భారత్-చైనా ఘర్షణలు... టిబెట్ శరణార్థి కష్టాలు

వీడియో క్యాప్షన్, భారత్-చైనా ఘర్షణలు... టిబెట్ శరణార్థి కష్టాలు

"నేను 1992లో టిబెట్ నుండి వచ్చాను. గత 28 ఏళ్లుగా భారత్‌లోనే ఉంటున్నాను. టిబెట్‌లో ఉన్న మాకుటుంబసభ్యులతో వియ్‌చాట్ యాప్ వీడియోకాల్ ద్వారా మాట్లాడేవాడ్ని. ఎందుకంటే, ఈ యాప్ వాడటానికి సులువుగా ఉంటుంది. టిబెట్‌లో VPN వాడినవారికి కఠిన శిక్షలుంటాయి" అంటున్నారు టిబెట్‌ శరణార్థి నీమా వాంగ్డూ.

లద్దాఖ్‌లో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత భారత్‌లో అనేక చైనా యాప్‌ల వినియోగం నిషేధించారు. దీంతో భారత్‌లో నివసిస్తున్న టిబెటన్లు తమ కుటుంబసభ్యులతో మాట్లాడటం కష్టంగా మారింది. వీరంతా గతంలో తమవారితో మాట్లాడడానికి, డబ్బులు పంపించడానికే కాకుండా వ్యాపార లావాదేవీల కోసం కూడా ఈ యాప్స్ ఉపయోగించేవారు. నీమా లాంటి మరికొందరి మనోగతం ఏమిటో ఇక్కడ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)