నేటి ముఖ్యాంశాలు
- ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జగ్దీప్ ధన్కర్ పేరును ఎన్డీయే ప్రకటించింది.
- తన బంధువుల కంపెనీలు అన్నీ తనవేనంటూ టీడీపీ ఆరోపిస్తోందని, అలాగైతే.. హెరిటేజ్ కూడా తనదే అవుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
- గత నెలలో ఒహియో పోలీసుల చేతిలో చనిపోయిన 25 ఏళ్ల నల్లజాతి వ్యక్తి శరీరంపై 45 బుల్లెట్ గాయాలు ఉన్నాయని శవపరీక్షలో తేలింది.
- ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 2020 ఫిబ్రవరి 29న మోదీ ఈ ఎక్స్ప్రెస్వేకి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లో ఈ ఎక్స్ప్రెస్వేను పూర్తిచేశారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైప్ అప్డేట్లను ముగిస్తున్నాం.















