దిల్లీలో కోవిడ్ కేసులు: గత వారం రోజుల్లో 48 శాతం పెరిగిన హోం ఐసోలేషన్ కేసులు

దిల్లీలో రోజువారీ కరోనావైరస్ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. గత వారం రోజుల్లో హోం ఐసోలేషన్‌ కేసుల సంఖ్య 48 శాతం పెరిగింది. పాజిటివిటీ రేటు కూడా 2.39 శాతం పెరిగినట్లు తాజా లెక్కలు సూచిస్తున్నాయి.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ & శారద మియాపురం

  1. నేటి ముఖ్య పరిణామాలివీ...

    దిల్లీలో పాజిటివిటీ రేటు 2 శాతానికి పైగా పెరిగింది. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి సంఖ్య గత వారంలో 48 శాతం పెరిగింది.

    యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 వేల మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ తెలిపింది.

    రష్యాలో యుక్రెయిన్ ‘ఉగ్రవాదదాడులు’, ‘విధ్వంసచర్యల’కు ప్రతీకారంగా కీయెవ్‌పై మరిన్ని దాడులు చేస్తామని రష్యా హెచ్చరించింది.

    ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం రవాణా మీద ఆంక్షలు పెట్టారు. ఏపీ వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న వాహనాలను తెలంగాణ అధికారులు అడ్డుకుంటున్నారు.

    అవసరమైనన్ని కోర్టులు ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పించినప్పుడే కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.

    నల్ల సముద్రంలో తమ ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మాస్క్వా మునిగిపోయిందని రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

    తాము క్షిపణులతో దాడి చేయడం వల్లే ఈ నౌక ధ్వంసమైందని యుక్రెయిన్ తెలిపింది. అయితే, నౌకలో ఉన్న మందు గుండు సామాగ్రి పేలిందని రష్యా చెబుతోంది.

    ఇవీ ఈ నాటి ముఖ్య పరిణామాలు. ఇక్కడితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.

    యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.

  2. యుక్రెయిన్: 'రష్యన్లు మమ్మల్ని చంపవచ్చు... కానీ, వారు కూడా ప్రాణాలతో మిగలరు' - బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో జెలియెన్‌స్కీ

  3. అంబేడ్కర్ అంటే దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత... అంతేనా?

  4. దిల్లీలో పెరుగుతోన్న కరోనా పాజిటివిటీ రేటు, వారంలోనే 48 శాతం పెరిగిన హోం ఐసోలేషన్‌

    కరోనా కేసులు

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా కేసులు దిల్లీలో రోజురోజుకీ పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు 2 శాతానికి పైగా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నవారి సంఖ్య గత వారంలో 48 శాతం పెరిగింది.

    గురువారం 574 మంది హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు, 325 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. దీంతో పాజిటివిటీ రేటు 2.39 శాతంగా నమోదైంది.

    అన్ని వయస్సుల వారు వైరస్ బారిన పడుతున్నట్లు, హోం ఐసోలేషన్‌కు వెళ్తున్నట్లు పీటీఐ చెప్పింది.

    గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దిల్లీలో ఏప్రిల్ 1న కరోనా పాజిటివిటీ రేటు 0.57 శాతం ఉండగా, ఏప్రిల్ 14కు 2.39 శాతానికి పెరిగింది.

    కరోనాతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరగడం లేదని, అనవసరపు ఆందోళన అక్కర్లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

  5. రష్యా-యుక్రెయిన్: సముద్రంలో మునిగిన రష్యా భారీ యుద్ధ నౌక 'మాస్క్వా' గురించి మనకేం తెలుసు?

  6. పోరస్ కంపెనీకి ఉన్న పర్మిషన్‌లేంటి, అది చేస్తున్న పనులేంటి... పారిశ్రామిక ప్రమాదాలను నివారించలేమా?

  7. ఆర్టీసీ బస్సులో 1.90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

    ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో పోలీసులు, ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 1.90 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    జగ్గయ్యపేటలోని గరికపాడులో శుక్రవారం పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ఈ నగదు పట్టుబడింది. దీనితో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డబ్బుకు సంబంధించిన సరైన వివరాలు లేకపోవడంతో దీన్ని ఆదాయపన్ను శాఖకు తరలించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు జరిగిన నష్టం ఇది: యుక్రెయిన్

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 20వేల మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ తెలిపింది.

    ఈ మేరకు యుక్రెయిన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది.

    యుక్రెయిన్ రక్షణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం రష్యాకు జరిగిన నష్టం ఇది.

    సైనికులు - 20వేలు

    ట్యాంకులు - 756

    ఆర్మర్డ్ మెషీన్స్/APV - 1976

    ఆర్టిలరీసిస్టమ్ - 366

    యుద్ధ విమానాలు- 163

    హెలికాప్టర్లు- 144

    ఆటోమోటివ్ - 143

    నౌకలు, బోట్లు- 08

    చమురు ట్యాంకులు - 76

    UAV- 135

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన శారూ... ప్రేమతో నీ రాజా'

  10. కీయెవ్‌పై మరిన్ని దాడులు చేస్తాం... రష్యా హెచ్చరిక

    యుక్రెయిన్

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ లక్ష్యంగా క్షిపణి దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

    రష్యాలో యుక్రెయిన్ ‘ఉగ్రవాద దాడులు’, ‘విధ్వంసచర్యల’కు ప్రతీకారంగా కీయెవ్‌పై మరిన్ని దాడులు చేస్తామని రష్యా హెచ్చరించింది.

    తమ క్రూయిజ్‌ మిసైళ్లు కీయెవ్‌ నగరంలోని ఒక ఫ్యాక్టరీని ఢీకొట్టాయని రష్యా తెలిపింది.

    ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, యాంటీ-షిప్ మిసైళ్లను ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తుంటారు.

    తమ పట్టణాలపై దాడులు చేసేందుకు యుక్రెయిన్ శుక్రవారం హెలికాప్టర్లను సరిహద్దులకు పంపిస్తోందని రష్యా ఆరోపించింది.

    అయితే, మాస్కో వాదనలను బీబీసీ స్వయంగా వెరిఫై చేయలేకపోయింది.

  11. యుక్రెయిన్‌ యుద్ధానికి 50 రోజులు.. ఫొటోలు

    యుక్రెయిన్‌లో యుద్ధానికి నేటితో 50 రోజులు.

    అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ ఫొటోలు.

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ శివార్లలో ఉన్న ఒక గ్రామంలోని స్కూల్ వద్ద ధ్వంసమైన సాయుధ వాహనం పక్కనుంచి వెళ్తున్న వ్యక్తులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ శివార్లలో స్కూల్ వద్ద ధ్వంసమైన సాయుధ వాహనం పక్కనుంచి వెళ్తున్న వ్యక్తులు
    దోన్బస్‌లోని యుక్రెయిన్ సైనికులు. రష్యా ఇప్పుడు తన దృష్టిని ఈ ప్రాంతంపై కేంద్రీకరించింది.

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, దోన్బస్‌లోని యుక్రెయిన్ సైనికులు. రష్యా ఇప్పుడు తన దృష్టిని ఈ ప్రాంతంపై కేంద్రీకరించింది.
    బుచాలో యుక్రెయిన్‌ సిబ్బంది. ఇక్కడ వందలాది మంది పౌరులు చనిపోయారు. వారిని సామూహిక ఖననం చేశారని యుక్రెయిన్ చెబుతోంది.

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, బుచాలో యుక్రెయిన్‌ సిబ్బంది. ఇక్కడ వందలాది మంది పౌరులు చనిపోయారు. వారిని సామూహిక ఖననం చేశారని యుక్రెయిన్ చెబుతోంది.
    లీవ్‌ ఇప్పటికీ సురక్షిత నగరంగానే ఉంది. వేలాది మంది యుక్రెయిన్ ప్రజలకు ఈ నగరం ఆశ్రయం ఇస్తోంది.

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, లీవ్‌ ఇప్పటికీ సురక్షిత నగరంగానే ఉంది. వేలాది మంది యుక్రెయిన్ ప్రజలకు ఈ నగరం ఆశ్రయం ఇస్తోంది.
  12. మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..

  13. నరమేధం అంటే ఏంటి?

  14. ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) అంటే ఏంటి?

  15. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం రవాణా మీద ఆంక్షలు, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం రవాణా మీద ఆంక్షలు పెట్టారు.

    ఏపీ వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న వాహనాలను తెలంగాణ అధికారులు అడ్డుకుంటున్నారు.

    ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, సూర్యాపేట జిల్లా కోదాడ సరిహద్దుల్లో రామాపురం క్రాస్ తెలంగాణాకు చెందిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    ధాన్యం బస్తాలతో తెలంగాణవైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వాహనాలను నిలువరిస్తున్నారు. వాటిని అడ్డుకుని వెనక్కి పంపించేస్తున్నారు.

    తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నుంచి తరలిస్తున్న 30 టన్నుల ధాన్యంతో వస్తున్న లారీని అడ్డుకున్నారు.

    సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాచారం, దామచర్ల మండలం వాడపల్లి వద్ద కూడా ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    తెలంగాణలో శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న తరుణంలో ఏపీ నుంచి కొందరు రబీ ధాన్యం అటు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    మాసూళ్లు ప్రక్రియ పూర్తి చేసుకుని కొందరు రైతులతో పాటుగా వ్యాపారులు కూడా తెలంగాణాలో ధాన్యం అమ్మకాలకు యత్నిస్తుండడంతో తెలంగాణ అధికారులు రంగంలో దిగారు.

    గురువారం నుంచే పలు వాహనాలను వెనక్కి పంపేశారు. శుక్రవారం కూడా ఈ తనిఖీలు కొనసాగిస్తూ ట్రాక్టర్లు సహా వివిధ వాహనాలను వెనక్కి పంపించారు.

    ఏపీ నుంచి ధాన్యం లోడులను తెలంగాణాలోకి అనుమతించేది లేదని, అందరూ సహకరించాలని సూర్యాపేట జిల్లా అధికారులు విజ్ఞప్తిచేశారు.

  16. హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సు

    అవసరమైనన్ని కోర్టులు ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పించినప్పుడే కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.

    న్యాయ వ్యవస్థపై పెండింగ్ కేసుల భారం తీవ్రంగా ఉందని చెప్పారు.

    ‘కేసులు పెరుగుతున్నాయి.. ఒక కేసు విచారణకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది’ అని సీజేఐ ప్రశ్నించారు.

    హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. నేడే ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం, తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

    ఒంటిమిట్ట

    ఫొటో సోర్స్, ugc

    ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి టీటీడీ, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

    కొత్తగా నిర్మించిన శాశ్వత కల్యాణ మండపంలో మొదటిసారి కల్యాణం జరుగుతోంది.

    52 ఎకరాల్లో కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 10గంటల మధ్యలో పెళ్లి ముహూర్తం ఉంది.

    ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు.

    రాములోరి కల్యాణం చూసేందుకు సుమారు 52 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

    భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ముత్యాల తలంబ్రాలను టీటీడీ అందించనుంది.

    3500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

    ఒంటిమిట్ట

    ఫొటో సోర్స్, ugc

  18. తెలంగాణ: రాయితీతో ట్రాఫిక్ చలానాలు కట్టేందుకు ఇవాళే చివరి రోజు

    పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను రాయితీతో చెల్లించేందుకు హైదరాబాద్‌ పోలీసులు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.

    రాయితీలతో జరిమానాలు కట్టేందుకు ఇది వరకు మార్చి 1 నుంచి మార్చి 31 అవకాశం కల్పించారు.

    ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఆ తర్వాత ఈ అవకాశాన్ని ప్రభుత్వం మరో 15 రోజులు పొడిగించింది. ఆ గడువు నేటితో ముగియనుంది.

    ట్రాఫిక్ పోలీస్

    ఫొటో సోర్స్, Hyderabad Traffic Police

  19. మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?

  20. ఇప్పటి వరకు ఏం జరిగింది?

    జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, Handout

    మీరు లైవ్‌ పేజీ ఇప్పుడే చూస్తున్నట్టయితే, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం.

    నల్ల సముద్రంలో తమ ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మోస్క్వా మునిగిపోయిందని రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

    తాము క్షిపణులతో దాడి వల్లే ఈ నౌక ధ్వంసమైందని యుక్రెయిన్ తెలిపింది. అయితే, నౌకలో ఉన్న మందు గుండు సామాగ్రి పేలిందని రష్యా చెబుతోంది.

    ఈ నౌక మునిగిపోవడం రష్యా నౌకదళానికి పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు.

    యుక్రెయిన్-రష్యా యుద్ధం 50వ రోజుకు చేరుకుంది.

    యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పోరాటం కొనసాగుతోంది.

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో పేలుడు శబ్ధాలు వినిపించాయి. అలాగే ఖేర్సన్‌లో కూడా పేలుళ్లు జరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి.

    చమురు, గ్యాస్‌ను ఇకపై ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యా నుంచి వస్తున్న చమురు, గ్యాస్‌ను కొనకుండా యురోపియన్ దేశాలు మార్కెట్‌ను అస్థిరపరుస్తున్నాయని ఆయన ఆరోపించారు.

    మరోవైపు, రష్యా నుంచి ఇంకా చమురు కొంటున్న దేశాలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశాలు ‘ఇతరుల రక్తంతో డబ్బు సంపాదిస్తున్నాయని’ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.

    యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న తమ భూభాగాలపై ఆ దేశం దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది.