‘కేటీఆర్.. ఏపీకి రండి.. అభివృద్ధి చూపిస్తా’ – కేసీఆర్‌ను కలిశాక ఏపీ మంత్రి రోజా ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా శుక్రవారం తన కుటుంబంతో సహా హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రం గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడినవని తాను అనుకోవటం లేదన్నారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. ఈనాటి ముఖ్య పరిణామాలు ఇవీ

    • పంజాబ్‌లోని పటియాలాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణకు సంబంధించి శివసేన నాయకుడు హరీష్ సింగ్లాను అరెస్ట్ చేశారు.
    • భారతదేశపు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గత వారంలో 327.1 కోట్ల డాలర్ల మేర తగ్గిపోయాయని ఆర్‌బీఐ సమాచారాన్ని ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
    • విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేయటానికి ఒప్పందం చేసుకున్న కొన్ని రోజుల్లోనే తన టెస్లా కంపెనీలో దాదాపు 400 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.
    • యుక్రెయిన్ యుద్ధం ముగియడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిర్సియా అభిప్రాయపడ్డారు.
    • భవిష్యత్తు తరాల కోసం తీసుకునే అప్పులను అప్పులుగా చూడకూడదని.. తాము తీసుకునే ప్రతి పైసా అప్పు మరొక పైసను సృష్టిస్తుందని దాన్ని పెట్టుబడిగా చూడాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
    • దేశంలో గత 24 గంటల్లో 3,377 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 2,496 మంది కోలుకోగా 60 మంది చనిపోయారు. మొత్తం 17,801 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

    ఇవీ ఈనాటి ముఖ్య పరిణామాలు. దీనితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.

    రష్యా - యుక్రెయిన్ యుద్ధం తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీనిఫాలో అవండి.

  2. యాదగిరి గుట్టలో కుప్పకూలిన బిల్డింగ్.. ముగ్గురు కూలీలు మృతి

    యాదగిరి గుట్టలో కుప్పకూలిన భవనం

    తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో శుక్రవారం నిర్మాణంలో ఉన్న ఓ రెండంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది.

    ఈ దుర్ఘటనలో.. భవనంలో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు చనిపోయారు.

    స్థానికులు, అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  3. ఆచార్య‌ రివ్యూ: కొరటాల శివ, చిరంజీవి సినిమా.. పాఠమా? గుణపాఠమా?

  4. పంజాబ్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత – శివసేన నాయకుడు అరెస్ట్

    పంజాబ్‌లో ఉద్రిక్తత

    ఫొటో సోర్స్, ANI

    పంజాబ్‌లోని పటియాలాలో శుక్రవారం కాళీ మందిర్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగటంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలను అదుపులో ఉంచటానికి పోలీసులను మోహరించారు.

    ఇటీవల భారతదేశంలో నిషిద్ధ సంస్థ అయిన సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు చెందిన గురుపత్వంత్ సింగ్ పన్ను.. ఏప్రిల్ 29వ తేదీన డీసీ కార్యాలయం వద్ద ఖలిస్తాన్ పతాకాన్ని ఎగురవేస్తామని ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా తాము ప్రదర్శన నిర్వహిస్తామని శివసేన ప్రకటించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    శుక్రవారం నాడు సిక్కు సంస్థలు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అని నానాదాలు చేయటం.. దానికి ప్రతిగా శివసేన ‘ఖలిస్తాన్ ముర్దాబాద్’ అని నినాదాలు చేయటంతో ఉద్రిక్తత తలెత్తిందని బీబీసీ ప్రతినిధి మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు.

    పంజాబ్‌లో ఉద్రిక్తత

    ఫొటో సోర్స్, ANI

    ఈ ఉద్రిక్తత అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని.. వాతావరణం మరింత దిగజారకుండా చూసేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించామని పోలీసులు చెప్పారు.

    పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం రాత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత.. ఈ ఘర్షణకు సంబంధించి శివసేన నాయకుడు హరీష్ సింగ్లాను అరెస్ట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పటియాలా ఘటన దురదృష్టకరమని సీఎం భగ్వంత్ మాన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర డీజీపీతో తాను మాట్లాడానని, ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించటం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు అత్యంత ప్రాధాన్యమైన అంశాలని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    అయితే ప్రతిపక్ష పార్టీలు పంజాబ్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించాయి. సరిహద్దు రాష్ట్రంలో పూర్తి అరాచకత్వం నెలకొన్నదంటూ.. కేజ్రీవాల్ దీనికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తారా అని బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా ట్వీట్ చేశారు.

    మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో పంజాబ్‌లో శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతిన్నాయని కాంగ్రెస్ పార్టీ నిందించింది.

  5. వారం రోజుల్లో 327 కోట్ల డాలర్లు తగ్గిన భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు

    అమెరికా డాలర్లు

    ఫొటో సోర్స్, JUNG YEON-JE

    భారతదేశపు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గత వారంలో 327.1 కోట్ల డాలర్ల మేర తగ్గిపోయాయని ఆర్‌బీఐ సమాచారాన్ని ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఏప్రిల్ 22వ తేదీతో ముగిసిన వారానికి దేశ ఫారిన్ ఎక్సేంజ్ రిజర్వులు 60,042.30 కోట్ల డాలర్లకు తగ్గాయని చెప్పింది.

    దానికి ముందు వారంలో ఈ నిల్వలు 31.10 కోట్ల డాలర్ల తగ్గి 60,369.40 కోట్ల డాలర్లుగా ఉన్నాయని వివరించింది.

    ఏప్రిల్ 22వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోవటానికి ప్రధాన కారణం.. విదేశీ నగదు ఆస్తులు (ఫారిన్ కరెన్సీ అసెట్స్), బంగారం నిల్వలు తరిగిపోవటమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం నాడు విడుదల చేసిన వీక్లీ డాటా చెప్తోంది.

    ఆ వారంలో ఫారిన్ కరెన్సీ అసెట్స్ 283.50 కోట్ల డాలర్లు పడిపోయాయి 53,393.30 కోట్లకు తగ్గాయి.

    డాలర్ పరిభాషలో చెప్తే.. ఫారిన్ కరెన్సీ అసెట్స్‌లో విదేశీ మారక నిల్వలుగా ఉంచుకునే యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువ హెచ్చుతగ్గుల ప్రభావం ఉంటుంది.

    ఇక అదే వారంలో బంగారం నిల్వలు 37.7 కోట్లు తగ్గి 4,276.8 కోట్లకు దిగజారింది.

  6. ‘కేటీఆర్.. ఏపీకి రండి.. అభివృద్ధి చూపిస్తా’ – కేసీఆర్‌ను కలిశాక రోజా ఆహ్వానం

    కేసీఆర్‌ను కలిసిన ఆర్.కె.రోజా

    ఫొటో సోర్స్, @RojaSelvamaniRK

    పొరుగు రాష్ట్రంలో కరెంటు, రోడ్లు బాగోలేదంటూ తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి ఉంటారని తాను అనుకోవట్లేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు.

    ‘‘ఒక‌వేళ ఆయ‌న ఏపీ గురించి అని ఉంటే.. తీవ్రంగా ఖండిస్తున్నాను. టూరిజం అండ్ యూత్ మినిస్ట‌ర్‌గా కేటీఆర్ ని రాష్ట్రానికి సాద‌రంగా ఆహ్వానిస్తున్నాను.. ఏపీకి రండి’’ అని ఆమె ఆహ్వానించారు.

    రోజా శుక్రవారం నాడు హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు.

    ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాను. మంత్రి అయిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చినపుడు కుటుంబ సభ్యులతో ప్రగతి భవన్‌కు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అందుకోసమే మా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిశాను’’ అని చెప్పారు.

    కల్వకుంట్ల కవితను కలిసిన ఆర్.కె.రోజా

    ఫొటో సోర్స్, @RojaSelvamaniRK

    ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రం గురించి మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ గురించి విలేకరులు ప్రస్తావించారు. ‘‘అవి వాటప్స్‌లో చూశాను. అందులో ఏపీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారని అనుకోను. మిగతా రాష్ట్రాల గురించి తాను వ్యాఖ్యానించినట్టు అర్థమైంది’’ అని రోజా స్పందించారు.

    ‘‘ప్రత్యేకంగా ఏపీ గురించి తాను మాట్లాడినట్లయితే నేను ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏపీలో జరిగిన అభివృద్ధిని మంత్రి కేటీఆర్‌ను తీసుకువెళ్లి చూపిస్తాను’’ అని చెప్పారు.

    ‘‘ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి తీసుకువ‌చ్చిన అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను, విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను కేటీఆర్ గారికి ద‌గ్గ‌రుండి చూపిస్తాను.. బ‌డులు, ఆస్ప‌త్రుల‌ను ఏ విధంగా తీర్చిదిద్దారో చూపిస్తాను, రోడ్లు ఏ విధంగా వేశారో చూపిస్తాను.. స‌చివాల‌య‌, వాలంటీర్ వ్య‌వస్థ ద్వారా నేరుగా సంక్షేమ ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల‌ గడప వద్దకేఅందుతున్న సేవ‌ల‌ను చూపిస్తాను.. కేటీఆర్ ఇవన్నీ చూసిన త‌ర్వాత తెలంగాణలో కూడా ఇటువంటి విప్ల‌వాత్మ‌క సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని అనుకుంటారు’’ అని రోజా వ్యాఖ్యానించారు.

    అయితే.. కరెంటు సమస్య అన్ని రాష్ట్రాల్లోనూ ఉందన్నారు.

  7. ‘మా నాన్న కనీసం ఆసుపత్రిలో చనిపోయారు, వేలాది మంది రోడ్ల మీదే ప్రాణాలొదిలారు’

  8. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్: ‘విదేశీ టెక్నాలజీ’ వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయా?

  9. ట్విటర్ కొన్న తర్వాత.. టెస్లాలో 400 కోట్ల డాలర్ల విలువైన షేర్లు అమ్మిన ఎలాన్ మస్క్

    ఎలాన్ మస్క్

    ఫొటో సోర్స్, REUTERS

    విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేయటానికి ఒప్పందం చేసుకున్న కొన్ని రోజుల్లోనే తన టెస్లా కంపెనీలో దాదాపు 400 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.

    ఎలాన్ మస్క్ ట్విటర్‌ను 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయటానికి డీల్ కుదుర్చుకున్నారు. ఆ కొనుగోలును పూర్తి చేయటానికి టెస్లా షేర్లను విక్రయించినట్లు భావిస్తున్నారు.

    టెస్లా కంపెనీలో 44 లక్షల షేర్లను ఎలాన్ మస్క్ మంగళ, బుధవారాల్లో విక్రయించినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు సమాచారం ఇచ్చారు.

    అయితే.. ‘‘ఈ రోజు అమ్మకం తర్వాత టెస్లా షేర్లను విక్రయించేది లేదు’’ అంటూ లాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తర్వాత టెస్లా షేర్ల ధర కొంత మేరకు పెరిగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఇదిలావుంటే ఎలాన్ మస్క్ ట్విటర్‌లో 9 శాతం వాటా కొనుగోలు చేసినప్పటి నుంచీ టెస్లా షేర్ల ధర దాదాపు 20 శాతం తగ్గింది.

    మస్క్ గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 1,640 కోట్ల డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించిన తర్వాత.. మళ్లీ ఆ సంస్థ షేర్లను విక్రయించింది ఇప్పుడే.

    టెస్లాలో 10 శాతం షేర్లను విక్రయించాలా వద్దా అని ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఫాలోయర్లను అడిగిన తర్వాత ఈ విక్రయం చేశారు.

    ఎలాన్ మస్క్ తాను ట్విటర్‌లో 9.2 శాతం వాటా కొన్నానని ఈ నెల ఆరంభంలో ప్రకటించిన తర్వాత టెస్లా షేర్ల ధర 20 శాతం మేర తగ్గింది.

    ఒక్క మంగళవారం నాడే టెస్లా కంపెనీ మార్కెట్ విలువలో 12,500 కోట్ల మేర విలువ తుడిచిపెట్టుకుపోయింది.

  10. పాకిస్తాన్‌ వైపు నుంచి భారత్‌లోకి వచ్చిన చైనా తయారీ డ్రోన్‌ను కూల్చేశామన్న బీఎస్ఎఫ్

    అమృత్‌సర్ సెక్టార్‌లోని ధనోయ్ కలాన్ గ్రామానికి సమీపంలో ఎగురుతున్న డ్రోన్‌ను కూల్చేసినట్లు బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ – బీఎస్ఎఫ్ ప్రకటించింది.

    'అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పెట్రోలింగ్ చేస్తున్న సైనికులకు తెల్లవారుఝామున ఏదో శబ్ధం వినిపించింది. దాన్ని లక్ష్యంగా చేసుకుని సైనికులు పారా బాంబులు ప్రయోగించారు' అని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారని ఏఎన్ఐ పేర్కొంది.

    'ఆ తర్వాత ఉదయం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని, అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో డ్రోన్ లభించిందని, దానిపై మేడిన్ చైనా అని రాసుంద'ని బీఎస్ఎఫ్ వెల్లడించింది.

    పాకిస్తాన్‌వైపు నుంచి భారత్‌లోకి వచ్చిన ఈ డ్రోన్‌ను అమృత్‌సర్ సెక్టార్‌లోని రామ్ తిరాత్ ప్రాంతంలో కూల్చివేసినట్లు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. యుక్రెయిన్ యుద్ధం ముగియడానికి చాలా ఏళ్లు పట్టొచ్చు – నాటో డిప్యూటీ సెక్రటరీ

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది. అందులో రాకెట్ల తయారీ ప్లాంట్‌ కూడా ఉంది.

    కీయెవ్‌లో రష్యా నిన్న చేసిన మిసైల్ దాడిలో తమ జర్నలిస్టు విరా హైరిచ్ చనిపోయారని రేడియో లిబర్టీ వెల్లడించింది.

    మిసైల్ దాడి జరిగినప్పుడు ఆమె తన ఇంట్లో ఉందని రేడియో లిబర్టీ సంస్థ తెలిపింది.

    మరియుపూల్‌లోని అజొవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌లోని ప్రజలను తరలించేందుకు తాము ప్రయత్నాలు చేస్తామని యుక్రెయిన్ ప్రకటించింది.

    యుక్రెయిన్‌లో మానవతా సాయం చేస్తున్న ఇద్దరు బ్రిటిష్ వాలంటీర్లను రష్యా సైన్యం అదుపులోకి తీసుకుంది.

    రష్యా యుద్ధ నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించడానికి ఒక నిపుణుల బృందాన్ని యుక్రెయిన్‌కు పంపిస్తామని బ్రిటన్ వెల్లడించింది.

    యుక్రెయిన్ యుద్ధం ముగియడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిర్సియా అభిప్రాయపడ్డారు.

    జర్నలిస్టు విరా హైరిచ్

    ఫొటో సోర్స్, Vera/Facebook

    ఫొటో క్యాప్షన్, జర్నలిస్టు విరా హైరిచ్ రష్యా మిసైల్ దాడిలో చనిపోయారని రేడియో లిబర్టీ వెల్లడించింది.
  12. కూచిపూడి నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యిందంటే..

  13. మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?

  14. ఆంధ్రప్రదేశ్: మొబైల్ థియేటర్.. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు..

  15. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం, రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి, అసలు తగ్గించాల్సింది ఎవరు?

  16. ఆచార్య‌: కొరటాల శివ, చిరంజీవి సినిమా.. పాఠమా? గుణపాఠమా?

  17. కేటీఆర్: ‘పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలోనే పరిస్థితులు బాగున్నాయ్’

    తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

    ఫొటో సోర్స్, Facebook/KTR

    తమ పక్కరాష్ట్రంలో కరెంటు, నీళ్ల కష్టాలతోపాటు రోడ్డులన్నీ అధ్వానంగా ఉన్నట్లు అక్కడి మిత్రులు తనకు చెబుతున్నట్లుగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

    ‘నా ఫ్రెండు ఒకరు సంక్రాంతికి పక్క రాష్ట్రం వెళ్లారు. అక్కడ ఆయనకు తోటలు, ఇల్లు ఉన్నాయి. వెళ్లి వచ్చిన తరువాత ఫోన్ చేశారు. ‘సర్, నాలుగు రోజులున్నా మా ఊర్లో... అక్కడ కరెంటు లేదు... నీళ్లు లేవు... రోడ్డులన్నీ ధ్వంసమై ఉన్నాయ్... అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్లీ తిరిగి వచ్చిన తరువాతనే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది.’ అని నాకు చెప్పాడు.’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

    తాను చెప్పేది అబద్ధమైతే ఎవరైనా కారు వేసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్లి చూడాలని అన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

    నేడు హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు.

  18. ఇంటర్నేషనల్ డాన్స్ డే: ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి కుగ్రామంలోని సంప్రదాయ నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యింది?

  19. పర్వతంపై బండరాళ్లన్నీ గుడి గంటల్లా ఎందుకు శబ్దం చేస్తున్నాయి?

    గంటల్లా గణగణ మోగే ఈ వింత బండరాళ్లు బనాస్కాంఠా జిల్లాలో ఉన్నాయి. ఈ రాళ్లున్న నల్ల పర్వతం గురించి ఆ ప్రాంతంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ఇలా ఎందుకు శబ్దం చేస్తున్నాయో శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  20. కేటీఆర్: ‘మేం తీసుకునే ప్రతి పైసా అప్పుతో మరొక పైస సృష్టిస్తున్నాం’

    తెలంగాన ఐటీశాఖ మంత్రి కేటీఆర్

    ఫొటో సోర్స్, KTR/Facebook

    భవిష్యత్తు తరాల కోసం తీసుకునే అప్పులను అప్పులుగా చూడకూడదని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

    తాము తీసుకునే ప్రతి పైసా అప్పు మరొక పైసను సృష్టిస్తుందని దాన్ని పెట్టుబడిగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల చేసి, తెలంగాణను అప్పులు కుప్పగా మార్చారంటూ చాలా మంది అర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు.

    ఇవాళ తెలంగాణలో తాగు నీటికి, విద్యుత్‌కు కొరత లేదంటే తాము అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టడం వల్లేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు.