పశ్చిమ బెంగాల్: బీజేపీని ఎదుర్కొని మూడోసారి విజయం సాధించిన తృణమూల్‌ కాంగ్రెస్‌, నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓటమి

బీజేపీని ఎదుర్కొని పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. అయితే నందిగ్రామ్‌లో ఆమె బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. టీఎంసీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. నందిగ్రామ్‌ ఫలితంపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్న మమత

    మమతా బెనర్జీ

    ఫొటో సోర్స్, Getty Images

    పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హాట్రిక్ విజయం సాధించింది. ఎన్నికల సంఘం ఇప్పటివరకూప్రకటించిన గణాంకాలను బట్టి టీఎంసీ 209 స్థానాల్లో విజయం సాధించింది. 76 స్థానాల్లో గెలిచిన బీజేపీ రెండో స్థానంలో ఉంది.

    మమతా బెనర్జీ రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆదివారం మధ్యాహ్నానికే ఒక స్పష్టత వచ్చింది.

    కానీ నందిగ్రామ్ ఫలితం మాత్రం రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు విరుద్ధంగా వచ్చింది. బెంగాల్‌లోని ఈ హై-ప్రొఫైల్ స్థానంలో అర్థరాత్రి వరకూ ఓట్ల లెక్కింపు కొనసాగింది.

    చివరికి మమత ప్రత్యర్థి శుభేందు అధికారి ఇక్కడ గెలిచినట్లు ప్రకటించారు. బెంగాల్లో ఘన విజయం సాధించినప్పటికీ, తను పోటీ చేసిన చోట మమత ఓటమి మూటగట్టుకున్నారు.

    ఆ తర్వాత ఆమె నందిగ్రామ్ స్థానంలో ఓట్లు మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. కానీ ఆమె వినతిని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

    నందిగ్రామ్ స్థానం ఓట్ల లెక్కింపులో గందరగోళం, అవకతవకలు జరిగాయని మమత ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం తీరుపై కోర్టుకు వెళ్తానని చెప్పారు.

    “ఎన్నికల సంఘం దారుణ వైఖరికి వ్యతిరేకంగా మేం సుప్రీంకోర్టుకు వెళ్తాం” అని ఆమె చెప్పారు.

    నిజానికి ఆదివారం ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు మమతా బెనర్జీ కొన్ని రౌండ్లు బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారికంటే వెనకబడ్డారు. కానీ, కాసేపటి తర్వాత ఆమె ఆధిక్యం సాధించారు.

    బీజేపీ, తృణమూల్ అభ్యర్థుల మధ్యా హోరాహోరీ పోటీ కనిపించింది. కొన్ని రౌండ్లలో ఇద్దరి మధ్యా 6 ఓట్ల నుంచి 1200 ఓట్ల తేడా నమోదైంది. కానీ అర్థరాత్రి అన్ని రౌండ్లు లెక్కింపు పూర్తైన తర్వాత శుభేందు అధికారి విజయం సాధించారు.

    విజయం తర్వాత మాట్లాడిన శుభేందు అధికారి “ప్రేమ, నమ్మకం, ఆశీస్సులు, మద్దతు అందించి నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్న నందిగ్రామ్ ప్రజలకు రుణపడి ఉంటా. నేను వారి సేవకు, సంక్షేమానికి పనిచేస్తూనే ఉంటానని మాట ఇస్తున్నా. మీకు కృతజ్ఞతలు” అన్నారు.

  2. నందిగ్రామ్: చివరి వరకూ కొనసాగిన సస్పెన్స్, 1956 ఓట్ల తేడాతో మమతపై గెలిచిన శుభేందు అధికారి

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా భావిచిన నందిగ్రామ్ స్థానంలో చివరికి బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి విజయం సాధించారు.

    ఎన్నికల కమిషన్ జారీ చేసిన గణాంకాల ప్రకారం ఆయన తన ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని 1956 ఓట్ల తేడాతో ఓడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆసక్తికరమైన విషయం ఏంటంటే శుభేందు మమతా బెనర్జీ సన్నిహిత నేతల్లో ఒకరుగా నిలిచారు. ఆయన ఆమె ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

    ఎన్నికలకు ముందు తృణమూల్ వీడి బీజేపీలో చేరారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ స్థానంలో శుభేందు అధికారే గెలిచారు.

    ఆదివారం జరిగిన కౌంటింగ్ సందర్భంగా నందిగ్రామ్ స్థానం ఫలితంపై చివరి వరకూ సస్పెన్స్‌ కొనసాగింది.

    మమత ఓటమి

    ఫొటో సోర్స్, ECI

    సాయంత్రం ఆ స్థానంలో మమతా బెనర్జీ 1200 ఓట్లతో విజయం సాధించారని మొదట వార్తలు వచ్చాయి.

    ఆ తర్వవాత మమత ఓడిపోయారని, అధికారి 1600 ఓట్ల తేడాతో గెలిచారని కూడా వార్తలు వచ్చాయి.

    చివరికి శుభేందు 1956 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు.

  3. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఫలితంపై కొనసాగుతున్న సస్పెన్స్

    పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘన విజయం సాధించింది. కానీ, అందరి దృష్టి ఇప్పుడు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ ఫలితాలపైనే ఉంది.

    నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి మమతా బెనర్జీపై పోటీ చేశారు. అయితే, ఇంతవరకూ ఎన్నికల కమిషన్ అధికారికంగా నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించలేదు.

    ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో రాత్రి 10 గంటలకు అప్డేట్ చేసిన వివరాల ప్రకారం శుభేందు అధికారికి 94,824 ఓట్లు, మమతా బెనర్జీకి 98,923 ఓట్లు వచ్చాయి. మమతాకు 48.98 శాతం ఓట్లు పోలయ్యాయి. శుభేందు అధికారికి 46.95 ఓట్లు వచ్చాయి.

    మరోవైపు బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి నందిగ్రామ్‌లో తాను గెలిచినట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో సహా అనేకమంది బీజేపీ మంత్రులు శుభేందుకు శుభాకాంక్షలు తెలిపారు.

    అయితే, అంతకుముందు మమతా బెనర్జీ 1200 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తరువాత మమతా ఓడిపోయారని, శుభేందు 1600 ఓట్ల మెజారిటీతో గెలిచారని వార్తలు వచ్చాయి.

    ఈ స్థితిలో, టీఎంసీ అధికార ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతోందని, ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని సమాచారం వచ్చింది.

    తాజా వివరాల ప్రకారం మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఎన్నికల కమిషన్ ఇంకా గెలుపు ఎవరిదన్నది ప్రకటించలేదు.

    భారత ఎన్నిల కమిషన్ వెబ్‌సైట్

    ఫొటో సోర్స్, ECI

    ఫొటో క్యాప్షన్, భారత ఎన్నిల కమిషన్ వెబ్‌సైట్
  4. కాంగ్రెస్ స్పందన: 'ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. భవిష్యత్తులో మరింతగా శ్రమిస్తాం'

    ఎన్నికల ఫలితాలను మేం వినయంగా ఆమోదిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించిన మమతా బెనర్జీకి పార్టీ అభినందనలు తెలిపింది.

    పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి ప్రజలు తమ తీర్పును స్పష్టంగా ప్రకటించారు. ఈ ఎన్నికల ఫలితాలను మేము వినయంతో, బాధ్యతతో అంగీకరిస్తున్నాం. ఎన్నికల ఫలితాలు మా అంచనాలకు అనుగుణంగా లేవనే అంశంపై భిన్నాభిప్రాయాలు లేవు" అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఒక ప్రకటన విడుదల చేశారు.

    మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళ, అసోంలలో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

    "కేరళ, అసోం రాష్ట్రాల్లో ఫలితాలు మాకు నిరాశను మిగిల్చాయి. మేము ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ ధైర్యాన్ని, మనోబలాన్ని కోల్పోలేదు. అలాగే, ముందుకు వెళ్లాలనే సంకల్పాన్ని చేజార్చుకోలేదు. ఈ ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పునః సమీక్షించుకుంటుంది. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించి, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో మరింత తీవ్రంగా కృషిచేస్తాం.

    కేరళ, అసోం ఎన్నికల ఫలితాలు మాకు ఆందోళన కలిగించాయి. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎన్నికల బరిలో చాలా కష్టపడ్డారు. కానీ, ప్రజల అభిప్రాయం మాకు అనుకూలంగా లేదని అర్థమైంది" అని ఈ ప్రకటనలో తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. మమతా దీదీకీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపారు.

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేంద్రం తన సహాయ సహకారాల్ని ఎప్పటిలాగే కొనసాగిస్తుందని, కోవిడ్‌పై పోరాటంలో అండగా ఉంటుందని అంటూ మోదీ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. పశ్చిమ బెంగాల్: బీజేపీ సర్వశక్తులు మోహరించినా... మమతా దీదీ హ్యాట్రిక్ కొట్టేశారు

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై బీజేపీ పూర్తిగా దృష్టి సారించినప్పటికీ దీదీ మ్యాజిక్కే పనిచేసింది.

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున "ఖేలా హోబే" అనే నినాదాన్ని ఇచ్చారు. అంటే "ఆట కొనసాగుతుంది" అని అర్థం.

    నెలరోజులకు పైగా ఎనిమిది దశల్లో సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దీదీ నాయకత్వంలోని టీఎంసీ భారీ విజయం సాధించింది.

    మరోవైపు, తమ అమ్ములపొదిని దట్టంగా నింపుకుని ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ గెలుపు కల కలగానే మిగిలిపోయింది. ఆటలో హ్యాట్రిక్‌ కొట్టి అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ వర్గాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. కాగా, బెంగాల్‌లో బీజేపీ ఓటమికి కేంద్ర నాయకత్వాన్ని నిందిస్తూ విమర్శలు మొదయ్యాయి.

    మమతా బెనర్జీ

    ఫొటో సోర్స్, reu

  7. అసోంలో ఎన్ఆర్‌సీ గొడవ ఉన్నా... బీజేపీదే ఆధిక్యం

    అసోంలో ఎన్ఆర్‌సీ గొడవ నడుస్తున్నప్పటికీ బీజేపీ ఎలా ఆధిక్యంలోకి వచ్చింది? అసోం ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బీజేపీ మరోసారి విజయం సాధించేట్లు కనబడుతోంది.

    అసోంలో ఎన్నికలు ప్రారంభమైనప్పుడు, జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)కు సంబంధించిన సమస్య బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందనే ఊహాగానాలు వినిపించాయి. అయినప్పటికీ, బీజేపీ అక్కడ విజయాన్ని ఎలా నమోదు చేసుకోగలిగింది?

    దీనికి ఎన్నికల విశ్లేషకుడు సంజయ్ కుమార్ స్పందిస్తూ, "నాలుగు రాష్ట్రాల్లో మేము పోస్ట్ పోల్ సర్వే చేశాం. అక్కడ ఎన్ఆర్‌సీ, సీఏఏకు సంబంధించిన ప్రశ్నలు అడిగాం. అధికశాతం ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. చాలా కొద్దిమంది మాత్రమే సమర్థించారు. అయితే, ఎన్నికల్లో అందరూ ఇదొక్కటే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయరు. పార్టీ ఎంపిక, అభ్యర్థులతో ఉన్న సత్సంబంధాలు, పార్టీ విధానాలు నచ్చి ఉండవచ్చు. బీజేపీ గెలుపుకు ఇవే కారణాలు అయుండొచ్చు" అని అన్నారు.

    సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదరి మాట్లాడుతూ, "బీజేపీ విజయానికి సమర్థ నాయకత్వం కూడా కారణం కావొచ్చు. హిమంతా బిస్వా శర్మలాంటి నాయకులు వారికి ఉన్నారు. కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ ముఖం ఒక్కటీ లేదు" అని అన్నారు.

    అసోం

    ఫొటో సోర్స్, Getty Images

  8. మమతా బెనర్జీని అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

    "మరోసారి అధికారం చేపట్టబోతున్నందుకు శుభాకాంక్షలు" అంటూ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. 'ఎన్నికల మేనేజ్మెంట్ పనుల నుంచి తప్పుకుంటున్నా' -ప్రశాంత్ కిశోర్

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తానుఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల నుంచి విరమించుకోనున్నట్లు ఎన్‌డీటీవీ లైవ్ ప్రోగ్రాంలో తెలిపారు.

    ఎందుకు ఈ విధుల నుంచి వైదొలగుతున్నారన్న ప్రశ్నకు జవాబిస్తూ "నేను ఇప్పటికే చాలా చేశాను. ఎనిమిది తొమ్మిదేళ్లు ఈ పని చేయడం చాలా కష్టం. ఇప్పటికే నేను కావలసినంత చేశాను. నేను జీవితంలో ఇంకేదో చేయాలనుకుంటున్నాను. జీవితమంతా ఇదే పని చేస్తూ ఉండలేను. నేను చాలా సార్లు ఈ విషయాన్ని నా చుట్టూ ఉన్నవాళ్లతో పంచుకున్నాను” అని చెప్పారు.

    అంతేకాకుండా, “నా కంపెనీ ఐపాక్‌లో ఎంతో సమర్థులైన వ్యక్తులున్నారు. వారంతా ఇక్కడ పని చేస్తునారు. వారి క్రెడిట్ అంతా నాకొస్తోంది. ఇప్పుడు ఈ పని మొత్తం వారి చేతుల్లోకే తీసుకుని, ఐపాక్ బ్రాండ్ సత్తా ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది" అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

    అయితే, ప్రశాంత్ కిషోర్ అలిసిపోయారా? లేక క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా?

    "ఇప్పటివరకూ నేను చేస్తున్న పనే మళ్లీ చేయాలనుకోవట్లేదు. నేను చేయాల్సిందంతా చేశాను. ఇప్పుడింక ఐపాక్‌లో నా సహోద్యోగులు బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కొంచం విరామం తీసుకుని తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను. నేను రాజకీయాల్లోకి వస్తానో, రానో తెలీదు. కానీ, ప్రస్తుతానికి ఈ పని వదిలేయానుకుంటున్నాను" అని ఆయన అన్నారు.

    అయితే, ఐపాక్ సహోద్యోగులకు ఈ విషయం ముందే తెలుసా?

    "నా కంపెనీలో సీనియర్ పొజిషన్లో ఉన్న చాలామందికి ఈ విషయం తెలుసు" అని కిషోర్ చెప్పారు.

    ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వారి కంపెనీ తృణమూల్ కాంగ్రెస్ తరపున పని చేసింది.

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ రెండంకెలు దాటడానికే కష్టపడుతుంది అని జోస్యం చెబుతూ ప్రశాంత్ కిషోర్ గత ఏడాది ట్వీట్ చేశారు.

    ప్రశాంత్ కిశోర్

    ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

  10. కేరళలో చరిత్రాత్మక విజయం దిశగా ఎల్‌డీఎఫ్

    కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) పార్టీ చరిత్రాత్మక విజయం దిశగా పయనిస్తోంది. మొత్తం 140 స్థానాల్లో ప్రస్తుతం ఎల్‌డీఎఫ్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

    ఈ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ పూర్తి విజయం సాధిస్తే, కేరళలో గత నాలుగు దశాబ్దాలుగా ప్రతీ ఎన్నికలకు అధికారం పార్టీలు మారే సంప్రదాయానికి తెర పడినట్లే.

    కేరళలో ఒకసారి వామపక్షాలు గెలిస్తే, మరొకసారి కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణం గెలుస్తూ ఉంటుంది. కానీ, ఈ ఎన్నికల్లో మలయాళీలు లెఫ్ట్ పార్టీకి రెండోసారి కూడా పట్టం కడుతున్నారు. బీజేపీ ప్రస్తుతం నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    కణ్ణూర్ జిల్లాలోని ధర్మాదం అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సమీప ప్రత్యర్థిపై 13 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    పినరాయి విజయన్

    ఫొటో సోర్స్, TWITTER@vijayanpinarayi

  11. 'మమతా దీదీకీ శుభాకాంక్షలు' -దిల్లీ సీఎం కేజ్రీవాల్

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అభినందిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

    "భారీ విజయాన్ని సాధించినందుకు దీదీకి శుభాకాంక్షలు. ఎంత గొప్ప పోరాటం! పశ్చిమ బెంగాల్ ప్రజలకు నా అభినందనలు" అని తెలిపారు.

    ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఫలితాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో 200కు పైగా స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 78 స్థానాల్లో ముందుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. మమత, విజయన్, స్టాలిన్‌లకు అభినందనలు తెలిపిన శరద్ పవార్

    మమతా బెనర్జీ, పినరయి విజయన్, స్టాలిన్‌లకు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అభినందనలు తెలిపారు.

    "మీ అద్భుత విజయానికి అభినందనలు. మహమ్మారిని ఎదుర్కొంటూ, ప్రజా సంక్షేమాన్ని సాధించేందుకు సమిష్టిగా కృషి చేద్దాం" అని పవార్ ట్వీట్ చేశారు.

    అలాగే కేరళలో, తమిళనాడులో విజయాల బాటలో ఉన్న విజయన్, స్టాలిన్‌లకు కూడా శుభాభినందనలు తెలియజేశారు. "కేరళ ఎన్నికల్లో రెండోసారి చారిత్రక విజయాన్ని సాధించినందుకు పినరయి విజయన్‌కు అభినందనలు. మనమంతా సమిష్టిగా ఈ ఎన్నికల్లో పోరాడాం. ఇప్పుడు సమిష్టిగా కోవిడ్‌పై యుద్ధం చేద్దాం." అని అన్నారు.

    తమిళనాడులో విజయపథంలో ఉన్న స్టాలిన్‌కు అభినందనలు తెలిపిన శరద్ పవార్, ఈ విజయానికి మీరు పూర్తుగా అర్హులు. మీపై విశ్వాసం ఉంచిన ప్రజలకు మీరు పూర్తి సేవ అందించాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  13. విజయోత్సవాలపై మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ఈసీ

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎక్కువ స్థానాల్లో ఫలితాల సరళి వెల్లడైంది.

    దీంతో విజయానికి చేరువవుతున్న పార్టీల మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

    చాలా ప్రాంతాల్లో జనం భారీగా గుమిగూడి డాన్సులు చేస్తూ, పాటలు పాడుతున్నారు.

    ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ స్వీట్లు తినిపించుకుంటున్నారు.

    ఇలాంటి విజయోత్సవాలను నిషేధించినట్లు ఎన్నికల సంఘం ఇంతకు ముందే ప్రకటించింది.

    కానీ విజయోత్సాహంలో ఉన్న కార్యకర్తలు ఈ మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు కనిపించడం లేదు.

    దీంతో ఎన్నికల సంఘం మరోసారి దీనిపై హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి వేడుకలు వెంటనే నిలిపివేయాలని, ఇది ఈసీ మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది.

    దీనిపై ఒక ప్రకటన జారీ చేసిన ఎన్నికల సంఘం, దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పింది.

    మళ్లీ ఆదేశాలు జారీ చేస్తున్నామని, పార్టీల కార్యకర్తలు, అందరూ తమ ఆదేశాలు పాటించేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

    విజయోత్సవాలు జరుగుతున్న ప్రాంతాల్లో, బాధ్యులైన ఎస్‌హెచ్ఓ, మిగతా అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని, వారిపై క్రిమినల్/క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.

    ఎన్నికల సంఘం ఆదేశాలు

    ఫొటో సోర్స్, ECI

  14. మమతా బెనర్జీకి అఖిలేష్ యాదవ్ అభినందనలు

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడంతో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీకి అభినందనలు తెలిపారు.

    ప్రస్తుతం రాష్ట్రంలో 292 స్థానాలకు 284 స్థానాల ఫలితాల సరళి వెల్లడయ్యాయి. వీటిలో తృణమూల్ 202, బీజేపీ 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    “పశ్చిమ బెంగాల్లో బీజేపీ విద్వేష రాజకీయాలను ఓడించిన ప్రజలు, మమతా బెనర్జీ, టీఎంసీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు” అని ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    బీజేపీ నేతలు ఒక మహిళను 'దీదీ ఓ దీదీ' అంటూ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు ఇది ప్రజలు ఇచ్చిన సమాధానం అన్నారు. దానితోపాటూ అఖిలేష్ 'దీదీ జీవో దీదీ' అనే హాష్‌టాగ్ కూడా పెట్టారు.

  15. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, అస్సాంలో బీజేపీ, తమిళనాట డీఎంకే ముందంజ

    మమతా బెనర్జీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటివరకూ ఫలితాల సరళిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.

    పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంటే, అస్సాంలో బీజేపీ ఆధికారంలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 126 స్థానాల్లో 119 ఫలితాల ట్రెండ్స్ వచ్చాయి. బీజేపీ 60 స్థానాల్లో ముందంజలో ఉంది.

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Getty Images

    కేరళలో ఈసారీ ట్రెండ్‌కు తెరపడేలా కనిపిస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారుతుంది.

    కానీ ఈసారీ పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో కొనసాగేలా కనిపిస్తోంది.

    ఇక్కడ ఇప్పటివరకూ సీపీఎం 55, కాంగ్రెస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాహుల్ గాంధీ కేరళ నుంచి ఎంపీగా ఎన్నికవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేనట్లు కనిపిస్తోంది.

    వామ పక్షాలు

    ఫొటో సోర్స్, Getty Images

    మరోవైపు తమిళనాడులో విపక్షం డీఎంకే అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. డీఎంకే 118 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార అన్నాడీఎంకే 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    ఇక్కడ బీజేపీ 4, కాంగ్రెస్ 12 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

    ఇక, పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాల్లో ఆల్ ఇండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ 5, బీజేపీ 3 సీట్లలో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యం సంపాదించింది.

  16. పినరయి విజయన్ పనితీరుకు కేరళ ప్రజలు పట్టం కట్టారు- ప్రకాశ్ కారత్

    కేరళలో గత 40 ఏళ్లలో ఒక ప్రభుత్వాన్ని వరసగా రెండోసారి ఎన్నుకుంటున్నారంటే ఇది గణనీయమైన విజయం అని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ అన్నారు.

    రాష్ట్రంలో ఎల్డీఎఫ్ ముందంజలో ఉండడంపై మాట్లాడిన ఆయన వరదల సమయంలో, కరోనా మహమ్మారి వచ్చినపుడు, ప్రజాభివృద్ధిలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పనితీరును కేరళ ప్రజలు మెచ్చుకున్నారని ఇది నిరూపిస్తోందని ఆయన చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. లోక్‌సభ ఉప ఎన్నికలలో ఎక్కడ ఎవరు ముందంజలో ఉన్నారంటే..

    వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే, ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు.

    కర్ణాటకలోని బెళగాంలో బీజేపీ అభ్యర్థి, కేరళలోని మలప్పురంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి, తమిళనాడులోని కన్యాకుమారిలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. West Bengal: 200 దాటిన టీఎంసీ ఆధిక్యం

    పశ్చిమ బెంగాల్

    ఫొటో సోర్స్, ECI

    పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తృణమూల్ ఆధిక్యం 200 దాటింది.

    ఇప్పటివరకూ 284 స్థానాల్లో ఫలితాల సరళిని ప్రకటించగా.. తృణమూల్ 202, బీజేపీ 77 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

    కాంగ్రెస్ ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. డీఎంకే కార్యాలయం బయట సంబరాలు

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం 234 స్థానాలకు 230 స్థానాల ఫలితాల సరళిని ఈసీ ప్రకటించింది.

    డీఎంకే 117 స్థానాల్లో ముందంజలో ఉండగా, అధికార అన్నాడీఎంకే 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    దీంతో డీఎంకే కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తల సంబరాలు మొదలయ్యాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు నిరాశ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నట్టు ఇప్పటివరకూ అందిన ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.

    ఈసీ వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 275 స్థానాల ట్రెండ్ బయటికి రాగా, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేరు. తర్వాత ఒక చోట కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కనిపించారు.

    ఇక్కడ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న టీఎంసీ 187 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు బీజేపీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    అస్సాంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. రాష్ట్రంలో బీజేపీ 56 సీట్లలో, కాంగ్రెస్ 28 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

    మూడో స్థానంలో ఉన్న ఆల్ ఇండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతూ ఉంటుంది. అక్కడైనా మళ్లీ అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి.

    కేరళలో కాంగ్రెస్ 24 స్థానాల్లో, సీపీఎం 56 సీట్లలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారే సంప్రదాయానికి ఈసారీ తెరపడేలా కనిపిస్తోంది.

    తమిళనాడులో విపక్ష డీఎంకే అధికారం అందుకునే దిశగా వెళ్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం కేవలం 10 స్థానాల్లో ముందంజలో ఉంది.

    పుదుచ్చేరిలో ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అక్కడ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.