చింది కాబట్టే నిబంధనలను విస్మరించారని అన్నారు.

  10. మహారాష్ట్ర అసెంబ్లీలో ఘర్షణలు.. ఎమ్మెల్యేల మధ్య తోపులాట

    మహారాష్ట్ర

    ఫొటో సోర్స్, ANI

    బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్‌నాథ్ షిండే వర్గానికి, ప్రతిపక్షానికి మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి.

    గొడవ మొదలెట్టింది మీరంటే మీరని ఇరువర్గాలు పరస్పరం ఆరోపించుకున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    బుధవారం ఉదయం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట ధర్నాకి కూర్చున్నారు. షిండే వర్గం, బీజేపీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో విపక్షాల నేతలు కూడా నినాదాలు చేయడం ప్రారంభించారు.

    షిండే వర్గానికి వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నినాదాలు చేశారని, ఆ తరువాత ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయని అంటున్నారు.

  11. రష్యాతో యుద్ధం మధ్యలో.. యుక్రెయిన్ స్వతంత్ర దినోత్సవం...

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ నగరంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు సాధారణంగా.. భారీ సైనిక పరేడ్‌తో జరుగుతాయి.

    కానీ బుధవారం నాడు.. యుక్రెయిన్ యుద్ధ ట్యాంకులకు బదులుగా, ధ్వంసమైన రష్యా సైనిక వాహనాలను కీయెవ్ ప్రధాన వీధుల్లో ప్రదర్శించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి వేడుకలూ జరగలేదు.

    యుక్రెయిన్ స్వతంత్ర దినం నేపథ్యంలో బుధవారం నాడు రష్యా తమ దేశంలోని వివిధ నగరాలపై దాడులు చేస్తుందన్న భయాల కారణంగా.. రాజధాని కీయెవ్‌లో రెండు రోజుల పాటు బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్లను ప్రజలు సీరియస్‌గా పట్టించుకోవాలని విజ్ఞప్తులు చేశారు.

    బుధవారం యుక్రెయిన్ స్వతంత్ర దినమే కాదు.. యుక్రెయిన్ మీద రష్యా సైనిక దండయాత్ర ప్రారంభించి ఆరు నెలలు పూర్తవుతోంది.

    ఇటీవల రష్యా ఆక్రమిత క్రైమియాలో వరుస పేలుళ్లు, దాడులు.. రష్యా రాజధాని మాస్కోలో పుతిన్ సన్నిహితుడి కుమార్తెను కారు బాంబు దాడిలో హతమార్చిన ఘటనల నేపథ్యంలో ఇటీవల ఉద్రిక్తతలు పెరిగాయి.

  12. దిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను కొనటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది: ఆమ్ ఆద్మీ పార్టీ

    ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

    ఫొటో సోర్స్, ANI

    దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని తమ పార్టీలో చేరాలని బీజేపీ ప్రలోభపెట్టిందని, అలా చేరితే వారికి రూ. 20 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం నాడు మీడియా సమావేశంలో ఆరోపించారు.

    ఈ ఆరోపణను దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఉద్ఘాటించారు. ఆయన ప్రస్తుతం ఆరోపిత మద్యం కుంభకోణంలో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    బీజేపీ నలుగురు ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకోవటానికి ప్రయత్నించిందని, అది విఫలం కావటంతో మిగతా ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఇస్తామని చెప్తోందని, లేదంటే వారి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తాయని భయపెడుతోందని సిసోడియా ఆరోపించారు.

    ‘‘షిండే విషయంలో సఫలమైన మోదీజీ ప్రయోగం సిసోడియా మీద విఫలమైంది. ఇప్పుడు ఆ ప్రయోగాన్ని మా పార్టీ ఎమ్మెల్యేలు నలుగురి మీద చేస్తున్నారు. ‘మీరు పార్టీ ఫిరాయిస్తే మీకు రూ. 20 కోట్లు ఇస్తాం. మీతో పాటు ఇతర ఎమ్మెల్యేలను తీసుకొస్తే మీకు రూ. 25 కోట్లు ఇస్తాం’ అని వారికి చెప్తున్నారు’’ అని సంజయ్ సింగ్ ఆరోపించారు.

    ఈ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ ఆప్ మీద ప్రత్యారోపణలు చేసింది. మనీష్ సిసోడియా అవినీతికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  13. రష్యా - యుక్రెయిన్ యుద్ధానికి 6 నెలలు: ఇప్పటివరకు ఏం జరిగిందో ఆరు గ్రాఫిక్స్‌లో చూద్దాం

  14. వందేళ్ల కిందట మునిగిన అమెరికా నౌకను చూసి... బంగారం దొరికిందన్న బ్రిటిష్ డైవర్లు

  15. చైనా: యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత దుర్భర కరవు.. తీవ్ర విద్యుత్ సంక్షోభం.. షాంఘైలో చీకట్లు

  16. రెండేళ్ల విరామం తర్వాత మొదలైన ఇండియన్ -2 షూటింగ్

    ఇండియన్-2 పోస్టర్

    ఫొటో సోర్స్, KAMALHASSAN/INSTAGRAM

    రెండేళ్ల విరామం తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్-2 షూటింగ్ మొదలయింది.

    2020లో చెన్నై దగ్గర్లో షూటింగ్ సెట్‌లో క్రేన్ కూలి ప్రమాదం చోటు చేసుకోవడంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 10 మందికి గాయాలయ్యాయి.

    "గుడ్ మార్నింగ్ ఇండియన్స్. ఇండియన్ - 2 షూటింగ్ పునః ప్రారంభమైందని చెప్పడానికి ఆనందిస్తున్నాం. మీ అందరి సహకారం, ఆశీస్సులు కావాలి" అని అంటూ సినిమా దర్శకుడు శంకర్ షణ్ముగం ట్వీట్ చేశారు.

    కమల్ హాసన్ ఈ సెప్టెంబరులో షూటింగ్‌కు హాజరవుతున్నట్లు ఇన్స్టా పోస్ట్ ద్వారా తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. బ్రాహ్మోస్ క్షిపణి పేలుడు సంఘటనలో ముగ్గురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రభుత్వం

    బ్రాహ్మోస్ క్షిపణి

    ఫొటో సోర్స్, Getty Images

    ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ భూభాగంలోకి ప్రమాదవశాత్తు పేలిన క్షిపణికి సంబంధించి భారత ప్రభుత్వం ముగ్గురు ఎయిర్ ఫోర్స్ అధికారులను పదవి నుంచి తొలగించింది.

    ఈ సంఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.

    రొటీన్ కార్యకలాపాల్లో భాగంగా తలెత్తిన సాంకేతిక లోపాలే ఈ సంఘటనకు కారణమని భారత ప్రభుత్వం చెప్పింది.

    నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల కలిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకునిఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇస్లామాబాద్ భారత్ ను హెచ్చరించింది.

    ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించినట్లు భారతీయ నావికా దళం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

    వీటి నిర్వహణలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అవలంబించకపోవడం వల్ల బ్రాహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పేలినట్లు విచారణలో తేలింది.

  18. ‘ముధోల్ హౌండ్’ కుక్క ప్రత్యేకతలేంటి... దాన్ని ప్రధాని మోదీ భద్రతా బృందంలోకి ఎందుకు తీసుకుంటున్నారు?

  19. సోనాలీ ఫోగట్: టిక్‌టాక్ స్టార్ మరణం అనుమానాస్పదం అంటున్న కుటుంబ సభ్యులు

    సోనాలీ ఫోగట్

    ఫొటో సోర్స్, ANI

    బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించారు. సోనాలి తన సిబ్బందితో కలిసి గోవా వెళ్లారని, అక్కడ గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారని మీడియాలో కథనాలు వచ్చాయి.

    అయితే, ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఆమె మృతి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

    "మా సోదరికి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఆమెకు గుండె పోటు వచ్చి ఉండదు. ఆమె మరణం గురించి విచారణ జరిపించాలి" అని సోనాలీ అక్క రామన్ కోరారు.

    ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన ఫొటోను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

  20. బిహార్ ఆర్‌జే‌డీ నాయకుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు

    ఆర్‌జే‌డీ నాయకుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు

    ఫొటో సోర్స్, ANI

    బిహార్ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జే‌డీ)నాయకుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.

    ఆర్‌జే‌డీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు సుబోధ్ రాయ్‌‌తో పాటు ఆర్‌జే‌డీ నాయకులు సునీల్ సింగ్, అష్ఫక్ క్రీం, ఫయాజ్ అహ్మద్ ఇళ్లల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చేందుకు భూములు తీసుకున్నారన్న కుంభకోణ ఆరోపణలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    బిహార్‌లో జనతా దళ్ (యూ), ఆర్‌జే‌డీ సంకీర్ణంతో ఏర్పాటైన ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవలసి ఉంది.

    ఇదంతా రాజకీయ కుట్ర అని ఆర్‌జే‌డీ కౌన్సిల్ సభ్యుడుసునీల్ సింగ్ అన్నారు. ఈయనను లాలూకి సన్నిహితుడని అంటారు.

    ఈ దాడులను ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారు. వీటికి అర్ధం లేదు. ఎమ్‌ఎల్‌ఏలు భయపడి బీజేపీ వైపు తిరుగుతారని ఈ సోదాలు చేస్తున్నారు" అని అన్నారు.

    లాలూ రైల్వే మంత్రిగా పని చేస్తున్నప్పుడు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    "బీజేపీ ఎవరి పైనా నేరారోపణలు చేయడం లేదు. సంవత్సరంన్నర క్రితం బిహార్ ప్రభుత్వ సహకార సంస్థ నుంచి కొన్ని కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సోదాలు అందులో భాగంగా జరుగుతూ ఉండవచ్చు" అని బిహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ అన్నారు.