పోలవరం: మాకు అన్నంపెట్టే పొలం, అడవితల్లి.. రెండూ దూరమవుతున్నాయంటున్న పోలవరం నిర్వాసితులు: BBC River Stories

వీడియో క్యాప్షన్, మాకు అన్నంపెట్టే పొలం, అడవితల్లి.. రెండూ దూరమవుతున్నాయంటున్న పోలవరం నిర్వాసితులు

పడవ ప్రయాణం తప్ప వేరే దారిలేని పల్లెలివి. అన్నం పెట్టే పొలమూ, అడవీ దూరం అవుతూండడంతో, భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది ఈ గిరిజనుల్లో. ఓ వైపు పోలవరం ప్రాజెక్టు ఎందరో రైతుల పొలాలకు నీరందిస్తుంటే, ఇక్కడున్న రైతులు మాత్రం రైతు కూలీలుగా మారిపోతారు.

పోలవరం ప్రాజెక్టు కింద 274 గ్రామాలు మునిగిపోతున్నాయి. వీటిలో గిరిజన గ్రామాలే ఎక్కువ. ఈ గ్రామాల్లో నివసించే గిరిజనులకు వారికున్న కొద్దిపాటి పొలం, పక్కనే ఉన్న కొండే జీవనాధారం. కానీ, పోలవరం ప్రాజెక్టుతో ఈ పొలాలన్నీ మునిగిపోతాయి. ఈ కొండకి వారు దూరం అవుతారు.

కొండ రెడ్లు ఎక్కువగా ఉండే మంటూరు గ్రామానికి బీబీసీ ప్రతినిధులు బళ్ల సతీశ్, నవీన్ కుమార్ వెళ్లారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)