You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పౌరసత్వం రద్దు: అస్సాంలో '50 మంది ఆత్మహత్య'
జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్ఆర్సీ) తుది గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అక్రమ వలసదారుల పేరిట ఈశాన్య భారతంలోని అస్సాంలో 40 లక్షల మంది ప్రజల పౌరసత్వాన్ని రద్దు చేశారు. పౌరసత్వం రద్దు కావడంతో, భవిష్యత్తు ఏమవుతుందోననే భయంతో 50 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. గత రెండు వారాల్లోనే ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్నవారిలో జైనాల్ అలీ ఒకరు. ఈ నెల 4న జైనాల్ ఇంటికి సమీపంలోనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు.
అస్సాంలోని బొంగాయిగావ్ జిల్లాలోని డోమెర్పురి గ్రామంలో జైనాల్ కుటుంబం నివసిస్తోంది. ఇది దేశ రాజధాని దిల్లీకి 1,800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది.
గత ఏడాది విడుదలైన ఎన్ఆర్సీ జాబితాలో జైనాల్ పేరు లేదు.
పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు సంబంధిత ఫారం నింపినప్పటికీ ఆయన ఎప్పుడూ భయపడుతూనే ఉండేవారని భార్య మహెలా ఖాతూన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అస్సాం: 40 లక్షల మంది ప్రజలు భారతీయులు కాదు
- పిల్లల్లో పోషకాహార లోపానికి బ్యాక్టీరియాతో పరిష్కారం దొరుకుతుందా
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- కర్ణాటక ముఖ్యమంత్రి: అడ్వాణీకి వర్తించిన రూల్ యడ్యూరప్పకు వర్తించదా
- 'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- అమర్నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- టిక్టాక్ యాప్ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- క్రికెట్ స్పోర్ట్ కాదు.. క్రీడగా గుర్తించేందుకు నిరాకరించిన ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)