ఈ రోజు లైవ్ పేజీలో ముఖ్యాంశాలు
* కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
* టీమ్ ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించారనే ఆరోపణలపై జర్నలిస్టు బోరియా మజుందార్పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది.
* యూరప్లో పర్యటిస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. స్వీడన్ ప్రధాన మంత్రి మగ్దలేనా ఆండెర్సన్తో బుధవారం భేటీ అయ్యారు.
* కేరళలోని పాలక్కడ్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 20కి పెరిగింది.
* రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ఇప్పుడు రెపో రేటు 4.40 శాతంగా మారింది.
* టాలీవుడ్ మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ముంబయి సెషన్సు కోర్టు బుధవారం బెయిలు మంజూరుచేసింది.