పోలవరం: మాకు అన్నంపెట్టే పొలం, అడవితల్లి.. రెండూ దూరమవుతున్నాయంటున్న పోలవరం నిర్వాసితులు: BBC River Stories
పడవ ప్రయాణం తప్ప వేరే దారిలేని పల్లెలివి. అన్నం పెట్టే పొలమూ, అడవీ దూరం అవుతూండడంతో, భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది ఈ గిరిజనుల్లో. ఓ వైపు పోలవరం ప్రాజెక్టు ఎందరో రైతుల పొలాలకు నీరందిస్తుంటే, ఇక్కడున్న రైతులు మాత్రం రైతు కూలీలుగా మారిపోతారు.
పోలవరం ప్రాజెక్టు కింద 274 గ్రామాలు మునిగిపోతున్నాయి. వీటిలో గిరిజన గ్రామాలే ఎక్కువ. ఈ గ్రామాల్లో నివసించే గిరిజనులకు వారికున్న కొద్దిపాటి పొలం, పక్కనే ఉన్న కొండే జీవనాధారం. కానీ, పోలవరం ప్రాజెక్టుతో ఈ పొలాలన్నీ మునిగిపోతాయి. ఈ కొండకి వారు దూరం అవుతారు.
కొండ రెడ్లు ఎక్కువగా ఉండే మంటూరు గ్రామానికి బీబీసీ ప్రతినిధులు బళ్ల సతీశ్, నవీన్ కుమార్ వెళ్లారు.
ఇవి కూడా చదవండి.
- కాంక్రీటుకు గిన్నిస్ రికార్డు ఎలా సాధ్యపడింది? ఇంత కాంక్రీటు పోశారని ఎలా లెక్కిస్తారు?
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- పోలవరం గ్రౌండ్ రిపోర్ట్: అసలేం జరుగుతోందక్కడ?
- 'అక్కడే చనిపోయినా బాగుండేది'
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- కాళేశ్వరం ప్రాజెక్టు: ఎందుకింత ప్రత్యేకం
- 'గంగ ప్రక్షాళన జరిగిందా? మేం ఆ నీటిని పరీక్షించాం.. అందులో ఏం తేలిందంటే...'
- క్రికెట్: 2019 ప్రపంచ కప్లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- త్వరగా గడ్డకట్టేది చల్లటి నీళ్లా.. వేడి నీళ్లా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)